బుల్లితెరపై గత రెండు దశాబ్దాల కాలం నుంచి తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరలో ఏ చానల్ పెట్టిన సుమ మనకు దర్శనమిస్తారు.అదే విధంగా పలు ఈవెంట్లు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. కేవలం మాట తీరుతో మాత్రమే కాకుండా తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరిని ఆకట్టుకునే సుమకు తాజాగా ఒక చేదు అనుభవం ఎదురైంది.
సుమ ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాం కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈవారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈవారం క్యాష్ పోగ్రామ్ కి పంచ్ ప్రసాద్, జబర్ధస్త్ నూకరాజు, జబర్ధస్త్ ఇమాన్యూయేల్, జబర్ధస్త్ బాబులు గెస్టులుగా వచ్చారు. అదేవిధంగా వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులను కూడా తీసుకువచ్చారు. వీరందరితో కలిసి సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ ప్రసాద్ అందరి పై పంచులు వేస్తూ హైలెట్ అయ్యారు. అద్భుతమైన టైమింగ్ లతో మాటకు మాట చెబుతూ పంచులు వేస్తూ అందరిని ఆకర్షించాడు.ఎప్పుడు అందరికీ పంచులు వేసే సుమకు సైతం ప్రసాద్ పంచులు వేస్తూ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే నెటిజన్లు ప్రసాద్ కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక నూకరాజు చివర్లో తన అన్న గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ప్రసాద్ మాట్లాడుతూ.. ఈయన నా మేనమామ.. ఈయన వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను థాంక్యూ మామయ్య. ఈయన సహాయ సహకారం లేకపోతే నేను ఇంకా గొప్ప పొజిషన్లో ఉండేవాడిని అంటూ పంచ్ వేయడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు. కానీ సుమ మాత్రం కోపంతో చేతిలో ఉన్న కార్డ్స్ విసిరి తనలో తానే నవ్వుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…