Categories: Uncategorized

పసిడి ప్రియులకు శుభవార్త.. ప్రభుత్వ నిర్ణయంతో వారికి చుక్కలే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగారాన్ని అమితంగా ఇష్టపడే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గోల్డ్ హాల్‌మార్కింగ్ నిబంధనలను కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. 2021 సంవత్సరం జూన్ నెల 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. కేంద్రం ఈ ఏడాదే ఈ నిబంధనలను అమలు చేయాలని ప్రయత్నించినా కొన్ని కారణాల వల్ల నిర్ణయం అమలులోకి రాలేదు.

జువెలరీ సంస్థలు బంగారం కొనుగోలు చేసేవాళ్లను మోసం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త కన్సూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ను కేంద్రం అమలులోకి తీసుకొస్తోంది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే కొనుగోలుదారులు మోసపోయే అవకాశాలు ఉండవు. జువెలర్లు కొనుగోలుదారులను మోసం చేస్తే కఠిన శిక్షలు అమలులోకి వస్తాయి. 22 క్యారెట్ల బంగారానికి బదులుగా 18 క్యారెట్లు అమ్మితే కఠిన శిక్షలు అమలవుతాయి.

కేంద్రం ఖచ్చితంగా వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలను అమలులోకి తెస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు బంగారం కొనుగోలు సమయంలో కొనుగోలుదారులు మోసపోయినా ఇకపై మోసపోవడానికి అవకాశం ఉండదు. జైలుశిక్ష పడే అవకాశం ఉండటంతో జువెలరీ సంస్థలు సైతం మంచి ఉత్పత్తులను విక్రయించడానికే ఆసక్తి చూపుతాయి.

జువెలరీ సంస్థలు బీఐఎస్ కింద రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే బంగారం అమ్మడానికి అర్హులవుతారు. ప్రస్తుతం గోల్డ్ హాల్ మార్కింగ్ ను బీఐఎస్ మాత్రమే వేస్తోంది. హాల్ మార్కింగ్ ఉన్న నగలను విక్రయించిన సమయంలో కూడా మంచి రేటుకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. అందువల్ల అలాంటి వాటిని తీసుకోవడం మంచిది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

8 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

8 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

10 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

10 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

12 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

12 hours ago