Tag Archives: anchor suma

ఆ కమెడియన్ అన్న మాటకు కోపంతో చేతిలో కార్డ్స్ విసిరేసిన యాంకర్ సుమ.. ఏమన్నాడంటే?

బుల్లితెరపై గత రెండు దశాబ్దాల కాలం నుంచి తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరలో ఏ చానల్ పెట్టిన సుమ మనకు దర్శనమిస్తారు.అదే విధంగా పలు ఈవెంట్లు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. కేవలం మాట తీరుతో మాత్రమే కాకుండా తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరిని ఆకట్టుకునే సుమకు తాజాగా ఒక చేదు అనుభవం ఎదురైంది.

సుమ ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాం కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈవారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈవారం క్యాష్ పోగ్రామ్ కి పంచ్ ప్రసాద్, జబర్ధస్త్ నూకరాజు, జబర్ధస్త్ ఇమాన్యూయేల్, జబర్ధస్త్ బాబులు గెస్టులుగా వచ్చారు. అదేవిధంగా వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులను కూడా తీసుకువచ్చారు. వీరందరితో కలిసి సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ ప్రసాద్ అందరి పై పంచులు వేస్తూ హైలెట్ అయ్యారు. అద్భుతమైన టైమింగ్ లతో మాటకు మాట చెబుతూ పంచులు వేస్తూ అందరిని ఆకర్షించాడు.ఎప్పుడు అందరికీ పంచులు వేసే సుమకు సైతం ప్రసాద్ పంచులు వేస్తూ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే నెటిజన్లు ప్రసాద్ కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక నూకరాజు చివర్లో తన అన్న గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ప్రసాద్ మాట్లాడుతూ.. ఈయన నా మేనమామ.. ఈయన వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను థాంక్యూ మామయ్య. ఈయన సహాయ సహకారం లేకపోతే నేను ఇంకా గొప్ప పొజిషన్లో ఉండేవాడిని అంటూ పంచ్ వేయడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు. కానీ సుమ మాత్రం కోపంతో చేతిలో ఉన్న కార్డ్స్ విసిరి తనలో తానే నవ్వుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కరోనా పరీక్ష చేయించుకున్న యాంకర్ సుమ.. చివరకు..?

దేశంలో కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా భయపెడుతోందనే సంగతి తెలిసిందే. ఈరోజు స్టార్ హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులను కరోనా భయం వెంటాడుతోంది. తాజాగా స్టార్ యాంకర్ సుమ కరోనా పరీక్ష చేయించుకున్నారు. సుమ బిగ్ బాస్ షోకు హాజరు కావడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. రాజమౌళి, బండ్ల గణేష్, తమన్నా కరోనా బారిన పడి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. చిరంజీవికి కరోనా నిర్ధారణ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నాగార్జున, సీఎం కేసీఆర్, రామ్ చరణ్, కొరటాల శివ, రాజమౌళి మరికొందరు రాజకీయ, సినీ ప్రముఖులు రాజమౌళికి సన్నిహితంగా మెలిగారని సమాచారం.

దీంతో వాళ్లందరూ కరోనా పరీక్షలకు చేయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే యాంకర్ సుమ బిగ్ బాస్ షోకు వెళ్లకముందు కరోనా పరీక్ష చేయించుకోగా మారిన పరిస్థితుల నేపథ్యంలో మరోసారి కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాగార్జున రెండు రోజుల క్రితం చిరంజీవితో పాటు సీఎం కేసీఆర్ ను కలిశారు. ఆ సమయంలో అక్కడ చిరంజీవి, నాగార్జున , కేసీఆర్ మాస్కులు ధరించలేదు.

దీంతో నాగార్జునకు కరోనా సోకుతుందేమోనని బిగ్ బాస్ టీంకు సైతం టెన్షన్ పట్టుకుంది. సుమ తాను కరోనా పరీక్ష చేయించుకున్న వీడియోను షేర్ చేస్తూ తాను బిగ్ బాస్ షోకు వెళ్లిన తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసని వెళ్లకముందు ఏం జరిగిందో చూడండంతూ వీడియోతో ట్వీట్ చేసింది. ఆ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఆమె బిగ్ బాస్ షోకు హాజరయ్యారు.