PF Account: మీరు పీఎఫ్ ఖాతాదారులా.. అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటంటే..మొదట పీఎఫ్ ఖాతా ఉన్న వారికి నెలకు వాళ్లకు వచ్చే బేసిక్ , డీఏ తో కలుకొని.. మొత్తం 12 శాతం వరకు కట్ అవుతుంది. దీనికి కంపెనీ నుంచి కూడా అదే 12 శాతం ఎమౌంట్ ను ఎంప్లాయి షేర్ కింద కొంత శాతం.. పెన్షన్ కింద 3 శాతానికి పైగా ఇస్తుంది.
PF Account: మీరు పీఎఫ్ ఖాతాదారులా..అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!
దీనిలో పెన్షన్ అమౌంట్ తీసుకోవాలంటే.. ఆ కంపెనీకి రిజైన్ చేసిన తర్వాతనే తీసుకుంటారు. ఇక పీఎఫ్ ఉన్నవాళ్లు కింద చెప్పే కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవేంటంటే.. జాబ్ కు రాజీనామ చేసిన తర్వాత.. అందులో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే అది ఇన్ యాక్టీవ్ అయిపోతుంది.
PF Account: మీరు పీఎఫ్ ఖాతాదారులా..అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!
దీనిని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అకౌంట్ హోల్డర్ మరణిస్తే.. ఆ అకౌంట్ ఇన్ యాక్టీవ్ అయిపోతుంది. మరణించిన కొన్ని రోజుల తర్వాత అందులోని అమౌంట్ నామినీ తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇక ఏడేళ్ల కాలంలో అందులో ఎలాంటి క్లెయిమ్ జరగకపోతే.. ఆ మొత్తం అమౌంట్ అనేది .. సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు.. పీఎఫ్ ఖాతా నుంచి మొత్తం డబ్బులను విత్ డ్రా చేసుకున్నా కూడా ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది. నామీనీ వివరాలను కచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నామినీ వివరాలు ఎంటర్ చేయకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక అన్నింటికంటే ఉపయోగకరమైన విషయం ఎంటంటే.. పీఎఫ్ ఖాతాలో ఉన్న ఎంప్లాయ్ షేర్.. ఎంప్లాయీ షేర్.. పెన్షన్ అమౌంట్ మొత్తం తీసుకోవాలంటే.. సదరు కంపెనీలో జాబ్ రిజైన్ చేసిన మూడు నెలల తర్వాతనే తీసుకోవాలి.. దీని కంటే ముందు తీసుకుంటే.. అంత అమౌంట్ రాదు.
సాధారణంగా ఉద్యోగం చేసే వారిలో వారి జీవితం నుంచి కొంత భాగం పీఎఫ్ అకౌంట్లో జమవుతూ వస్తుంది. ఈ విధంగా పీఎఫ్ అకౌంట్ లో జమయిన డబ్బులు రిటైర్మెంట్ తర్వాత తీసుకోవచ్చు లేదా అత్యవసర పరిస్థితులలో మనం ఆ డబ్బులను మధ్యలో కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ డబ్బులు డ్రా చేసుకోవడానికి సరైన కారణం ఉండాలి.
అయితే కొందరు కొన్నిసార్లు ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి వెళ్తుంటారు.అలాంటప్పుడు కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు పాత పీఎఫ్ అకౌంట్ కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ పీఎఫ్ అకౌంట్ కంటిన్యూ కావాలంటే కచ్చితంగా ఒక పని చేయాల్సి ఉంటుంది.ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించిన ఆ డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకోలేరు లేదా విత్ డ్రా కూడా చేసుకోలేరు.
మన పాత పీఎఫ్ అకౌంట్ కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ కావాలంటే మనం జాబ్ మానేసిన ఎగ్జిట్ తేదీని ఈపీఎఫ్వో సిస్టమ్లో ఎంటర్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మనం డబ్బులను విత్డ్ డ్రా చేసుకోవచ్చు. గతంలో ఈ విధంగా ఎగ్జిట్ తేదీని ఎంటర్ చేయడానికి కంపెనీ పై ఆధారపడాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఈ ఎగ్జిట్ నెంబర్ ను మనమే ఎంటర్ చేసుకోవచ్చు.
మనం జాబ్ మానేసిన రెండు నెలల తర్వాత మాత్రమే ఈ ఎగ్జిట్ నెంబర్ ను ఈపీఎఫ్వో సిస్టమ్లో ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఈపీఎఫ్వో వెబ్ సైట్ కు వెళ్ళి లాగిన్ అయి, మేనేజ్ ఆప్షన్ లోకి వెళ్ళాలి. అక్కడ మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని పై క్లిక్ చేసి డేట్ అఫ్ ఎగ్జిట్ కొడితే మనకు ఓటిపి వస్తుంది. ఓటిపిని ఎంటర్ చేస్తే మన పీఎఫ్ అకౌంట్ కొత్త కంపెనీ కి ట్రాన్స్ఫర్ అవుతుంది.
రోజులు మారుతున్నాయి. ప్రస్తుత కాలంలో మనిషికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అత్యవసర సమయల్లో ఇన్సూరెన్స్ ఉంటే మాత్రమే ఆర్థిక ఇబ్బందుల బారిన పడకుండా ఉంటాం. ప్రతి నెలా ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంతో పోల్చి చూస్తే ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలలో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే కొన్నింటి ద్వారా ఉచితంగా ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ లభిస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లో భాగంగా ఈ ఇన్సూరెన్స్ ను పొందవచ్చు. వీటితో పాటు బ్యాంకు ఖాతాలు ఉన్నవాళ్లకు కూడా ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకు ఖాతాగా కలిగి ఉండి క్రెడిట్ లేడా డెబిట్ కార్డ్ ఉండే ఇన్సూరెన్స్ ను పొందవచ్చు.
క్రెడిట్ కార్డు కంపెనీలు రెగ్యులర్ గా క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించే కస్టమర్లకు 50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ను అందిస్తాయి. అయితే బ్యాంకును బ్యాంకును బట్టి నియమనిబంధనల్లో మార్పులు ఉంటాయి. బ్యాంక్ డెబిట్ కార్డుల ద్వారా కూడా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే వినియోగించే డెబిట్ కార్డును బట్టి ఇన్సూరెన్స్ లో మార్పులు ఉంటాయని సమాచారం.
అయితే ఈ ఇన్సూరెన్స్ ల గురించి తెలుసుకోవాలంటే బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ కొన్ని రీఛార్జ్ ప్లాన్లపై ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తోంది. అయితే రీఛార్జ్ చేసుకున్న సమయంలో మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈపీఎఫ్వో సైతం ఖాతాదారులకు ఫ్రీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుండగా ఈ ఇన్సూరెన్స్ లపై అవగాహన ఉంటే వీటి ద్వారా ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంటుంది.
Top Telugu website in the world | Telugu Gossips | Breaking News Headlines, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net