రోజులు మారుతున్నాయి. ప్రస్తుత కాలంలో మనిషికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అత్యవసర సమయల్లో ఇన్సూరెన్స్ ఉంటే మాత్రమే ఆర్థిక ఇబ్బందుల బారిన పడకుండా ఉంటాం. ప్రతి నెలా ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంతో పోల్చి చూస్తే ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలలో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే కొన్నింటి ద్వారా ఉచితంగా ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ లభిస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లో భాగంగా ఈ ఇన్సూరెన్స్ ను పొందవచ్చు. వీటితో పాటు బ్యాంకు ఖాతాలు ఉన్నవాళ్లకు కూడా ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకు ఖాతాగా కలిగి ఉండి క్రెడిట్ లేడా డెబిట్ కార్డ్ ఉండే ఇన్సూరెన్స్ ను పొందవచ్చు.
క్రెడిట్ కార్డు కంపెనీలు రెగ్యులర్ గా క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించే కస్టమర్లకు 50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ను అందిస్తాయి. అయితే బ్యాంకును బ్యాంకును బట్టి నియమనిబంధనల్లో మార్పులు ఉంటాయి. బ్యాంక్ డెబిట్ కార్డుల ద్వారా కూడా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే వినియోగించే డెబిట్ కార్డును బట్టి ఇన్సూరెన్స్ లో మార్పులు ఉంటాయని సమాచారం.
అయితే ఈ ఇన్సూరెన్స్ ల గురించి తెలుసుకోవాలంటే బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ కొన్ని రీఛార్జ్ ప్లాన్లపై ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తోంది. అయితే రీఛార్జ్ చేసుకున్న సమయంలో మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈపీఎఫ్వో సైతం ఖాతాదారులకు ఫ్రీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుండగా ఈ ఇన్సూరెన్స్ లపై అవగాహన ఉంటే వీటి ద్వారా ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…