Tag Archives: Guntur karam

Sitara: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సితార.. అనాధ పిల్లల కోసం స్పెషల్ స్క్రీనింగ్?

Sitara: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇంత చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది సితార. ఈ ముద్దుగుమ్మకు ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇంత చిన్న వయసులోనే తండ్రి అడుగుజాడల్లో ఎంతోమందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకుంటోంది. సితార గొప్ప మనసుకు నిదర్శనంగా గతంలో చాలానే జరిగిన విషయం తెలిసిందే.

పేద పిల్లలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం తన పుట్టినరోజు వేడుకలను అనాధ పిల్లలతో కలిసి జరుపుకోవడంతో పాటు వారికి బహుమతులను కూడా ఇవ్వడం ఇలా ఎన్నెన్నో మంచి మంచి పనులు చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది సితార. కాగా ఎప్పటికప్పుడు ఘట్టమనేని అభిమానులు కూడా సితార చేసే మంచి పనుల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలే ఆమె ఒక లగ్జరీ జువెలరీ యాడ్ లో నటించగా దాదాపు కోటి రూపాయల రెమ్యూనరేషన్ రావడంతో ఆ డబ్బును కూడా చేసేసి అందరి చేత గ్రేట్ అంటూ మన్నలను కూడా పొందింది.

అనాధ పిల్లల కోసం స్పెషల్ స్క్రీనింగ్..

ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి తన గొప్ప మనసును చాటుకుంది సితార. మరి ఇంతకీ ఆమె ఏం చేసింది అన్న విషయానికొస్తే.. తాజాగా సితార అనాథ పిల్లలకు గుంటూరు కారం స్పెషల్ స్క్రీనింగ్ వేయించి మంచి మనసు చాటుకుంది. చిన్న వయస్సులోనే ఇంత గొప్పగా ఆలోచించే గుణం సితారకే సొంతమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో మహేష్ బాబు ఫౌండేషన్. చీర్స్ ఫౌండేషన్ తరపున స్పెషల్ షో ఏర్పాటు చేయించారని తెలుస్తోంది. భవిష్యత్తులో సితార మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంత చిన్న వయసుకి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అందరి చేత శభాష్ అనిపించుకున్న సితార ఇంకా మంచి మంచి పొజిషన్లకు వెళ్లాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Sitara Ghattamaneni : గుంటూరు కారం పాటకి స్టెప్పులు ఇరగదీసిన సితార.. వీడియో వైరల్?

Sitara Ghattamaneni: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు కూతురుగా సితార మనందరికీ సుపరిచితమే. చిన్న వయసులోనే భారీగా అభిమానులను సొంతం చేసుకుంది. అప్పుడప్పుడు మంచి మంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటూ ఉంటుంది సితార. సేవాగుణంలో మాత్రం తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది.

అలాగే అప్పుడప్పుడు డాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది సితార. కాగా ఇటీవలె సితార ఒక జూలరీ బ్రాండ్ ఇది ఇలా ఉంటే తాజాగా మరో డాన్స్ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సితార. తన తండ్రి మహేష్ బాబు తాజాగా నటించిన గుంటూరు కారం సినిమా ఇటీవల విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని తెచ్చుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ లీలా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

స్టెప్పులతో అదరహో అనిపించిన సితార..

అయితే ఈ సినిమాలోని ట్రిప్పింగ్..ట్రిప్పింగ్ అనే పాటకు స్టెప్పులు ఇరగదీసింది సితార. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ మై బేబీ అంటూ ఎంతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ ను ఇరగదీసింది. ఆ వీడియోని చూసిన మహేష్ అభిమానులు డాన్స్ అదిరిపోయింది, సూపర్ సితార, డాన్స్ కేక అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

https://www.instagram.com/reel/C2UoXfrqi0c/?utm_source=ig_web_copy_link

Trivikram Srinivas: ఆ విషయం పట్టుతప్పుతున్న త్రివిక్రమ్.. వాళ్లని సరిగా వాడుకోలేకపోతున్నాడా?

