సూర్యుడు తూర్పున ఉదయించిన దగ్గర నుంచి పడమర అస్తమించే వరకు ప్రతీ ఒక్కరు వివిధ రకాల పనులు చేస్తుంటారు. ఆ రోజంతా పనుల్లోనే బిజీ అయిపోతుంటారు. ఇంటి పనులు చేసేవాళ్ల దగ్గర నుంచి ఆఫీస్ పనులు చేసే వాళ్ల వరకు ఎవరి దారి వాళ్లదే అన్నట్లు ఉంటారు. ఇక సూర్యుడు అస్తమించగానే.. ఇళ్లల్లోకి వచ్చి చేరుతుంటారు.
ఇలా వారి జీవన గమనం సాగుతుంది. అయితే సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను చేయకూడదట. ఆ విషయాలు చాలా మందికి తెలియదు. వాస్తు శాస్త్రం ప్రకారం అవేంటో తెలుసుకుందాం.. ముఖ్యంగా గోళ్లు కత్తిరించుకోవడం.. జుట్టు కత్తిరించుకోవడం పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో పాజిటివ్ మైండ్ కాకుండా నెగెటివ్ మైండ్ తో కుటుంబసభ్యులు ఉంటారట.
ఉప్పును సాయంత్రం అయిన తర్వాత ఇతరులకు దానం చేయకూడదు. అంతే కాదు ఇంటిని శుభ్రం కూడా చేయకూడదట. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందనే నానుడి ఉంది. అందుకే చాలామంది ఉదయమే పనులను చేసుకుంటారు. ఇక అంత్యక్రియలను కూడా సూర్యాస్తమయం తర్వాత చేయకూడదు అని పెద్దలు చెబుతుంటారు.
ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మ క్షోభకు గురవుతుందని చెబుతుంటారు. వారికి మరో జన్మ అనేది ఉండదట. ఇక చివరగా సూర్యుడు పడమర అస్తమించిన తర్వాత నిద్ర పోకూడదట. ఇలా చేస్తే అష్ట దరిద్రం అంతా ఇంట్లోనే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పైన చెప్పిన విధంగా సూర్యాస్తమయం తర్వాత వాటికి దూరంగా ఉంటే లక్ష్మీ మీ ఇంట్లోకి వచ్చేసినట్లే.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…