Tag Archives: biryani

Naveen Father: నా కొడుకు శవాన్ని తగలబెట్టి వాళ్ళు బిర్యాని తింటున్నారు… వారికి ఉరిశిక్ష పడాలి: నవీన్ తండ్రి

Naveen Father: అబ్దుల్లాపూర్ మెట్ లో బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది కేవలం అమ్మాయి కారణంగా ఇద్దరు స్నేహితులు కొట్టుకొని చివరికి హత్య చేసుకోవడం వరకు వెళ్లారు.అయితే నవీన్ హత్య కేసులో భాగంగా తన స్నేహితుడు హర హర హస్తము మాత్రమే కాకుండా అమ్మాయి హస్తం కూడా ఉందని అలాగే మరో స్నేహితుడు హాసన్ ప్రమేయం కూడా ఉందని తెలుస్తుంది.

నిహారికను నవీన్ ప్రేమిస్తున్నప్పటికీ హరిహర కూడా తనని ప్రేమించడంతో కేవలం ఆ అమ్మాయి కోసం హరిహర నవీన్ ను దారుణంగా చంపారు. నవీను హత్య చేయడమే కాకుండా తన శరీరంలో భాగాలను వేరు చేసే వివిధ ప్రాంతాలలో పడేసారని అయితే పోలీసులకు దొరికిపోతామని అనుమానం రావడంతో తిరిగి ఆ శరీర భాగాలన్నింటిని ఒకచోట చేర్చి ఆధారాలు దొరక్కుండా కాల్చి బూడిద చేశారంటూ నవీన్ తండ్రి ఆరోపణలు చేశారు.

ఈ విధంగా నా కొడుకు శరీరాన్ని కాల్చి వాళ్ళు మాత్రం రెస్టారెంట్ కు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తూ బిర్యానీ తింటున్నారు అంటూ నవీన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా తన కుమారుడి పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఆ ముగ్గురికి తప్పకుండా ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేస్తూ ఆవేదన చెందారు.


Naveen Father: న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటాం…

నా కొడుకు పట్ల ఈ విధంగా ప్రవర్తించిన ఈ ముగ్గురికి తొందరగా ఉరి తీయాలి వారికి కనక ఉరి తీయకపోతే మా కుటుంబ సభ్యులు ముగ్గురం పోలీసుల ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని ప్రస్తుతం తాము బ్రతికే పరిస్థితులలో కూడా లేము అంటూ నవీన్ తండ్రి తన కొడుకుని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. పోలీసులు హసన్ ను ఏ2గా,

ఏ3గా కేసులో చేర్చి ఇప్పటికే విచారిస్తున్న విషయం తెలిసిందే.

బిర్యానీ ప్రియులకు గుడ్ న్యూస్.. అక్కడ బిర్యానీ ఫ్రీ.. దాని కోసం ఏం చేయాలంటే..

బిర్యానీ అంటే ఎవరు ఇష్టపడరు. ప్రతీ ఒక్కరు లొట్టలేసుకొని మరీ తింటారు. వారి కోసం ఇప్పుడు చెప్పే న్యూస్. ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందేంటంటే.. తమిళనాడులోని అంబూర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

కిలో టమాటా తీసుకొస్తే.. రుచికరమైన బిర్యానీని ఉచితంగా ఇస్తామంటూ ప్రకటన ఇచ్చారు. దీంతో ఆ దుకాణానికి విపరీతంగా గిరాకీ పెరిగిపోయింది. అంతే కాదు అస్సలు ఆ షాప్ ఎక్కడ ఉంది.. అస్సలు అక్కడ జనాలు వస్తారో రారో అన్న స్థితిలో ఉన్న ఆ బిర్యానీ సెంటర్.. ఇప్పుడు ఆ జిల్లాలోనే ఫేమస్ అయిపోయింది. ఇలాంటి ఆఫర్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే.. అక్కడ టామాటాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

దాదాపు కిలో టమాటా రూ.150 పలుకుతోంది. ఈ నేపథ్యంలో చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం ప్రాపర్టీలోని అంబూర్ బిర్యానీ షాప్ యజమాని తన సేల్స్ పెంచుకోవడం కోసం ఒక కొత్త ఆఫర్ కస్టమర్లకు ప్రకటిచారు. దీంతో బిర్యానీ కోసం భోజన ప్రియులు ఎగబడుతున్నారు. అక్కడ ఒక బిర్యానీ రూ.100. ఎవరైనా రెండు కిలోల టమాటాలు కొంటే.. అర కిలో టమాటా ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ప్రకటించారు. అంతే కాదు.. ఒక కేజీ టమాటోలు తీసుకుని వచ్చి ఇస్తే.. ఒక బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ఇవ్వడం వల్ల జనం తండోపతండాలు వస్తున్నారు.

