Tag Archives: Anchor Prashanthi

Anchor Prashanthi: అమ్మకు క్యాన్సర్… సడన్ గా ఓ రోజు అంటూ అందరిని ఏడిపించిన గృహలక్ష్మి లాస్య!

Anchor Prashanthi: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రచారం అవుతూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యాతగా ఇదివరకే సూపర్ క్వీన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ రావడంతో సీజన్ 2 కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి కూడా ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇది కాస్త వైరల్ గా మారింది. ఇందులో భాగంగా సామి సామి పాట పాడినటువంటి సింగర్ మౌనికతో పాటు కండక్టర్ ఝాన్సీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లాస్య కూడా హాజరయ్యారు.

ఈ సీరియల్లో లాస్య పాత్రలో నటిస్తున్నటువంటి ప్రశాంతి యాంకర్ అనే విషయం మనకు తెలిసిందే. బయట ఎంతో చలాకీగా ధైర్యంగా ఉండే ప్రశాంతి ప్రస్తుతం పలు సీరియల్స్ లో లేడీ విలన్ పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంతి తన తల్లి గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అందరి చేత కంటతడి పెట్టించారు.

Anchor Prashanthi: లివర్ క్యాన్సర్…

తన తల్లి గురించి ప్రశాంతి మాట్లాడుతూ తనుకు తన తల్లి అంటే ఎంతో ఇష్టమని తన ఎదుగుదలకు ఎంతో సపోర్ట్ చేసిందని తెలిపారు. అయితే అమ్మకు లివర్ క్యాన్సర్ వచ్చిందని తెలియగానే ఎంతో కృంగిపోయాను. ఓ రోజు సడన్గా అమ్మ చనిపోయిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇలా ఈమె కంటతడి పెట్టుకోవడంతో ప్రదీప్ తో సహా అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

https://www.youtube.com/watch?v=Ca80HOd3nFc

అలాంటి వారికి ఓట్లు వేయకండి.. తన సపోర్ట్ వాళ్లకే .. యాంకర్ ప్రశాంతి షాకింగ్ కామెంట్స్..!

తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో మొన్నటి వరకు టీఆర్పీ రేటింగ్ దారుణంగా ఉంది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కూడా అయిపోవడంతో బిగ్ బాస్ రియాల్టీ షో టీఆర్పీ రేటు పుంజుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎన్నికలు, క్రికెట్ ముగిసిపోవటంతో మళ్ళీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ క్రేజ్ పెరిగింది. దీనిపై బిగ్ బాస్ అప్డేట్స్ పై నెటిజన్లు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు.

దీనికి కారణం హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయిన సన్నీకి, షణ్ముఖ్ మధ్య గొడవనే చెప్పాలి. ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావ్ అంటూ షణ్ముఖ్ పై సన్నీ రెచ్చిపోయాడు. దీనిపై షణ్ముఖ్ గర్ల్‌ఫ్రెండ్‌ దీప్తి సునయన కూడా సన్నీకి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దానిపై ఓ పెద్ద పోస్టును దీప్తి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

ఆ గొడవలో షణ్ముఖ్ ప్రవర్తించిన తీరు తనకు ఎంతగానో నచ్చిందని.. తనను హగ్ చేసుకోవాలని అనిపిస్తుంది అంటూ దీప్తి అందులో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఆ వ్యవహారంపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయిన శివజ్యోతి షణ్ముఖ్ కు సపోర్టు చేయగా.. కొందరు షణ్ముఖ్ దే తప్పు అంటూ భావిస్తున్నారు.

తాజాగా సీనియర్ టీవీ యాంకర్ ప్రశాంతి షణ్ముఖ్ బిహేవియర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హౌస్ లో గేమ్ చూసి ఓటు వేయండి.. అంతేకాని బయట వారి పాపులారిటీ చూసి ఓట్లు వేయకండి అంటూ షణ్ముఖ్ ని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసింది యాంకర్ ప్రశాంతి. హౌస్ లో టాప్ 5 లో ఎవరుంటారో తనకు తెలుసని.. వాళ్లందరికీ తన సపోర్టు ఉంటుందని ఆమె పేర్కొంది. హౌస్ లో గేమ్ లు మంచిగా ఆడిన వారికి మాత్రమే ఓట్లు వేయండి అంటూ యాంకర్ ప్రశాంతి షాకింగ్ కామెంట్ చేశారు.