తెలుగు ఇండస్ట్రీలో కలర్స్ స్వాతి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన నటన ద్వారా బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. బుల్లితెరపై తన కెరీర్ ను ప్రారంభించి వెండితెరపై హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న అతి కొంతమంది అమ్మాయిలలో కలర్స్ స్వాతి ముందుంటారు.
సుమారు 18 ఏళ్ళ క్రితం కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా పరిచయమైన స్వాతి తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుని పేరుకు ముందు కలర్స్ అనే పేరును సంపాదించుకుంది. కొన్ని సంవత్సరాల పాటు బుల్లితెర పై దూసుకుపోయిన కలర్స్ స్వాతి వెండితెరపై కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకుల దగ్గర పని చేస్తోంది.వెండితెరపై కలర్స్ స్వాతి నటించిన స్వామి రారా, కార్తికేయ వంటి చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా కలర్ స్వాతి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ప్రస్తుతం తెలుగులో “పంచతంత్రం” అనే కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. కొత్త దర్శకుడు హర్ష పులిపాక ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కలర్స్ స్వాతి నటిస్తున్న పంచతంత్రం సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను హీరో అడవి శేషు విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ పోస్టు ద్వారా సినిమాలోని కొత్తదనం కనిపిస్తోంది. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది. కలర్స్ స్వాతి పంచతంత్రం సినిమాలో సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం, సముద్రఖని, హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక, నరేష్, అగస్త్య, దివ్య శ్రీపాద వంటి తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా గురించి స్వాతి మాట్లాడుతూ ఆరేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న తనకు ఇది ఒక ఫర్ ఫెక్ట్ కథ అని స్వాతి తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…