Shruthi Hassan: శృతిహాసన్ వివాదాలకు చాలా దూరంగా ఉంటూ తన సినిమా పనులలో తాను బిజీగా ఉంటారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా ఈ ఏడాది మొదట్లో రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి శృతిహాసన్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే మరో సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
శృతిహాసన్ ప్రభాస్ కు జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ముఖ్యంగా తన ప్రియుడికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కర్మ సిద్ధాంతం గురించి చెబుతూ శృతిహాసన్ ఇలాంటి పోస్ట్ చేయడంతో అసలు ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మరి ఈమె చేసిన పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే…
నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను. వారు గోతులు తీస్తూ ఉంటారు కానీ వారు తీసిన గోతిలో వారే పడుతుంటారు. నేను ఇలాంటివి గమనిస్తూ ఏమి మాట్లాడకుండా నా పని నేను చేసుకుని పోతుంటాను అయితే కర్మ వాళ్లకు తగనట్లు శిక్షిస్తుందని తాజాగా ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసినటువంటి నెటిజన్స్ అసలు ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు ఎవరికి ఇలా కౌంటర్ ఇచ్చారన్న సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. మరి ఈమె ఎవరి గురించి చెప్పిందో తెలియాలి అంటే శృతిహాసన్ స్పందించాల్సి ఉంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…