Mother - Son: ఆస్తి కోసం కన్న తల్లిని కడతేర్చిన కొడుకు…భార్యను పుట్టింటికి పంపించి ఇలా!

Mother – Son: ఆస్తి కోసం కన్న తల్లిని కడతేర్చిన కొడుకు…భార్యను పుట్టింటికి పంపించి ఇలా!

Mother – Son: నవమాసాలు మోసి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన పిల్లలకు తల్లిదండ్రుల చివరి రోజులలో ఆసరాగా ఉండి వారికి జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులకు రుణ పడాల్సింది పోయి..ఆస్తి కోసం డబ్బు కోసం కన్న తల్లిదండ్రులని నిర్దాక్షిణ్యంగా చంపుతున్న ఘటనలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన సంగారెడ్డిలో వెలుగులోకి వచ్చింది.

Mother - Son: ఆస్తి కోసం కన్న తల్లిని కడతేర్చిన కొడుకు…భార్యను పుట్టింటికి పంపించి ఇలా!
Mother – Son: ఆస్తి కోసం కన్న తల్లిని కడతేర్చిన కొడుకు…భార్యను పుట్టింటికి పంపించి ఇలా!

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…సంగారెడ్డి జిల్లాలోని వట్‌పల్లి మండలం పోతులబోగుడా గ్రామంలో నివాసముండే మొండి మల్లమ్మ పేరు పై నాలుగు ఎకరాల పొలం ఉంది. ఈ క్రమంలోనే ఆమె కొడుకు మురళి నిత్యం తాగి వచ్చి తనకు ఆస్తి రాసివ్వాలని తన తల్లితో గొడవ పడేవాడు..

Mother – Son: ఆస్తి కోసం కన్న తల్లిని కడతేర్చిన కొడుకు…భార్యను పుట్టింటికి పంపించి ఇలా!

ఈ క్రమంలోనే తన తల్లి దగ్గర ఉన్న ఆస్తి తన సొంతం చేసుకోవాలంటే తన తల్లిని చంపడమే మార్గమని భావించిన మురళి తన భార్యను పుట్టింటికి పంపించి బుధవారం మధ్యాహ్నం బాగా తాగి వచ్చి ఎవరూ లేని సమయంలో తన తల్లి గొంతు నులిమి చంపేశాడు. అయితే తనకు ఏమీ తెలియనట్టు తన తల్లి మృతి చెందిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు.

బయటపడిన అసలు విషయం..

ఈ విధంగా తల్లి అనారోగ్యంతో మృతి చెందిందనే విషయాన్ని అందరికీ చెప్పడంతో స్థానికులు అతన్ని తీరుపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే పోలీసులకు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది. దీంతో మల్లమ్మ అల్లుడు జనార్ధన్ ఫిర్యాదు మేరకు తన కొడుకు మురళి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.