Categories: Uncategorized

పసిడి ప్రియులకు శుభవార్త.. ప్రభుత్వ నిర్ణయంతో వారికి చుక్కలే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగారాన్ని అమితంగా ఇష్టపడే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గోల్డ్ హాల్‌మార్కింగ్ నిబంధనలను కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. 2021 సంవత్సరం జూన్ నెల 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. కేంద్రం ఈ ఏడాదే ఈ నిబంధనలను అమలు చేయాలని ప్రయత్నించినా కొన్ని కారణాల వల్ల నిర్ణయం అమలులోకి రాలేదు.

జువెలరీ సంస్థలు బంగారం కొనుగోలు చేసేవాళ్లను మోసం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త కన్సూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ను కేంద్రం అమలులోకి తీసుకొస్తోంది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే కొనుగోలుదారులు మోసపోయే అవకాశాలు ఉండవు. జువెలర్లు కొనుగోలుదారులను మోసం చేస్తే కఠిన శిక్షలు అమలులోకి వస్తాయి. 22 క్యారెట్ల బంగారానికి బదులుగా 18 క్యారెట్లు అమ్మితే కఠిన శిక్షలు అమలవుతాయి.

కేంద్రం ఖచ్చితంగా వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలను అమలులోకి తెస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు బంగారం కొనుగోలు సమయంలో కొనుగోలుదారులు మోసపోయినా ఇకపై మోసపోవడానికి అవకాశం ఉండదు. జైలుశిక్ష పడే అవకాశం ఉండటంతో జువెలరీ సంస్థలు సైతం మంచి ఉత్పత్తులను విక్రయించడానికే ఆసక్తి చూపుతాయి.

జువెలరీ సంస్థలు బీఐఎస్ కింద రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే బంగారం అమ్మడానికి అర్హులవుతారు. ప్రస్తుతం గోల్డ్ హాల్ మార్కింగ్ ను బీఐఎస్ మాత్రమే వేస్తోంది. హాల్ మార్కింగ్ ఉన్న నగలను విక్రయించిన సమయంలో కూడా మంచి రేటుకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. అందువల్ల అలాంటి వాటిని తీసుకోవడం మంచిది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago