Aadhaar: ఆధార్ ప్రస్తుతం ఒక వ్యక్తికి ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పాలి. ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఓటర్ కార్డ్ పాన్ కార్డ్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ తో అనుసంధానం జరిగింది.ఇలా ఒక వ్యక్తికి ఆధార్ అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఇకపై ఒక వ్యక్తి ఆస్తిపాస్తులను కూడా ఆధార్ తో అనుసంధానం చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆస్తులతో ఆదర్ అనుసంధానం చేయాలని ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది.దేశ పౌరుల స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను ఆధార్తో అనుసంధానం చేయాలనుకోవడం మంచి విషయమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి దాఖలైన పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టు సోమవారం కేంద్రం నుంచి తమ అభిప్రాయాలను కోరారు.
ఈ పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన ధర్మాసనం.. ఈ అంశంలో నాలుగు వారాల్లో ప్రతిస్పందన ఇవ్వాలని కోరారు. అవినీతి నల్లధనం,బినామీ చెల్లింపులను అరికట్టడం కోసం ఆస్తులను కూడా ఆధార్ అనుసంధానం చేయాలని ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్ విచారణ తిరిగి జూలై 18 వ తేదీకి వాయిదా పడింది.
ఇక అవినీతి, నల్లధనం, ఆస్తులు జప్తు చేయడం ప్రభుత్వ బాధ్యత అని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై దర్యాప్తు జరిపిన హైకోర్టు ఇది మంచి అంశమని అయితే ఈ విషయంపై మరిన్ని స్పందనలు కూడా రావాలని కోర్టు కోరారు.ఇలా ఆస్తులకు కూడా ఆదార్ అనుసంధానం చేయాలి అంటూ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయంపై పలువురు స్పందిస్తూ ఇప్పటికే ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి కూడా ఆధార్ అనుసంధానం చేయబడింది. ఇక మిగిలినది ఆస్తులు మాత్రమేనంటూ పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై తదుపరి విచారణలో కోర్టు ఏ విధమైనటువంటి తీర్పును వెల్లడిస్తుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…