Shruthi Hassan: కర్మ తప్పకుండా శిక్ష విధిస్తుంది… వైరల్ అవుతున్న శృతిహాసన్ పోస్ట్!

Shruthi Hassan: శృతిహాసన్ వివాదాలకు చాలా దూరంగా ఉంటూ తన సినిమా పనులలో తాను బిజీగా ఉంటారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా ఈ ఏడాది మొదట్లో రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి శృతిహాసన్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే మరో సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శృతిహాసన్ ప్రభాస్ కు జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ముఖ్యంగా తన ప్రియుడికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కర్మ సిద్ధాంతం గురించి చెబుతూ శృతిహాసన్ ఇలాంటి పోస్ట్ చేయడంతో అసలు ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మరి ఈమె చేసిన పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే…

Shruthi Hassan: వారి గోతిలో వారే పడతారు…


నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను. వారు గోతులు తీస్తూ ఉంటారు కానీ వారు తీసిన గోతిలో వారే పడుతుంటారు. నేను ఇలాంటివి గమనిస్తూ ఏమి మాట్లాడకుండా నా పని నేను చేసుకుని పోతుంటాను అయితే కర్మ వాళ్లకు తగనట్లు శిక్షిస్తుందని తాజాగా ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసినటువంటి నెటిజన్స్ అసలు ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు ఎవరికి ఇలా కౌంటర్ ఇచ్చారన్న సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. మరి ఈమె ఎవరి గురించి చెప్పిందో తెలియాలి అంటే శృతిహాసన్ స్పందించాల్సి ఉంది.