సాధారణంగా మీడియా ప్రతి విషయాన్ని ఎంతో ఫోకస్ చేస్తుంది. అది రాజకీయాలలో నైనా లేదా సినిమా పరిశ్రమలో నైనా మీడియా మరింత ఎక్కువగా ఆతృతను చూపిస్తూ.. చిత్ర పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారింది. సాధారణంగా సెలబ్రిటీల విషయాలు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లడం సర్వసాధారణం. అయితే ఈ మధ్య కాలంలో మీడియా ఫోకస్ మరింత ఎక్కువైంది అంటూ పలువురు సెలబ్రిటీలు మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బుల్లితెరపై యాంకర్ గా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ ఝాన్సీ తాజాగా మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతి సెలబ్రెటీకి కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని వారి వ్యక్తిగత విషయాలు వారి ఇంటికి మాత్రమే పరిమితం కావాలని భావిస్తారు. కానీ మీడియా ఫోకస్ వల్ల ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూపిస్తున్నారని ఝాన్సీ మీడియాపై విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె తెలియజేస్తూ అనగనగా ఒక ఎద్దు ఎద్దు కాలిలో పుండు… ఆ పుండులో పురుగులు..ఎద్దు తో కబుర్లు చెప్పాల్సిన కాకి ఆ పుండును పొడుస్తూ పొడుస్తూ పురుగులు తింటుంది. ఆ ఎద్దు రెచ్చిపోయి బుసలు కొడుతూ కాకుల గోల పెంచి మైకులు పట్టి మరీ మా మురికిని అందరి ఇంటిలోకి చేరవేస్తున్నాయి. ఇండస్ట్రీలో పెళ్లి జరిగిన విడాకులు జరిగిన ఎన్నికలు జరిగిన కాకుల హడావిడి చేస్తున్నారంటూ మీడియాను కాకులతో పోలుస్తూ యాంకర్ ఝాన్సీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపోతే ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత విడాకుల విషయం పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు, మా ఎన్నికల గురించి ఝాన్సీ పరోక్షంగా మీడియాపై ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…