Silk Smitha: ఆ టార్చర్ భరించలేను.. ఆత్మహత్యకు ముందు సిల్క్ స్మిత రాసిన లెటర్ వైరల్!

Silk Smitha: తన మత్తెక్కించే కళ్ళతో యువకుల గుండెల్లో మంటలు రేపిన అందాల సుందరి సిల్క్ స్మిత గురించి తెలియని వారంటూ ఉండరు. సౌత్ ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ రజనీకాంత్ వంటి ఎందరో స్టార్ హీరోలతో కలిసి 100 కు పైగా సినిమాలలో నటించిన సిల్క్ స్మిత తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించింది. సిల్క్ స్మిత అకాల మరణం అప్పట్లో సంచలనంగా మారింది.

ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆమె లేని లోటు ఎవరు భర్తీ చేయలేకపోతున్నారు. సిల్క్ స్మిత అలా ఆత్మహత్య చేసుకుని మరణించడంతో అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉండగా ఆత్మహత్యకి ముందు సిల్క్ స్మిత రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న తన నివాసంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత పోలీసులు ఆమె రాసిన ఉత్తరం స్వాధీనం చేసుకున్నారు.

సిల్క్ స్మిత ఆ లెటర్ లో తన బాధని బయటపెట్టింది. ఆ లెటర్ లో ” నా ఏడవ ఏట నుండే పొట్టకూటి కోసం ఒంటరిగా కష్టపడుతున్నాను. నాకంటూ ఎవరూ లేరు. బాబు ఒక్కడే నన్ను అర్థం చేసుకుని ఆదరించాడు. మిగతా వాళ్ళందరూ నా సొమ్ము తిని నమ్మించి నన్ను మోసం చేశారు. రాము, రాధాకృష్ణ నాకు చాలా అన్యాయం చేశారు. ఐదేళ్ల క్రితం ఒకడు నాకు జీవితం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు నాకు దూరమయ్యాడు.
బాబు తప్ప అందరూ నా సొమ్ము తిన్నారు. నన్ను ప్రేమించే వారు తోడుగా లేక రోజూ టార్చర్ అనుభవించాను.

Silk Smitha: నా సొమ్ము తిని మోసం చేశారు…

ఈ బాధ భరించలేకపోతున్నాను… అంటూ సిల్క్ స్మిత ఆ లెటర్ లో రాసుకొచ్చారు. సిల్క్ స్మిత ఆత్మహత్య గురించి అనుమానాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎవరిని దోషులుగా తేల్చలేదు. కొన్ని వందల సినిమాలలో నటించిన సిల్క్ స్మిత మరణం తర్వాత ఎవరూ కూడా ఆమె పార్తివదేహాన్ని చూడటానికి రాలేదు. ఒక అనాథల మట్టిలో కలిసిపోయింది. ఆమె భౌతికంగా మన ముందు లేకపోయినా కూడా ఆమె నటించిన సినిమాల ద్వారా ఇప్పటికీ అందరి మనసుల్లో జీవించే ఉంది.