Tag Archives: devisri prasad

సంగీత దర్శకుడు దేవిశ్రీ ఇంట విషాదం..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేవి శ్రీప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే గాయాలు అధికమవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ మరణించడంతో దేవి ఇంట విషాదం నెలకొంది. తన బాబాయ్ మరణవార్త విన్న దేవి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

ఇదిలా ఉండగా ఒక్క మరణవార్త వారిని కృంగదీస్తుందంటే మరొక మరణ వార్త విన్న దేవి శ్రీ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలోకి నెట్టేసింది. దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ మరణవార్త విన్న తన మేనత్త మహాలక్ష్మి గుండెపోటుతో మరణించడంతో దేవి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి రెండు మరణ వార్తలతో దేవి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి పుష్ప సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కాంబోలో తెరకెక్కినటువంటి ఆర్య, ఆర్య 2 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన సంగతి తెలుగుసిందే. ఈ క్రమంలోనే పుష్ప సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన
దాక్కో దాక్కో మేక పాట విడుదలవగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా, సంతోషంగా ఉన్న దేవి ఇంట తన బాబాయి, మేనత్త మరణవార్తతో విషాదం నిండిపోయింది.

మారిన మ్యూజికల్ కాంబినేషన్.. మరి ప్రేక్షకులను ఆకట్టుకుంటారా!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణను దక్కించుకున్నాయి. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల కాంబినేషన్ , హీరో డైరెక్టర్ కాంబినేషన్ కాకుండా, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ల కాంబినేషన్ కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఈ విధంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరటాల శివ-దేవి శ్రీ ప్రసాద్, శ్రీకాంత్ అడ్డాల -మిక్కీ జె మేయర్, శివ నిర్వాణ -గోపీసుందర్ కాంబినేషన్లు అలాంటి కోవకు చెందుతాయి. ఇప్పటివరకు ఈ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే ఇన్ని రోజులుగా వరుస కాంబినేషన్లో వస్తున్న వీరిద్దరూ ఈ సారి వారి కాంబినేషన్ మార్చుకున్నారు.

జస్ట్ ఫర్ చేంజ్ కోసం ఈ విధంగా మారారా.. లేక వీరికి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ విధంగా మ్యూజిక్ డైరెక్టర్లు మారారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతాగ్యారేజ్, భరత్ అనే నేను, మిర్చి, శ్రీమంతుడు వంటి చిత్రాలకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని పాటలు శ్రోతలను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ కి బదులుగా మణిశర్మ సంగీతం అందించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన  ‘లాహే లాహే’ పాట శ్రోతలను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారులోకం, ముకుంద, బ్రహ్మోత్సవం వంటి సినిమాలకు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

నిన్ను కోరి, మజిలీ, వంటి చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల మదిని దోచిన శివ నిర్వాణ తన చిత్రాలకు గోపీసుందర్ సంగీత దర్శకత్వం వహించారు. ప్రస్తుతం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “టక్‌ జగదీష్‌” చిత్రానికి సంగీతం అందించే అవకాశాన్ని ఎస్.ఎస్ తమన్ కు కల్పించారు. ఈ విధంగా ఈ డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్ ల కాంబినేషన్ ఈ సారీ మారిందని చెప్పవచ్చు. మరి ఈ కాంబినేషన్ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

జీవితంలో ఆ తప్పు ఎప్పటికీ చేయనంటున్న ఛార్మి..!!

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పిన ఛార్మి కౌర్.. ఆ తర్వాత కొన్నాళ్ళకు హీరోయిన్ స్టేజ్ నుంచి తప్పుకొని నిర్మాతగా మారింది.. అయితే ఈమె హీరోయిన్ గా కొనసాగుతున్న కాలం నుంచే ఈమె పెళ్లి కి సంబంధించిన వార్తలు ఓ రేంజ్ లో ప్రచారమయ్యాయి.. అంతేకాదు ఈ అమ్మడు హీరోయిన్ గా చాలా బిజీగా ఉన్న టైంలోనే దేవిశ్రీ ప్రసాద్‌తో ప్రేమలో ఉందని.. అతణ్ని పెళ్లి చేసుకోబోతోందని జోరుగా ప్రచారం జరిగింది. ఐతే కొన్నేళ్ల తర్వాత ఆ ప్రచారానికి తెరపడింది.

ఆ తర్వాత కథానాయికగా ఛార్మి ప్రభ తగ్గడం మొదలయ్యాక ఛార్మి పెళ్లి గురించి కొన్ని సార్లు చర్చ వచ్చింది. కానీ ఆమె పూరి జగన్నాథ్ క్యాంపులో చేరిపోయి ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయింది. కొన్నేళ్లుగా ఆయనతో కలిసి సాగుతోంది. సినిమాలు నిర్మిస్తోంది. ప్రస్తుతం కూడా ఆమె ‘లైగర్’ సినిమా పనిలో బిజీగా ఉంది.ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ఛార్మి పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.

ఆమె పెళ్లి వైపు అడుగులు వేయబోతున్నట్లుగా మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. వీటిపై ఛార్మి తనదైన శైలిలో స్పందించింది.తన పెళ్లి వార్తలపై ఛార్మి ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అందులో.. ”నేనిప్పుడు నా కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నా. నా జీవితం పట్ల చాలా సంతోషంగానూ ఉన్నాను. కాబట్టి పెళ్లి అనే తప్పును నా జీవితంలో ఎప్పటికీ చేయను” అనేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఓకే కానీ.. ఎప్పటికీ పెళ్లి చేసుకునేదే లేదు అని ఛార్మి ఖరాఖండిగా చెప్పేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇది పూరి జగన్నాథ్ ప్రభావంతో తీసుకున్న నిర్ణయమా అన్న చర్చ నడుస్తోంది జనాల్లో.పూరి పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు కానీ.. పెళ్లి విషయంలో ఆయనంత సానుకూల వ్యాఖ్యలు చేయడు. పాడ్ కాస్ట్‌ల్లో కూడా పెళ్లి గురించి కొంత ప్రతికూల వ్యాఖ్యలే చేశాడు. ఇక పూరి గురువు రామ్ గోపాల్ వర్మ సంగతి తెలిసిందే. పెళ్లి గురించి పూర్తి నెగెటివ్‌గా మాట్లాడతాడు. ఛార్మి మీద వీరి ప్రభావం బాగానే పడిందని.. అందుకే లైఫ్ లో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదనిఅంటోంది ఛార్మి..!!