Tag Archives: gautam raju

వయసు పెరిగినా తీరు మారలేదంటూ.. సుమ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి !

బుల్లితెరపై అన్ని చానల్లో తనదైన రీతిలో వివిధ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతున్న యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అందరు టక్కున సుమ పేరు చెబుతారు.గత రెండు దశాబ్దాల కాలం నుంచి టెలివిజన్ రంగంలో దూసుకుపోతున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుమ ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాంకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.సుమ వ్యవహరించే అన్ని కార్యక్రమాలలో కెల్లా అత్యధిక రేటింగ్స్ లో దూసుకుపోతున్న కార్యక్రమం క్యాష్ ఒకటి అని చెప్పవచ్చు.

తాజాగా ఈ వారం ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ వారం ఈ కార్యక్రమానికి సీనియర్ సెలబ్రిటీలు బాబు మోహన్, గౌతమ్ రాజు, రాజ్యలక్ష్మి, శివ పార్వతిలతో కలిసి సుమ క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చారు. ఏ కార్యక్రమంలోనైనా సుమ వచ్చే గెస్ట్ ల పై పంచులు వేయడం సాధారణమే. కానీ ఈ మధ్యకాలంలో కార్యక్రమానికి వచ్చిన గెస్ట్ లు సైతం సుమ పై పంచులు వేయడంతో కార్యక్రమం ఎంతో సరదాగా సాగిపోతోంది.

ఇక ఈ వారం ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చిన గెస్ట్ లు యాంకరమ్మకు సరైన రీతిలో పంచులు వేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా సినీనటి రాజ్యలక్ష్మి సుమ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.ఈ క్రమంలోనే రాజ్యలక్ష్మి షోకి అదిరిపోయే స్టెప్పులతో ఎంట్రీ ఇచ్చారు.

సుమ ఈరోజు నాకు కాంపిటీషన్ గా మీరు తయారయ్యి వచ్చారు అంది. దీంతో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ… నిన్ను చూస్తే నాకు చాలా అసూయగా ఉంది… మేము మా చిన్నప్పుడు ఇలా లంగావోణీలు వేసాము.. కానీ నువ్వు ఇంకా అవే వేస్తున్నావు అంటూ ఆమె గురించి కామెంట్ చేశారు. ఆ తర్వాత సుమ మాట్లాడుతూ ఈ మాటకు అర్థం ఏంటి? నాకు వయసు పెరిగినా ఇంకా ఇలాగే లంగా వోణీలు వేసుకుంటున్నాను అనుకుంటున్నారా.. అని ప్రశ్నించడంతో అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

మరో వివాదంలో చిక్కుకున్న కమెడియన్ పృథ్వీరాజ్… ఆ నటుడిని అలా అన్నందుకే!

బుల్లితెరపై ఈటీవీలో ప్రసారమయ్యే “శ్రీదేవి డ్రామా కంపెనీ” కార్యక్రమంలో కమెడియన్లు చేసే స్కిట్ లు తీవ్ర వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇదివరకే హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని తప్పుబడుతూ చేసిన స్కిట్ ఏకంగా పోలీస్ కేసు దాకా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఈ క్రమంలోని శ్రీమంతుడు కాన్సెప్ట్ ద్వారా ఈ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు.

ఈ క్రమంలోనే జూలై 11 న ప్రసారమైన ఈ కార్యక్రమంలో కమెడియన్ పృథ్వి రాజ్ మరొక కమెడియన్ గౌతమ్ రాజు పేరును ప్రస్తావించడంతో ఇది కాస్త వివాదానికి దారి తీసింది. ఈ స్కిట్ లో భాగంగా కమెడియన్ నూకరాజు పృథ్వీరాజ్ తో మాట్లాడుతూ… సార్ మేము ఇప్పుడైతే పేదోళ్లం కానీ ఒకప్పుడు రాజులం సార్’.. అని అంటారు. రాజులా.. అదేంటి? అని పృథ్వీ అడగ్గా.. ‘నేను నూకరాజు.. మా తమ్ముడు లోక రాజు.. మా నాన్న పోతురాజు అని నూకరాజు చెప్పగానే అందుకు పృధ్విరాజ్… ఆ ఇది చెప్పుకుని ఆ గౌతమ్ రాజు గాడు కూడా బతికేస్తున్నాడు. అని పంచు డైలాగ్ వేశాడు.

ఈ విధంగా పృద్వి రాజ్ గౌతమ్ రాజు పై పంచులు వేయడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది. పృథ్వీరాజ్ గౌతమ్ రాజును ఉద్దేశించే ఈ డైలాగ్ వేశారని ఈ విషయం కాస్తా హాట్ టాపిక్ గా మారడంతో తను ఆ గౌతమ్ రాజును దృష్టిలో ఉంచుకొని ఈ మాట అనలేదని, పొరపాటుగా జరిగిపోయిందని నటుడు పృథ్వీరాజ్ ఒప్పుకున్నారు.

ఈ స్క్రిప్ట్ లో భాగంగా కావాలని నేను గౌతమ్ రాజు పేరు వాడుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ఏదో సందర్భానుసారంగా నా ప్రమేయం లేకుండా జరిగిపోయిందని, ఏది ఏమైనా పొరపాటు జరిగింది ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అంటూ పృధ్వీరాజ్ ఒక వీడియోలో సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.