Tag Archives: england

Mohammed Shami: కర్మ అంటే ఇదే.. షోయబ్ అక్తర్ కి కౌంటర్ ఇచ్చిన మహ్మద్ షమీ స్వీట్ వైరల్?

Mohammed Shami: టి20 ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా ఇంగ్లాండ్ పాకిస్తాన్ పోటీ పడగా పాకిస్థాన్ పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది.టి20 ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా రెండోసారి కప్పు గెలవాలని భావించిన పాకిస్తాన్ ఆశలపై ఇంగ్లాండు నీళ్లు చల్లి చివరికి కప్పును సొంతం చేసుకున్నారు.

ఈ విధంగా పాకిస్తాన్ ఓటమి పాలు కావడంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ అక్తర్ బాధాకరమైన ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే షోయబ్ బ్రోకెన్ హార్ట్ ఎమోజి షేర్ చేస్తూ పాక్ ఓటమి పాలు కావడం ఎంతో బాధాకరంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఈయన ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ పై భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించారు.

ఈ సందర్భంగా షోయబ్ చేసిన ట్వీట్ కి ఈయన రిప్లై ఇస్తూ.. దీనినే కర్మ అంటారు బ్రదర్ అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా రెండో సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి పాలు కావడంతో టీమిండియా ఆట తీరును ఉద్దేశిస్తూ పాక్ ఆటగాళ్లు హేళన చేస్తూ ట్వీట్లు చేశారు.

Mohammed Shami: పాక్ ఆటగాళ్లకు కౌంటర్ ఇచ్చిన మహమ్మద్ షమీ

ఫైనల్ లో పాకిస్తాన్ భారత్ తో పోటీ పడటం కోసం ఎదురు చూస్తుందని అయితే అది జరగదు అంటూ టీమిండియాని హేళన చేస్తూ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఫైనల్ లో పాకిస్తాన్ ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలు కావడంతో మహమ్మద్ షమీ ఈ విధంగా షోయబ్ అక్తర్ ట్వీట్ కి కౌటరిస్తూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Team India Vs England: రికార్డ్స్ పరంగా ఎవరు బలంగా ఉన్నారు? ఇండియానా? ఇంగ్లాండ్?

Team India Vs England: ఈ టీ20 ప్రపంచ కప్ క్రికెట్ అభిమానులకి ఇప్పటివరకూ ఫుల్ మీల్స్ పెట్టింది. ఎన్నో అద్భుతాలు చేస్తాయి అనుకున్న జట్లు ఇంటికి పంపివేయబడ్డాయి. పసికూనలు అనుకున్న జట్లు పెద్ద జట్లకు చెమటలు పట్టించాయి. ఇంటికి వెళ్ళిపోతుంది అనుకున్న పాకిస్తాన్ అనూహ్యంగా సెమీస్ కి వెళ్ళి అక్కడి నుంచి ఫైనల్ కి చేరింది. ఎవరూ అనుకుని ఉండరు పాకిస్తాన్ సెమీస్ కి వెళ్ళగలదు అని. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పాకిస్తాన్.

టీమిండియా ఇంగ్లాండ్ లలో రికార్డ్స్ పరంగా ఎవరు మెరుగ్గా ఉన్నారు?

ఇంకొక ఆసక్తికరమైన మ్యాచ్ కి రంగం సిద్ధమయ్యింది. ఫైనల్స్ లో స్థానం కోసం టీమిండియా ఇంగ్లాండ్ టీమ్ తో తలపడనుంది. ఇంగ్లాండ్ టీమ్ ని మట్టికరిపించి పాకిస్తాన్ తో ఫైనల్స్ లో తలపడాలని ఇండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఇంగ్లాండ్ టీమ్ ని తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. పొట్టి ఫార్మాట్ లో ఇంగ్లాండ్ టీమ్ చాలా మెరుగ్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అసలు రికార్డ్స్ ఏం చెప్తున్నాయి ఇప్పుడు చూద్దాం. టీ20 ప్రపంచకప్‌లో మూడు సార్లు ఇరు జట్లు తలపడ్డాయి. అయితే రెండు సార్లు మెన్ ఇన్ బ్లూ గెలవగా ఒకసారి ఇంగ్లీష్ టీమ్ గెలిచింది. ఇక పొట్టి ఫార్మాట్ విషయానికొస్తే టీమిండియా కి మంచి గణాంకాలు ఉన్నాయి. సగం కంటే ఎక్కువ మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఆడిన 22 మ్యాచ్ లలో 12 సార్లు విజేతగా నిలిచింది ఇండియా ఇందులో ఇంగ్లాండ్ గడ్డ మీద గెలిచిన మ్యాచ్ లలో కూడా ఉన్నాయి. అయితే 10 సార్లు ఇంగ్లాండ్ జట్టు గెలిచింది.

