Featured

క్రికెట్ అభిమానులు పండగ చేసుకునే వార్త.. ఏంటంటే..

గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి అభిమానులు సందడి చేస్తున్నారు. ఐపీఎల్ అయిపోగానే వెంటనే టీ20 వరల్డ్ కప్ వచ్చింది. తర్వాత వెంటనే మళ్లీ న్యూజిలాండ్ తో టీ20 మరియు టెస్టు ఆడనున్నారు. 2022 ఆస్ట్రేలియా వేదికగా మరో టీ20 వరల్డ్ కప్ సమరం ఉండనుంది.

మళ్లీ మరుసటి సంవత్సరం 2023 లో వన్డే వరల్డ్ కప్ మన భారతదేశం వేదిక కానుంది. అయితే తాజాగా 2024లో నిర్వహించే క్రికెట్ కు సంబంధించి 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికలను ఐసీసీ తాజాగా ప్రకటించింది. 14 దేశాల్లో ఈ టోర్నమెంట్లు జరుగనున్నట్లు ట్విట్టర్ వేదిక ద్వారా ప్రకటించారు. 2024 టీ 20 వరల్డ్‌ కప్‌ యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ లో జరుగనుంది.

2025 చాంపియన్‌ ట్రోపికి పాకిస్తాన్‌ వేదిక కానుంది. ఇక 2026 టీ20 వరల్డ్‌ కప్‌ ఇండియా, శ్రీలంక లో జరుగనుంది. ఇక 2027 వరల్డ్‌ కప్‌ కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలు కానున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు. అలాగే… 2028 టీ20 వరల్డ్‌ కప్‌ ఆసీస్‌, న్యూజిలాండ్‌ దేశాలు వేదికలు కానున్నాయి. 2029 లో చాంపియన్‌ ట్రోఫికి ఇండియా వేదిక కానుంది.

2030 టీ 20 వరల్డ్‌ కప్‌కు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ లు వేదికలు కానున్నాయి. 2031 వరల్డ్‌ కప్‌ కు ఇండియా, బంగ్లా దేశ్ దేశాలు వేదికలు కానున్నాయి. ఈ కొత్త వేదికలు.. టైం టేబుల్ లతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారమే వారి వారి వ్యక్తిగత పనులను చేసుకునేందుకు అవకాశం ఉండనుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అంతర్జాతీయ విజయాల కోసం తిరుమల చేరుకున్న పీవీ సింధు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…

19 minutes ago

ఎవరీ నటాలీ బేకర్?.. అమెరికా-ఇరాన్ చర్చలతో ట్రెండ్‌లోకి

ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…

23 minutes ago

సచిన్‌తో హీరోయిన్ ప్రేమాయణం?.. అసలు నిజం బయటపెట్టిన నటి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…

43 minutes ago

విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కలు.. రూ.2.68 కోట్ల ఆదాయం!

విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…

1 hour ago

సీఎస్‌కేకు మరో షాక్.. ఖలీల్ అహ్మద్ టోర్నీ నుంచి ఔట్

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…

2 hours ago

హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ.. ఆకివీడు రామాలయం కేసులో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…

2 hours ago