Tag Archives: Anchor jhansi

Anchor Jhansi: 2023 నాకు కన్నీళ్లను మిగిల్చింది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన యాంకర్ ఝాన్సీ!

Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె బుల్లితెర యాంకర్ గా ఒకానొక సమయంలో ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అదేవిధంగా వెండి తెరపై కూడా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మెప్పించారు. ప్రస్తుతం ఝాన్సీ బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ వెండితెరపై మాత్రం కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇటీవల ఈమె సలార్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఉన్నటువంటి యాంకర్ ఝాన్సీ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ వైరల్ గా మారింది. మరి కొద్ది రోజులలో ఈ ఏడాది పూర్తి కానున్నటువంటి నేపథ్యంలో ఈమె ఈ ఏడాదిలో తనకు జరిగినటువంటి విషాదాలు గురించి తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ ఏడాదిలో తనకు ఎంతో ఆప్తులు అయినటువంటి వారందరినీ కోల్పోయాను అంటూ ఈ సందర్భంగా ఝాన్సీ వెల్లడించారు. ఈ సంవత్సరంలో డాడీ, బడ్డీ, శ్రీను వెళ్లిపోయారు.. 2023 కన్నీటిని మిగిల్చింది.. ప్రేయర్స్ అంటూ వారి ముగ్గురి ఫోటోలను షేర్ చేసుకున్నారు. తన తండ్రితో పాటు వీరు ఎంతో ముద్దుగా పెంచుకున్నటువంటి తన పెంపుడు కుక్క బడ్డీ కూడా చనిపోయిందని ఈమె తెలిపారు.

విషాదం నింపింది…

ఇక తన పిఏ శ్రీను కూడా ఈ ఏడాది గుండెపోటుతో మరణించారు. ఇటీవల ఈయన మరణించడంతో ఈమె ఆయన మరణం పట్ల ఎంతో ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా తనకు ఎంతో ఆప్తులు అయినటువంటి ఈ ముగ్గురు కూడా ఈ ఏడాది చనిపోవడంతో ఈమె ఎమోషనల్ అవుతూ వారి మరణాలను తలుచుకొని సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Anchor jhansi: ఆ హీరోతో ఎఫైర్… పోలీస్ రైడ్ లో దొరికిపోయానని వార్తలు రాశారు.. ఝాన్సీ షాకింగ్ కామెంట్స్!

Anchor jhansi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో ఝాన్సీ ఒకరు ఒకప్పుడు ఈమె ఎన్నో బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా వెండితెరపై కూడా సినిమాలలో నటిస్తూ సందడి చేశారు. ఇలా వెండితెర సినిమాలలో కూడా ఈమె ఎంతో మంచి గుర్తింపు పొందారు.

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలు రావడం సర్వసాధారణం అయితే ఇలాంటి వార్తలు కారణంగా ఎంతోమంది మంచి మంచి అవకాశాలను కూడా కోల్పోతున్నారు.ఈ క్రమంలోనే యాంకర్ ఝాన్సీ సైతం ఇలాంటి వార్తలు రావడం వల్ల తాను ఎంతో మంచి అవకాశాలను కోల్పోయానని, కేవలం నిజాలు తెలియకుండా తన గురించి రాసిన తప్పుడు వార్తలు తన జీవితాన్ని నాశనం చేశాయని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఝాన్సీ తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఒక వెబ్సైట్ తన గురించి చాలా ఘోరమైన వార్తలు రాశారని తెలిపారు. నేను ఒక హీరోతో ఎఫైర్ పెట్టుకున్నానని పోలీస్ రైడ్ లో అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు అంటూ తన గురించి వార్తలు రాశారు. అయితే ఇలాంటి వార్తలు వచ్చిన సమయంలో తాను ఎంతో మంచి అవకాశాలను కోల్పోయానని ఈ సందర్భంగా ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు.

Anchor jhansi: మంచి అవకాశాలను కోల్పోయాను…


ఈ విధంగా ఝాన్సీ ఈ వార్తలను ఖండిస్తూ ఇలాంటి వార్తలు రాయటం వల్ల అవతల వ్యక్తి ఎంత బాధ పడతారు అనేది వారికి అవసరం లేదని, నిజా నిజాలు తెలియకుండా వార్తలు రాయడంతో చాలామంది కెరీయర్ ను కోల్పోతున్నారు అంటూ ఈ సందర్భంగా ఝాన్సీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఝాన్సీ ఇలాంటి కామెంట్లు చేయడంతో ఈమె ఏ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మీడియాను కాకులని సంబోధిస్తూ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన యాంకర్ ఝాన్సీ..!

సాధారణంగా మీడియా ప్రతి విషయాన్ని ఎంతో ఫోకస్ చేస్తుంది. అది రాజకీయాలలో నైనా లేదా సినిమా పరిశ్రమలో నైనా మీడియా మరింత ఎక్కువగా ఆతృతను చూపిస్తూ.. చిత్ర పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారింది. సాధారణంగా సెలబ్రిటీల విషయాలు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లడం సర్వసాధారణం. అయితే ఈ మధ్య కాలంలో మీడియా ఫోకస్ మరింత ఎక్కువైంది అంటూ పలువురు సెలబ్రిటీలు మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బుల్లితెరపై యాంకర్ గా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ ఝాన్సీ తాజాగా మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతి సెలబ్రెటీకి కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని వారి వ్యక్తిగత విషయాలు వారి ఇంటికి మాత్రమే పరిమితం కావాలని భావిస్తారు. కానీ మీడియా ఫోకస్ వల్ల ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూపిస్తున్నారని ఝాన్సీ మీడియాపై విరుచుకుపడ్డారు.

ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె తెలియజేస్తూ అనగనగా ఒక ఎద్దు ఎద్దు కాలిలో పుండు… ఆ పుండులో పురుగులు..ఎద్దు తో కబుర్లు చెప్పాల్సిన కాకి ఆ పుండును పొడుస్తూ పొడుస్తూ పురుగులు తింటుంది. ఆ ఎద్దు రెచ్చిపోయి బుసలు కొడుతూ కాకుల గోల పెంచి మైకులు పట్టి మరీ మా మురికిని అందరి ఇంటిలోకి చేరవేస్తున్నాయి. ఇండస్ట్రీలో పెళ్లి జరిగిన విడాకులు జరిగిన ఎన్నికలు జరిగిన కాకుల హడావిడి చేస్తున్నారంటూ మీడియాను కాకులతో పోలుస్తూ యాంకర్ ఝాన్సీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత విడాకుల విషయం పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు, మా ఎన్నికల గురించి ఝాన్సీ పరోక్షంగా మీడియాపై ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.