Team India Vs England: టీ20 వరల్డ్ కప్ పోటీలో ఇలా..

2007 టీ20 వరల్డ్ కప్,2009 టీ20 వరల్డ్ కప్,2012 టీ20 వరల్డ్ కప్ లలో ఇరు జట్లు తలపడ్డాయి. 2009 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే మిగిలిన రెండు మ్యాచ్ లలో ఇండియా గెలుపు సొంతం చేసుకుంది. 2007 టీ20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ బ్యాట్ తో వీరవిహారం చేసాడు.

Virat Kohli: కళ్ళు కనిపించవు.. కానీ విరాట్ కోహ్లీ ఇన్స్పిరేషన్.. విరాట్ బ్లైండ్ ఫ్యాన్ స్టోరీ ఇదే!

Virat Kohli: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాకుండా విదేశీ వ్యక్తుల సైతం తనకు అభిమానులుగా ఉన్నారు అంటే ఈయనకు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసింది. ఇలా ఇంగ్లాండ్ కి చెందిన ఎలీ అనే ఒక బ్లైండ్ యువతి విరాట్ కోహ్లీకి అభిమానిగా మారిపోయారు. తనకు కళ్ళు కనిపించక పోయిన ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ బయోగ్రఫీ విన్న తర్వాత ఆమె తనకు అభిమానిగా మారిపోయినట్లు వెల్లడించారు.

ఇలా ఇంగ్లాండ్ కి చెందిన ఈమె విరాట్ కోహ్లీకి వీరాభిమానిగా మారడంతో కోహ్లీ కోసం వరల్డ్ కప్ మ్యాచ్ చూడటం కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. ఈమె విరాట్ కోహ్లీ బయోగ్రఫీ విన్న తర్వాత ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. తనకు టెన్నిస్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన ఎలీ కోహ్లీ కూడా టెన్నిస్ అంటే ఇష్టపడతారని తెలుసుకుంది.

కోహ్లీ ఎలా ఉంటారో ఎలా ఆడతారో తెలియక పోయినప్పటికీ ఈమె తనకు అభిమానిగా మారిపోవడంతో విరాట్ కోహ్లీ సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అయితే ఇలా ఒక బ్లైండ్ ఉమెన్ తనకు అభిమానిగా మారిపోయారని తెలియడంతో విరాట్ సైతం తన జెర్సీతో పాటు ఆటోగ్రఫీ చేసినటువంటి ఒక బ్యాట్ ను కూడా తనకు బహుమానంగా ఇచ్చారు.

Virat Kohli: కోహ్లీ కోసం ఇండియాకి సపోర్ట్ చేసిన ఎలీ..

ఇక ఈమెకు కోహ్లీ పై ఉన్న ప్రేమకు తన తల్లి ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు తన తల్లి ఇంగ్లాండ్ కి మద్దతు తెలుపగా ఈమె మాత్రం కోహ్లీ కోసం ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా ఈమె ఇండియాని సపోర్ట్ చేస్తున్నప్పటికీ తన తల్లి ఏమాత్రం అడ్డు చెప్పలేదు. ఇకపోతే ఈ మ్యాచ్ చూడటం కోసం ఆమె తన తల్లి సహాయంతో ఏకంగా స్టేడియంకు రావడంతోనే తనకు కోహ్లీ అంటే ఏ విధమైనటువంటి అభిమానం ప్రేమ ఉందో అర్థం అవుతుంది.

క్రికెట్ అభిమానులు పండగ చేసుకునే వార్త.. ఏంటంటే..

గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి అభిమానులు సందడి చేస్తున్నారు. ఐపీఎల్ అయిపోగానే వెంటనే టీ20 వరల్డ్ కప్ వచ్చింది. తర్వాత వెంటనే మళ్లీ న్యూజిలాండ్ తో టీ20 మరియు టెస్టు ఆడనున్నారు. 2022 ఆస్ట్రేలియా వేదికగా మరో టీ20 వరల్డ్ కప్ సమరం ఉండనుంది.

మళ్లీ మరుసటి సంవత్సరం 2023 లో వన్డే వరల్డ్ కప్ మన భారతదేశం వేదిక కానుంది. అయితే తాజాగా 2024లో నిర్వహించే క్రికెట్ కు సంబంధించి 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికలను ఐసీసీ తాజాగా ప్రకటించింది. 14 దేశాల్లో ఈ టోర్నమెంట్లు జరుగనున్నట్లు ట్విట్టర్ వేదిక ద్వారా ప్రకటించారు. 2024 టీ 20 వరల్డ్‌ కప్‌ యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ లో జరుగనుంది.

