Sridevi drama company : శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేసిన ప్రేమ కావాలి బ్యూటీ… ప్రోమో చివర్లో ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్..!

Sridevi drama company : ఈటీవీలో జబర్దస్త్, ఢీ డాన్స్ షో వంటి షోస్ తో పోటీ పడుతూ మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇప్పటివరకు 74 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతి వారం ఒక కొత్త కాన్సెప్ట్ తో అలరిస్తుంటారు. ఇక 75 వ ఎపిసోడ్ లో ప్రేమ కావాలి సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన ఇషా చావ్లా సందడి చేసింది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ లో గత కొన్ని ఎపిసోడ్ల నుండి సుధీర్ రావడం లేదు. హోస్ట్ గా రష్మీ సందడి చేస్తోంది.

ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్…

ఇక జడ్జెస్ మారుతూనే ఉన్న ఈ షోలో ప్రస్తుతం పూర్ణ జడ్జి గా వస్తోంది. షోలో ఆది, రామ్ ప్రసాద్, వర్ష, ఇమ్మానుయేల్, అన్నపూర్ణ వంటి వారు స్కిట్లతో అలరించారు. అన్నపూర్ణమ్మ, ఆది కలిసి పుష్ప స్కిట్స్ తో నవ్వించారు. ఇక పూర్ణ డాన్స్ తో అలరించింది. ఇక షోలో ఇషా చావ్లా సందడి చేసింది. ముఖ్యంగా ఆది, ఇషా కు 11 గిఫ్టులతో ప్రొపోజ్ చేయడం, సుధీర్, రష్మీలను అనుకరిస్తూ నవ్వించారు .

ఇక చివర్లో ఏమైందో తెలియదు కానీ అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. చివరికి మిగిలేది అంటూ మహానటి లో సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేస్తూ అందరూ కంట తడి పెట్టడం తో ప్రోమో ఎండ్ చేసారు. ఇక అసలు ఏం జరిగిందో తెలియాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ చూడాల్సిందే.