Movie News

మారిన మ్యూజికల్ కాంబినేషన్.. మరి ప్రేక్షకులను ఆకట్టుకుంటారా!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణను దక్కించుకున్నాయి. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల కాంబినేషన్ , హీరో డైరెక్టర్ కాంబినేషన్ కాకుండా, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ల కాంబినేషన్ కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఈ విధంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరటాల శివ-దేవి శ్రీ ప్రసాద్, శ్రీకాంత్ అడ్డాల -మిక్కీ జె మేయర్, శివ నిర్వాణ -గోపీసుందర్ కాంబినేషన్లు అలాంటి కోవకు చెందుతాయి. ఇప్పటివరకు ఈ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే ఇన్ని రోజులుగా వరుస కాంబినేషన్లో వస్తున్న వీరిద్దరూ ఈ సారి వారి కాంబినేషన్ మార్చుకున్నారు.

జస్ట్ ఫర్ చేంజ్ కోసం ఈ విధంగా మారారా.. లేక వీరికి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ విధంగా మ్యూజిక్ డైరెక్టర్లు మారారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతాగ్యారేజ్, భరత్ అనే నేను, మిర్చి, శ్రీమంతుడు వంటి చిత్రాలకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని పాటలు శ్రోతలను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ కి బదులుగా మణిశర్మ సంగీతం అందించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన  ‘లాహే లాహే’ పాట శ్రోతలను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారులోకం, ముకుంద, బ్రహ్మోత్సవం వంటి సినిమాలకు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

నిన్ను కోరి, మజిలీ, వంటి చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల మదిని దోచిన శివ నిర్వాణ తన చిత్రాలకు గోపీసుందర్ సంగీత దర్శకత్వం వహించారు. ప్రస్తుతం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “టక్‌ జగదీష్‌” చిత్రానికి సంగీతం అందించే అవకాశాన్ని ఎస్.ఎస్ తమన్ కు కల్పించారు. ఈ విధంగా ఈ డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్ ల కాంబినేషన్ ఈ సారీ మారిందని చెప్పవచ్చు. మరి ఈ కాంబినేషన్ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago