Tag Archives: Atal Bihari Vajpayee

Krishnam Raju -Chiranjeevi: స్నేహం కోసం చిరంజీవికి అండగా నిలిచిన కృష్ణంరాజు.. ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన కృష్ణంరాజు!

Krishnam Raju -Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతూ ఎంపీగా బాధ్యతలను నిర్వహించారు నటుడు కృష్ణంరాజు. 1998 కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు తీసుకోవడమే కాకుండా అటల్ బీహారీ వాజ్ పాయ్ హయామంలో కేంద్ర మంత్రిగా కూడా కొనసాగారు. అయితే ఈయన సినీ కెరియర్ లోను రాజకీయ కెరియర్ లోను చిరంజీవితో ఎంతో సఖ్యతగా ఉండేవారు.

చిరంజీవి కృష్ణంరాజు ఇద్దరు మొగల్తూరుకు చెందిన వారే కావడంతో వీరి మధ్య ఎంతో మంచి అనుబంధ ఉంది. ఇలా కృష్ణంరాజు సినిమా ఇండస్ట్రీలో ఉండగా చిరంజీవి సైతం సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకుపోతూ అగ్ర హీరోగా పేరు సంపాదించుకున్నారు ఇకపోతే కృష్ణంరాజు 2009వ సంవత్సరంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.

ఈ విధంగా ప్రజారాజ్యం పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించిన కృష్ణంరాజు రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇలా రాజకీయాలలో చిరంజీవికి మద్దతుగా నిలబడిన ఈయన అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత తిరిగి బిజెపిలో చేరారు. బిజెపిలో కొనసాగుతున్నప్పటికీ ఈయన మాత్రం రాజకీయాలలో చురుగ్గా కొనసాగలేదు.

Krishnam Raju -Chiranjeevi: మర్చిపోలేని బహుమతి ఇచ్చిన కృష్ణంరాజు..

ఇకపోతే ఒకసారి చిరంజీవి పుట్టినరోజు వేడుకలలో భాగంగా తన మేనల్లుడితో కలిసి వెళ్లిన కృష్ణంరాజు అక్కడ తన మేనల్లుడు లండన్ నుంచి తెచ్చిన ఒక కెమెరాతో అక్కడికి వచ్చిన సెలబ్రిటీల ఫోటోలను తీస్తున్నారు.అది చూసిన చిరంజీవి కెమెరా ఎక్కడ కొన్నారు అన్న దీనిని నేను లండన్ లో చూశాను చాలా కాస్ట్లీ కెమెరా అంటూ అని అడగడంతో వెంటనే కృష్ణంరాజు తన మేనల్లుడి మెడలో ఉన్నటువంటి కెమెరా తీసి చిరంజీవి మెడలో వేసి నీ బర్త్డే గిఫ్ట్ ఇదేనంటూ చెప్పారు. అలా ఆరోజు కృష్ణంరాజు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేని చిరంజీవి పలుసార్లు గుర్తు చేసుకున్నారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి.

Krishnam Raju: సినిమాలలో రాణిస్తూ కేంద్ర మంత్రిగా సక్సెస్ అయిన కృష్ణంరాజు!

Krishnam Raju: టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన అనారోగ్య సమస్యల కారణంగా నేడు తుది విశ్వాస విడిచారు.అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి కృష్ణంరాజు నేడు తెల్లవారుజామున కన్నుమూశారు.

ఇకపోతే ఈయన కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తన మార్క్ చూపించారు. రాజకీయాలలోకి వచ్చి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం గురించి ఇక్కడ తెలుసుకుందాం. కృష్ణంరాజు 1991 వ సంవత్సరంలో రాజకీయాలలోకి వచ్చారు. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈయన అదే ఏడాది నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతి రాజు విజయ్ కుమార్ రాజు అనే వ్యక్తి పై పోటీ చేసి ఓడిపోయారు.

ఈ విధంగా ఓడిపోవడంతో కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన తిరిగి 1998లో బిజెపి పార్టీలో చేరారు. కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీకి దిగి విజయం సాధించారు.1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్‌సభ నుంచి మళ్లీ పోటీ చేసి… కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు.

Krishnam Raju: మంచిగా బాధ్యతలు చేపట్టిన కృష్ణంరాజు..

అనంతరం ఈయన అటల్ బీహారీ వాజ్ పాయ్ నేతృత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇక కొంతకాలం పాటు రాజకీయాలకు దూరమైనటువంటి ఈయన 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారు. అయితే ఈ పార్టీ కూడా గెలవకపోవడంతో ఈయన తిరిగి బీజేపీలో చేరారు. ఇలా బిజెపిలో కొనసాగుతున్నప్పటికీ ఎక్కడ రాజకీయాలలో చురుగ్గా పాల్గొనలేదు.