2025 చాంపియన్‌ ట్రోపికి పాకిస్తాన్‌ వేదిక కానుంది. ఇక 2026 టీ20 వరల్డ్‌ కప్‌ ఇండియా, శ్రీలంక లో జరుగనుంది. ఇక 2027 వరల్డ్‌ కప్‌ కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలు కానున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు. అలాగే… 2028 టీ20 వరల్డ్‌ కప్‌ ఆసీస్‌, న్యూజిలాండ్‌ దేశాలు వేదికలు కానున్నాయి. 2029 లో చాంపియన్‌ ట్రోఫికి ఇండియా వేదిక కానుంది.

2030 టీ 20 వరల్డ్‌ కప్‌కు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ లు వేదికలు కానున్నాయి. 2031 వరల్డ్‌ కప్‌ కు ఇండియా, బంగ్లా దేశ్ దేశాలు వేదికలు కానున్నాయి. ఈ కొత్త వేదికలు.. టైం టేబుల్ లతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారమే వారి వారి వ్యక్తిగత పనులను చేసుకునేందుకు అవకాశం ఉండనుంది.

షేర్లపై కొన్ని లక్షల కోట్ల సంపాదన.. కానీ సంతృప్తి చెందలేదు.. చివరకు 22 లక్షల ఎకరాలు కొనుగోలు చేశారు..

మనం చదువుకునే రోజుల్లో నిజాం వద్ద కొన్ని లక్షల ఎకారాలు ఉండేవని చదువుకున్నాం. తర్వాత అవి చిన్న చిన్న భాగాలుగా విడిపోయి.. బడా భూస్వాముల వద్ద ఎక్కువగా.. పేదల దగ్గర ఒకటి నుంచి మూడు హెక్టార్ల వరకు భూమి ఉంది. ప్రస్తుతం 100 ఎకరాల భూమి ఉందంటే.. వామ్మో అంటూ అంటుంటాం. కానీ ఇక్కడ మనం చెప్పే వ్యక్తికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలిస్తే.. షాక్ అవుతాం. అతడి దగ్గర 22 లక్షల ఎకరాలు ఉన్నాయట. అసలు అతడు ఎవరు.. ఎంది కథ.. తెలుసుకుందాం..

రూపర్ట్ ముర్డోక్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ కు సంబంధించి పత్రికలల్లో ఇతడికి అధిక వాటా కలిగి ఉంది. ఇంతకంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టి.. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకడిగా నిలిచాడు ‘జాన్ మెలోన్’. అతడు తన సొంతంగా అమెరికాలో ‘లిబర్టీ మీడియా’అనే టీవీ ఛానెల్ ను కూడా స్థాపించాడు. ఇతడు వారెన్ బఫెట్ కంటే కూడా ఎక్కవు పెట్టుబడులు పెట్టేవాడు.

ఇలా కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం.. షేర్లు కొనడం చేస్తూ ఉంటాడు. అతడికి అంతర్జాతీయ క్రీడ అయిన అట్టాంటా బ్రేవ్స్ అనే బేస్ బాల్ జట్లులో 8 శాతం షేర్లు కొన్నాడు. అతడు ఎక్కువ శాతం మీడియాకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. అందులోనే ఎక్కువగా లాభాలను గడిస్తాడు. అయితే ఇంత సంపాదిస్తున్న అతడు భూమిపై ఎందుకు పెట్టుబడి పెట్టాడో తెలుసా.. అతడు వీటిపై ఆధిపత్యం చెలాయించి డబ్బులు సంపాదిస్తున్నా తృప్తి మాత్రం లేదు. ఓ రోజు అతడు పెన్సిల్వేనియాలో ఒక ఫామ్‌కి రెస్ట్ కోసం వెళ్లాడు.

అక్కడ ఒక కుటుంబాన్ని చూసి భూమిపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారట. మొదట న్యూ మెక్సికోలోని బెల్‌ రాంచ్‌ను 2.90లక్షల ఎకరాల విస్తీర్ణంతో వ్యవసాయక్షేత్రాన్ని కొనుగోలు చేశారు. తర్వాత ఫ్లోరిడాలో 14 మిలియన్‌ డాలర్లతో 800 ఎకరాల బ్రిడిల్‌వుడ్ ఫామ్స్‌ను సొంతం చేసుకున్నారు. తర్వాత అమెరికాలోని ప్రతీ ప్రదేశంలో భూములు కొనుక్కుంటూ వచ్చాడు. దీంతో అమెరికాలోని అతిపెద్ద భూ ప్వామిగా ఎదిగాడు. అతడి పేరు మీదు కొన్ని వందల హోటళ్లు కూడా ఉన్నాయి. ఇలా అతడు అమెరికాలో అందరికంటే ఎక్కువ భూమి కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. మొత్తం 22లక్షల ఎకరాల భూమి అతని పేరు మీద ఉంది.

