Aadhaar: ఆధార్ ప్రస్తుతం ఒక వ్యక్తికి ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పాలి. ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఓటర్ కార్డ్ పాన్ కార్డ్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ తో అనుసంధానం జరిగింది.ఇలా ఒక వ్యక్తికి ఆధార్ అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఇకపై ఒక వ్యక్తి ఆస్తిపాస్తులను కూడా ఆధార్ తో అనుసంధానం చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆస్తులతో ఆదర్ అనుసంధానం చేయాలని ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది.దేశ పౌరుల స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను ఆధార్తో అనుసంధానం చేయాలనుకోవడం మంచి విషయమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి దాఖలైన పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టు సోమవారం కేంద్రం నుంచి తమ అభిప్రాయాలను కోరారు.
ఈ పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన ధర్మాసనం.. ఈ అంశంలో నాలుగు వారాల్లో ప్రతిస్పందన ఇవ్వాలని కోరారు. అవినీతి నల్లధనం,బినామీ చెల్లింపులను అరికట్టడం కోసం ఆస్తులను కూడా ఆధార్ అనుసంధానం చేయాలని ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్ విచారణ తిరిగి జూలై 18 వ తేదీకి వాయిదా పడింది.
ఇక అవినీతి, నల్లధనం, ఆస్తులు జప్తు చేయడం ప్రభుత్వ బాధ్యత అని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై దర్యాప్తు జరిపిన హైకోర్టు ఇది మంచి అంశమని అయితే ఈ విషయంపై మరిన్ని స్పందనలు కూడా రావాలని కోర్టు కోరారు.ఇలా ఆస్తులకు కూడా ఆదార్ అనుసంధానం చేయాలి అంటూ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయంపై పలువురు స్పందిస్తూ ఇప్పటికే ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి కూడా ఆధార్ అనుసంధానం చేయబడింది. ఇక మిగిలినది ఆస్తులు మాత్రమేనంటూ పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై తదుపరి విచారణలో కోర్టు ఏ విధమైనటువంటి తీర్పును వెల్లడిస్తుందో తెలియాల్సి ఉంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…