Tag Archives: anasuya baradwaj

Anchor Anasuya: అయ్యయ్యో వద్దమ్మా… అంటూ అనసూయ మేకప్ పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్…వీడియో వైరల్!

Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా ఒక వైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో అద్భుతమైన పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.

Anchor Anasuya: అయ్యయ్యో వద్దమ్మా… అంటూ అనసూయ మేకప్ పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్…వీడియో వైరల్!

ఈ క్రమంలోనే తాజాగా పుష్ప, ఖిలాడి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నిత్యం తన గ్లామరస్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.

Anchor Anasuya: అయ్యయ్యో వద్దమ్మా… అంటూ అనసూయ మేకప్ పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్…వీడియో వైరల్!

ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోలు షేర్ చేయడంతో కొన్ని సార్లు అనసూయ దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ కు గురికావల్సి ఉంటుంది. ఇలా తన గురించి ట్రోలింగ్ చేసినప్పటికీ ఈమె వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

మేకప్ కాస్త ఓవర్ అయింది…

ఇదిలా ఉండగా తాజాగా అనసూయ ఇన్స్టాగ్రామ్ ద్వారా మరొక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియో షేర్ చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజనులు ఈ వీడియో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అసలు ఇక్కడ ఉన్నది అనసూయ నేనా అంటూ కామెంట్లు పెట్టగా మరికొందరు అయ్యయ్యో వద్దమ్మా అనసూయ.. మేకప్ కాస్త ఓవర్ అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అనసూయ తన ఓవర్ మేకప్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు.

ఆయన అలవాట్లతో ఆస్తి మొత్తం పోయింది : అనసూయ

బుల్లితెర ఫిమేల్ యాంకర్స్ లో జబర్దస్త్ బ్యూటీ అనసూయకు స్పెషల్ క్రేజ్ ఉందని చెప్పొచ్చు.. ఆకర్షించే అందంతోపాటు అద్బుతమైన ప్రతిభ ఆమె సొంతం. టెలివిజన్ స్క్రీన్ పై తనదైన ముద్రవేసిన అనసూయ.. ఇప్పుడు వెండితెరపైనా తన టాలెంట్ చూపిస్తోంది. క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్లతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో అలరిస్తోంది.

అయితే.. ఇంత స్టార్ డమ్ రాత్రికి రాత్రే వచ్చింది కాదు. ఎన్నో కష్టాలు, మరెన్నో ఇబ్బందులతోనే అనసూయ సినీ ప్రయాణం మొదలైంది. తెలుగు అమ్మాయైన అనసూయ ఎంబీఏ పూర్తి చేసి, మొదట్లో స్టాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత జాబ్ కు ఫుల్ స్టాప్ పెట్టి.. యాక్టింగ్ వైపు అడుగులు వేసింది.ఓ న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న క్రమంలోనే అనసూయకు ‘జబర్దస్త్’ ఆఫర్ వచ్చింది. ఈ కామెడీ షోతో వచ్చిన పాపులారిటీని సరిగ్గా ఉపయోగించుకున్న అనసూయ.. సినిమా అవకాశాలనూ అందుకుంది.

‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘కథనం’ వంటి సినిమాలతో సత్తాచాటింది. ఇప్పుడు.. దాదాపు అరడజను సినిమాలు చేతిలో ఉన్న ఈ బ్యూటీ.. కరోనా గోల లేకుంటే దాదా మూడ్నాలుగు సినిమాలతో ఇప్పటికే సందడి చేసేది.అయితే.. తాజాగా ఈ అమ్మడు నటించిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా తన పర్సనల్ విషయాలను వెల్లడించింది. ఫ్లాష్ బ్యాక్ లో వీళ్లది రాయల్ ఫ్యామిలీ అంట. చాలా ఆస్తులు ఉండేవని, తమ ఇంట్లో గుర్రాలు కూడా ఉండేవని చెప్పింది.

ఈ విషయం ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదని వెల్లడించింది అనూ.అయితే.. తన తండ్రికి ఉన్న చెడు అలవాట్ల వల్లనే ఆస్తి మొత్తం పోయిందని చెప్పింది. వాళ్ల నాన్నకు గుర్రపు స్వారీలు, గ్యాంబ్లింగ్ వంటి హ్యాబిట్స్ ఉండేవట. వాటి ద్వారానే ఆస్తి మొత్తం కోల్పోవాల్సి వచ్చిందట. దీంతో.. వాళ్ల కుటుంబ పరిస్థితి మొత్తం మారిపోయిందట. తాను కాలేజీలో చదువుతున్న రోజుల్లో బస్సు టికెట్ కు సైతం డబ్బులు లేకపోతే.. నడుచుకుంటూ వెళ్లేదట..కానీ ఇప్పుడు మాత్రం తమ పరిస్థితి మెరుగుపడిందను చెప్పుకొచ్చింది అనసూయ…!!