దీంతో గిరాకీ పెరిగింది. తను అనుకున్నది సక్సెస్ అవ్వడంతో షాపు యాజమాని తెగ మురిసిపోతున్నాడు. ఇక ఇలా చేయడానికి మరో ఉద్దేశ్యం కూడా ఉందని చెప్పాడు నిర్వాహకుడు. టమాటా ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఫ్రీ సేల్‌ నిర్వహించినట్లు దుకాణం యజమాని తెలిపారు.

కరీనా కపూర్ కు బిర్యానీ పంపిన యంగ్ రెబల్ స్టార్.. ఆమె రియాక్షన్ ఎంటో తెలుసా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి కంటె ముందు వచ్చిన ఫేమ్ కంటే.. బాహుబలి తర్వాత వచ్చిన క్రేజ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ఇంటర్నేషనల్ ఫిగర్ అన్నమాట. అయితే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా.. సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం ఆదిపురుష్.

ప్రస్తుతం ఈ సినిమా ముంబాయిలో జరుగుతోంది. షూటింగ్ లో ప్రభాస్ ఎంత జాలీగా ఉంటారో అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమా షూటింగ్ బ్రేక్ లో కూడా ఆ చిత్ర బృందం వివిధ రాకల వంటకాలు చేసి.. ఓ వీడియోను రూపొందించారు. అప్పుడు అది వైరల్ గా మారింది. అయితే ఇక్కడ ప్రభాస్
సైఫ్ అలీ ఖాన్ కుటుంబం కోసం ప్రభాస్ ప్రత్యేకంగా వివిధ వంటకాలు తయారు చేయించి పంపించారు.

ప్రభాస్ పంపిన వంటకాల్లో స్పెషల్ బిర్యానీ, ఖీర్, నాన్ వెజ్ కర్రీ ఉన్నాయట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తమ పట్ల చూపిన అభిమానానికి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు సైఫ్ కుటుంబసభ్యులు. ఇదిలా ఉండగా.. సైఫ్ భార్య కరీనా కపూర్ వంటకాలకు సంబంధించి ఫొటోలను తీసి తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

బాహుబలి బిర్యానీ పంపిస్తే అది కచ్చితంగా ది బెస్ట్ అవుతుంది… థాంక్యూ ప్రభాస్ అంటూ కరీనా కృతజ్ఞతలు తెలిపారు. ఇక సైఫ్ అలీ ఖాన్ కు మొదట 1991 లో అమృతా సింగ్ తో వివాహం కాగా.. తర్వాత వీరిద్దరు 2004 లో విడాకులు తీసుకున్నారు.. 2012లో కరీనా కపూర్ ను సైఫ్ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

వారికి అక్కడ బిర్యాని ఉచితం… ఎక్కడంటే?

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్రరూపం దాల్చడంతో ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.కొన్ని ప్రాంతాలలో ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కర్ఫ్యూ కూడా విధిస్తున్నారు. అనవసరంగా బయట తిరగటం వల్ల వైరస్ వ్యాప్తి ఉదృతం అవుతుంది. కనుక అనవసరంగా ఎవరూ బయటకు రాకుండా అందరూ ఇంట్లోనే ఉండి మహమ్మారిని కట్టడి చేయాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.

this-coimbatore-woman-is-distributing-free-biryani-to-poor-people

కరోనా ప్రభావం వల్ల ఇంట్లోనే కూర్చుని ఉంటే ఎంతో మందికి పూట గడవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే ఉంటే కడుపు నిండక ఎంతోమంది పేదవారిలో ఆకలి చావు కేకలు వినిపిస్తాయని పలువురు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ మహిళ పేద వారి పట్ల తన మానవత్వం చాటుకుంది.కరోనా మహమ్మారి వల్ల బయటకు రాలేక తినడానికి తిండి లేక ఎంతో బాధపడుతున్న పేదవారికి ఉచితంగా బిర్యాని పంపిణీ చేస్తోంది.

ఈ విధంగా పేదవారికి ఉచితంగా బిర్యాని పంచుతూ పేద వారి పట్ల ఆమె చూపుతున్న మానవత్వాన్ని ఓ వ్యక్తి ఆమె ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఓ చెట్టుకింద చిన్న బండి పెట్టుకొని పేదలకు బిర్యానీ అందిస్తుంది. అదేవిధంగా ఆ బండి పక్కన ఒక బోర్డు కూడా పెట్టి ఉంది. అందులో “ఆకలిగా ఉందా? వచ్చి బిర్యాని తీసుకెళ్లండి”అంటూ రాసి ఉంది.

ఈవిధంగా పేదల పట్ల ఈమె చూపే అభిమానం చూస్తుంటే మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలి ఉందని ఆ వ్యక్తి ట్వీట్ చేయగా.. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఏదిఏమైనా ఈ భయంకరమైన మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వీలైనంతవరకు అన్ని జాగ్రత్తలను పాటిస్తూ, ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టాలని అధికారులు తెలియజేస్తున్నారు.