‘ఇంటర్ బోర్డు’ కార్యాలయం వద్ద విద్యార్ధి సంఘాల ఆందోళన..

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ఫలితాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపధ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్ధి సంఘాలు భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. అసలు చదువు చెప్పకుండా విద్యార్దులను పరీక్షలలో ఫెయిల్ చేయాసారంటూ ఆరోపించారు.

ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలా మంది విద్యార్దులు ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయారని, అందువల్ల ఫెయిల్ అయిన విధ్యార్దులందరినీ పాస్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధి సంఘాల నాయకులు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్టేషన్ కు తరలించారు.