Tag Archives: Anchor Sowmya Rao

Sowmya Rao: జడ్జ్ కమెడియన్ కు ముద్దుపెట్టిన సౌమ్య రావు… యాంకరమ్మ స్పీడు మామూలుగా లేదుగా?

Sowmya Rao: బుల్లితెర పై ప్రసారమయ్యే కామెడీ షోలలో జబర్దస్త్ కార్యక్రమం గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు ఎంతోమంది కమెడియన్లతో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమం నుంచి స్టార్ కమెడియన్స్ అందరూ కూడా వెళ్లిపోవడంతో అతి కష్టం మీద ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి రేటింగ్ రావడం కోసం నిర్వాహకులు చేసే స్టంట్ లు కూడా మామూలుగా లేవు. ఇలా రేటింగ్స్ కోసం భారీగా స్టంట్ చేస్తున్న నేపథ్యంలో నేటిజెన్ల ఆగ్రహానికి కూడా గురవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా యాంకర్ సౌమ్యరావు ఏకంగా జడ్జి కృష్ణ భగవాన్ కి ముద్దు పెట్టడం హైలైట్ అవుతుంది.

ఈ ప్రోమోలో భాగంగా నూకరాజు ప్రసాద్ ఇద్దరు కూడా విభిన్నమైన స్కిట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా నూకరాజు ప్రసాద్ మాటలు లేకుండా కేవలం చేష్టలతోనే అందరిని నవ్వించే ప్రయత్నం చేశారు. తర్వాత నూకరాజు వెళ్లి జడ్జి కృష్ణ భగవాన్ చేతికి ముద్దు పెట్టారు. నువ్వు కూడా వెళ్లి పెట్టాలి అంటూ సౌమ్య రావుకు చెప్పడంతో ఆమె ఏకంగా తనకు ముద్దు పెట్టడానికి వెళ్ళింది.

Sowmya Rao: చేతికి ముద్దు పెట్టిన సౌమ్య రావు…

ఇలా సౌమ్య కృష్ణ భగవాన్ కు ముద్దు పెట్టడానికి వెళ్లడంతో ఇంద్రజ నెంబర్ బోర్డ్ కృష్ణ భగవాన్ బుగ్గకు అడ్డుపెట్టింది. ఇలా బుగ్గకు అడ్డు పెట్టడంతో సౌమ్యరావు చేసేది ఏమీ లేక కృష్ణ భగవాన్ చేతికి ముద్దు పెట్టింది.ఇలా ఈమె కృష్ణ భగవాన్ కు ముద్దు పెట్టడంతో పలువురు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈమె ఎందుకు ముద్దు పెట్టింది ఏంటి అనే విషయం తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

Anchor Sowmya Rao: జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త యాంకర్.. ఈ యాంకరమ్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Anchor Sowmya Rao: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్ అనసూయ కూడా మంచి గుర్తింపు పొందడంతో ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే సినిమాలతో బిజీ అవ్వడం వల్ల ఈ కార్యక్రమానికి యాంకర్ గా దూరమయ్యారు.

అనసూయ దూరం కావడంతో కొన్నాళ్లపాటు రష్మీ యాంకర్ గా వ్యవహరించిన ప్రస్తుతం ఈ కార్యక్రమానికి కొత్త యాంకర్ వచ్చినట్టు తెలుస్తుంది. తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా కొత్త యాంకర్ సౌమ్యరావు యాంకర్ పరిచయమయ్యారు. చూడటానికి ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ యాంకర్ జబర్దస్త్ కార్యక్రమానికి సరిగ్గా సరిపోతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చిన సౌమ్య ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే…నటనపై ఆసక్తితో ఉన్నటువంటి ఈమె మొదటగా కన్నడ బుల్లితెర సీరియల్ లో నటించారు.ఇలా కనడ బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈమె అనంతరం తమిళ టీవీ సీరియల్స్ లో నటించారు.ఇకపోతే తెలుగు ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న శ్రీమంతుడు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

Anchor Sowmya Rao: సీరియల్ నటిగా గుర్తింపు పొందిన సౌమ్య…

ఈ విధంగా ఈ టీవీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె తాజాగా ఓ పండుగ సందర్భంగా ఈటీవీ నిర్వహించినటువంటి స్పెషల్ షోలో హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ తో కలిసి తనదైన శైలిలో వారిపై పంచ్ డైలాగులు వేయడంతో మల్లెమాల వారి దృష్టి ఈమెపై పడింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి సౌమ్యరావు కరెక్ట్ గా సరిపోతుందని భావించిన మల్లెమాలవారు తనని జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా నియమించినట్టు తెలుస్తుంది.నటిగా గుర్తింపు పొందిన ఈమె యాంకర్ గా ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుంటారో తెలియాల్సి ఉంది.