Tag Archives: delhi high court

Aadhaar: ఇకపై ఆస్తులతో ఆధార్ అనుసంధానం… ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

Aadhaar: ఆధార్ ప్రస్తుతం ఒక వ్యక్తికి ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పాలి. ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఓటర్ కార్డ్ పాన్ కార్డ్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ తో అనుసంధానం జరిగింది.ఇలా ఒక వ్యక్తికి ఆధార్ అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఇకపై ఒక వ్యక్తి ఆస్తిపాస్తులను కూడా ఆధార్ తో అనుసంధానం చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆస్తులతో ఆదర్ అనుసంధానం చేయాలని ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది.దేశ పౌరుల స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలనుకోవడం మంచి విషయమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి దాఖలైన పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టు సోమవారం కేంద్రం నుంచి తమ అభిప్రాయాలను కోరారు.

ఈ పిటిషన్‌ను విచారించిన చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మలతో కూడిన ధర్మాసనం.. ఈ అంశంలో నాలుగు వారాల్లో ప్రతిస్పందన ఇవ్వాలని కోరారు. అవినీతి నల్లధనం,బినామీ చెల్లింపులను అరికట్టడం కోసం ఆస్తులను కూడా ఆధార్ అనుసంధానం చేయాలని ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్ విచారణ తిరిగి జూలై 18 వ తేదీకి వాయిదా పడింది.

Aadhaar: నల్లధనం అరికట్టడమే లక్ష్యం…

ఇక అవినీతి, నల్లధనం, ఆస్తులు జప్తు చేయడం ప్రభుత్వ బాధ్యత అని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై దర్యాప్తు జరిపిన హైకోర్టు ఇది మంచి అంశమని అయితే ఈ విషయంపై మరిన్ని స్పందనలు కూడా రావాలని కోర్టు కోరారు.ఇలా ఆస్తులకు కూడా ఆదార్ అనుసంధానం చేయాలి అంటూ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయంపై పలువురు స్పందిస్తూ ఇప్పటికే ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి కూడా ఆధార్ అనుసంధానం చేయబడింది. ఇక మిగిలినది ఆస్తులు మాత్రమేనంటూ పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై తదుపరి విచారణలో కోర్టు ఏ విధమైనటువంటి తీర్పును వెల్లడిస్తుందో తెలియాల్సి ఉంది.

ఆక్సిజన్, వ్యాక్సినేషన్ పై అసలు ప్లాన్ ఉందా అంటూ కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం కోర్టు!

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రతరమవుతుంది.ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య అధికమవడంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ , పడకలకొరత ఏర్పడుతోంది. ఎంతోమంది సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణం బారిన పడుతున్నారు. ఈ విధంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడటం పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే బుధవారంనాటి పలు విచారణ ఈ సందర్భంగా కేంద్రానికి హైకోర్టు పలు ప్రశ్నలు వేస్తూ నిలదీశారు.పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసి హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతుంటే మీరు పరిశ్రమల పట్ల ఆందోళన చెందుతున్నారు. మనుషుల జీవితాలు అంటే ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదా అంటూ కేంద్రంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే మంగళవారం హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను గత 24 గంటల్లో ఏం చేశారని ధర్మాసనం డిమాండ్ చేసింది. అసలు ఆక్సిజన్, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్లాన్ ఉందా అంటూ హైకోర్టు నిలదీసింది. ఆస్పత్రులకు కావలసినంత ఆక్సిజన్ సరఫరా చేసే బాధ్యత పూర్తి కేంద్రానిదేనని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం వైద్య అవసరాల కోసం పరిశ్రమల నుంచి ఆక్సిజన్ వైద్య రంగం వైపు మళ్ళించాలని పేర్కొంది. దేశం మొత్తం ఆక్సిజన్ అందించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఎలాగైనా ఆక్సిజన్ ను కొనుగోలు చేసి లేదా దొంగతనం చేసి అయినా తమ బాధ్యత నెరవేర్చాలని హైకోర్టు స్పష్టం చేసింది

అమ్మాయిలు నచ్చిన వారితో ఉండవచ్చు.. డిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..?

దేశంలో చాలా సందర్భాల్లో కోర్టులు ఇచ్చే తీర్పుల గురించి దేశ ప్రజల మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు సైతం ప్రత్యేకంగానే ఉంటాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఒక ప్రత్యేకమైన కేసులో ప్రత్యేకమైన తీర్పును ఇచ్చింది. మేజర్ అయిన అయిన నచ్చిన చోట నచ్చిన వారితో ఉండవచ్చని కోర్టు వెల్లడించింది. జస్టిసెస్ విపిన్ సంఘీ, రజ్నీష్ భట్‌నగర్‌ లతో కూడిన బెంచ్ నిన్న ఈ తీర్పును వెలువరించింది.

కోర్టు తీర్పు చెప్పిన కేసు వివరాల్లోకి వెళితే 20 సంవత్సరాల యువతి ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె సోదరుడు ఆమె కిడ్నాప్ కు గురైందని కేసు ఫైల్ చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై బబ్లూ అనే యువకుడిని ప్రేమించిన సులేఖ తనకు ఇష్టమైతే బబ్లూలోతే ఉండవచ్చని కోర్టు వెల్లడించింది.

తల్లిదండ్రులు కూతురిని తమ వద్దే ఉండాలని ఇబ్బంది పెట్టకూడదని యువతి సోదరుడికి కోర్టు సూచనలు చేసింది. యువతికి సమీపంలోని పోలీస్ స్టేషన్ బీట్ కానిస్టేబుల్ నంబర్ ను ఇచ్చి అవసరమైతే కానిస్టేబుల్ ను సంప్రదించాలని కోర్టు సూచనలు చేసింది. సెప్టెంబర్ 12న సులేఖ ఇంటి నుంచి వెళ్లీపోగా ఆమె సోదరుడు ప్రవీణ్ కిడ్నాప్ కేసు ఫైల్ చేశాడు.

సులేఖ కోర్టుకు హాజరై తాను బబ్లూనే పెళ్లి చేసుకుంటానని చెప్పడం గమనార్హం. ఇద్దరు వ్యక్తులు కావాలనుకుంటే కలిసి ఉండొచ్చని చట్టాలు చెబుతున్న తీర్పుల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.