యూట్యూబ్ లో చూసి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. అదెలా అనుకుంటున్నారా..

ఆమెకు మొదట ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతడికి ప్రస్తుతం 5 ఏళ్లు. ప్రస్తుతం భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది. అయితే తన కొడుకు ఒంటరిగా పెరగడం ఇష్టంలేని తాను మరో బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంది. భర్తకు దూరం అవ్వడంతో మరో వ్యక్తికి దగ్గర కావాలని ఆమె అనుకోలేదు.

దీంతో ఆమె కృత్రిమ గర్భధారణ ద్వారా సంతానాన్ని పొందేందుకే ఆమె మొగ్గుచూపింది. దాని కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. తర్వాత ఏమైంది.. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.. ఇంగ్లాండ్ కు చెందిన స్టెఫానీ టేలర్ కు ప్రస్తుతం 33 ఏళ్లు. ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయింది. వివాదాల కారణంగా అతడి నుంచి ఆమె విడిపోయింది.

మళ్లీ ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకుంది. దీని కోసం ప్రైవేట్ ఆసుపత్రులను సంప్రదించింది. అక్కడ వాటికి దాదాపు 1.6 లక్షల డబ్బులు ఖర్చు అవుతాయని అనడంతో ఆమె విరమించుకుంది. ఎలాగైన గర్భం దాల్చాలని నిర్ణయం తీసుకుంది. దాని కోసం ఓ యాప్ ద్వారా వీర్య దాతను కనుక్కుంది.

అడ్రస్ ఇవ్వడంతో అతడు ఆమె అడ్రస్ కు వచ్చి వీర్యం ఇచ్చి వెళ్లాడు. దానిని ఆమె యూట్యూబ్ లో వీడియోలను చూసి దానికోసం ఈబే ద్వారా కృత్రిమగర్భధారణ కిట్‌ను కొనుగోలు చేసింది. అనంతరం యూట్యూబ్ లో చూపించిన విధంగా ఆమె చేసింది. తర్వాత ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆడ బిడ్డ పేరు ఈడెన్ అని పేరు పెట్టుకుంది. ఈ ప్రక్రియకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఆమె ఒప్పించింది. దీంతో ఆమె వార్తల్లో నిలిచింది.

టెస్టు మ్యాచ్ మధ్యలో అభిమాని హంగామా.. వీడియో వైరల్..!

టీమిండియా టెస్టులను ఇంగ్లండ్ తో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తవగా మూడో టెస్టు కోసం ఇరు ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అయితే రెండో టెస్టు మూడో రోజు లంచ్ విరామం తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెడుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అందేంటంటే.. ప్రేక్షకుల గ్యాలరీ నుంచి వచ్చిన జార్వో అనే ఒక అభిమాని టీమిండియా ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌లోకి వెళ్లిపోయి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే.

అయితే మొదట వాళ్లు జార్వోని గుర్తుపట్టలేకపోయినప్పటికీ ఆ తర్వాత తేరుకున్న భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని తీసుకెళ్లారు. భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చెప్పడం ట్రెండింగ్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అయింది. అయితే అతడు ఇలాంటి పనులు చేయడం కొత్తేమి కాదు.. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే జార్వో చేసిన మరో పని ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.

అది ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ టెస్టు మ్యాచ్ జరుగుతుందని తెలుస్తోంది. అతడు గ్రౌండ్ లో ఉన్న బౌండరీ లైన్ క్రాస్ చేసి.. లోపలికి వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న టెంట్ వేసుకొని అందులో పడుకున్నాడు. కొన్ని సెకన్ల పాటు అలా పడుకొని లేచి విక్టరీ సింబల్ చూపించాడు. తాను అనుకున్నది సాధించినట్లు ఆనందంలో ఉండగా.. అక్కడకు వచ్చిన భద్రతా సిబ్బంది అతడిని తీసుకెళ్లారు.

ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. తాజాగా అతడు టీమిండియా క్రికెటర్లతో హంగామా చేసిన వీడియో వైరల్ అవ్వగా.. అంతక ముందు జరిగిన ఈ వీడియో కూడా సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. ఇక లార్డ్స్‌ టెస్టులో 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్ టీమ్ ను చిత్తు చేసింది టీమిండియా. ఐదు టెస్ట్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కోహ్లీసేన. మూడో టెస్టు ఈ నెల 25 నుంచి జరగనుంది.