Anchor Sowmya Rao: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్ అనసూయ కూడా మంచి గుర్తింపు పొందడంతో ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే సినిమాలతో బిజీ అవ్వడం వల్ల ఈ కార్యక్రమానికి యాంకర్ గా దూరమయ్యారు.
అనసూయ దూరం కావడంతో కొన్నాళ్లపాటు రష్మీ యాంకర్ గా వ్యవహరించిన ప్రస్తుతం ఈ కార్యక్రమానికి కొత్త యాంకర్ వచ్చినట్టు తెలుస్తుంది. తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా కొత్త యాంకర్ సౌమ్యరావు యాంకర్ పరిచయమయ్యారు. చూడటానికి ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ యాంకర్ జబర్దస్త్ కార్యక్రమానికి సరిగ్గా సరిపోతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చిన సౌమ్య ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే…నటనపై ఆసక్తితో ఉన్నటువంటి ఈమె మొదటగా కన్నడ బుల్లితెర సీరియల్ లో నటించారు.ఇలా కనడ బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈమె అనంతరం తమిళ టీవీ సీరియల్స్ లో నటించారు.ఇకపోతే తెలుగు ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న శ్రీమంతుడు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఈ విధంగా ఈ టీవీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె తాజాగా ఓ పండుగ సందర్భంగా ఈటీవీ నిర్వహించినటువంటి స్పెషల్ షోలో హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ తో కలిసి తనదైన శైలిలో వారిపై పంచ్ డైలాగులు వేయడంతో మల్లెమాల వారి దృష్టి ఈమెపై పడింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి సౌమ్యరావు కరెక్ట్ గా సరిపోతుందని భావించిన మల్లెమాలవారు తనని జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా నియమించినట్టు తెలుస్తుంది.నటిగా గుర్తింపు పొందిన ఈమె యాంకర్ గా ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుంటారో తెలియాల్సి ఉంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…