Tag Archives: clothes

Pooja Hedge: అటువంటి దుస్తులను సౌకర్యంగా భావిస్తాను… పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్…?

Pooja Hedge: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారిని పూజా హెగ్డే కూడా ఒకరు. ముకుంద సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెట్టిన ఈ అమ్మడు తన అందం ,అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో స్టార్ హీరోలు సరసన నటించే అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే అందం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా హీరోయిన్లు అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలో ఫ్యాషన్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ తో మరింత స్టైలిష్ గా కనిపిస్తుంటారు. ఇక పూజ హెగ్డే కూడా ఈ కోవకు చెందినదే.

ఒకవైపు సినీ ప్రయాణాన్ని, మరొకవైపు ఫ్యాషన్ ప్రయాణాన్ని సమానంగా కొనసాగిస్తూ అందరూ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే ఫ్యాషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఇక ఈ ఇంటర్వ్యు లో మీ దృష్టిలో ఫ్యాషన్ అంటే ఏమిటి అని ప్రశ్నించగా..” సౌకర్యం అంటూ సమాధానం ఇచ్చింది. మన శరీరానికి,మన ఆలోచనలకు తగ్గట్టు ఉండే దుస్తులు ధరించినప్పుడు సౌకర్యంగా ఉంటుంది. అలా సౌకర్యంగా భావించినప్పుడు మనకు ఎప్పటికీ కొత్తగానే కనిపిస్తాయి.

Pooja Hedge: ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి…


మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి అంటూ చెప్పుకొచ్చింది. నేనెప్పుడూ కొత్తగా కనిపించటానికి ఇష్టపడతా. అందువల్ల బ్రాండ్స్ కి , డిజైన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటూ పూజా తెలిపింది. ఫ్యాషన్ గురించి పూజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే…ఇటీవల ” కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ” అనే సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఇక ప్రస్తుతం ఒక హింది సినిమాతో పాటు తెలుగులో మహేశ్ బాబు సరసన కూడా నటిస్తోంది.

శవాల మీద దుస్తులను కూడా వదలకుండా.. దారుణంగా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితులలో కరోనా బాధితుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు దొరికినంత డబ్బులు దోచుకోవడం చూస్తున్నాము. చికిత్స పేరిట బాధితుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు ఆక్సిజన్ సిలిండర్ లను మాస్క్లను శానిటైజర్ లను ఇంజక్షన్లను పక్కదారి పట్టిస్తూ నుంచి సొమ్ము చేసుకోవడం చూస్తున్నాము. కొన్నిచోట్ల బాధితుల ఒంటిపై ఉన్న బంగారు నగలు కూడా అపహరణ జరగడం గురించి విన్నాం. కానీ ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ ముఠా కొత్తతరహా మోసానికి తెర లేపింది.

కరోనాతో మరణించిన వారి వంటిపై ఉన్న దుస్తులను స్మశాన వాటిక లలో దొంగలించి వాటిని ఉతికి ఇస్త్రీ చేసి వాటిపై లేబుల్ లను అంటించి విక్రయాలను చేస్తుంటారు. ఈ విధమైన దొంగతనానికి పాల్పడిన ఏడుగురుని యూపీలోని బాగ్‌పట్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా స్మశాన వాటికలో కరోనా బాధితులపై కప్పి ఉన్న ముసుగులు సహా, చీరలు, కుర్తాలు, బెడ్‌షీట్లు, ఇతర వస్తువులను ఈ ముఠా చోరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇప్పటి వరకు ఈ ముఠా కరోనా మృతదేహాల నుంచి సుమారు 520 బెడ్‌షీట్లు, 127 కుర్తాలు, 52 చీరలు దొంగిలించినట్లు వాటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కావడం విశేషం. ఈ విషయంపై వీటిని విచారించగా మరికొన్ని విషయాలను బయటపెట్టారు.

స్థానికంగా ఉండే కొందరు వ్యాపారులు వీరికి రోజుకు రూ.300 కూలి ఇచ్చి ఈ విధమైనటువంటి దొంగతనాలు చేయిస్తున్నట్లు కూడా నిందితులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు ఈ ఏడుగురిపై అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బాగ్‌పట్‌ పోలీసులు తెలిపారు.