Trivikram Srinivas: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్ లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలతో అభిమానులను వరుసగా డిసప్పాయింట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన గుంటూరు కారం సినిమాతో కూడా మరోసారి డిసప్పాయింట్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఈ మూవీను చూసిన ప్రతి ఒక్కరూ త్రివిక్రమ్ చాలా డిసప్పాయింట్ చేశాడని ఒక విషయంలో గురూజీ పట్టు తప్పుతున్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా తీశాడంటే అందులో ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్స్ అందరూ ఉంటారు. చెప్పాలంటే చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులని తీసుకుని వాళ్లని సరిగా ఉపయోగించుకుంటాడు అనే పేరు ఉంది.

కానీ గత రెండు మూడు సినిమాల నుంచి ఈ విషయంలో ఆయన కష్టపట్టుతప్పుతున్నాడు. అంతేకాకుండా సెకండ్ హీరోయిన్ లను కూడా సరిగా వాడుకోలేకపోతున్నాడు అన్న సందేహాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. గుంటూరు కారం సినిమాలో రాజీ అనే మర్దరి పాత్ర కోసం మీనాక్షి చౌదరి తీసుకున్న విషయం తెలిసిందే. అక్క ఈ సినిమాలో మీనాక్షి ముచ్చటగా మూడంటే మూడు సీన్లు చేయించాడు గురూజీ. ఇంత బ్యూటీఫుల్ హీరోయిన్ మూవీలో ఉన్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.

ఫ్యాన్స్ ని ఫుల్ గా డిసప్పాయింట్ చేసిన గురూజీ..

ఆమె ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. ఇలా సెకండ్ హీరోయిన్ విషయంలో కూడా ఆయన దారుణంగా డిసప్పాయింట్ చేశారు. ఈ సినిమా విషయంలోనే కాకుండా త్రివిక్రమ్ గత రెండు సినిమాల విషయంలో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయింది. అరవింద సమేత మూవీలో ఈషా రెబ్బాని తీసుకున్నారు. హీరోయిన్ అక్క క్యారెక్టర్ ఇచ్చారు. కానీ నో యూజ్. ఇక అల వైకుంఠపురములో చిత్రంలోనూ నివేదా పేతురాజ్‌ని సెకండ్ హీరోయిన్‌గా చేసింది. కానీ ఏం లాభం ఒకటి రెండు డైలాగ్స్ తప్పితే ఉపయోగం లేకుండా పోయింది. త్రివిక్రమ్ మూవీలో చేశాం అనే ఆనందం తప్పితే ఈ ముగ్గురు బ్యూటీస్‌కి గుర్తింపు అయితే ఏం రాలేదు. మరి తదుపరి సినిమాల విషయంలో అయినా ఈ విషయాలు గుర్తుంచుకుంటే మంచిది అంటూ పలువురు అభిమానులు ఆయనకు సలహాలు ఇస్తున్నారు.

MaheshBabu: మరోసారి వెకేషన్ కు సిద్ధమైన మహేష్… ఇలాగైతే గుంటూరు కారం అయినట్లే?

MaheshBabu:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా గత ఏడాది ప్రారంభమైనప్పటికీ ఇంకా షూటింగ్ పనులను 50 శాతం కూడా పూర్తి చేసుకోలేదు కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా సరికొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో మహేష్ బాబు పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. తాజ సమాచారం ప్రకారం మహేష్ బాబు మరోసారి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్ళబోతున్నారని తెలుస్తోంది.మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి తరచూ వెకేషన్ ప్లాన్ చేస్తూ ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆగస్టు మొదటి వారం ఈయన వెకేషన్ కోసం ఇతర దేశాలకు వెళ్ళబోతున్నారని తిరిగి రెండవ వారం పూర్తి అయిన తర్వాత ఇండియాకి చేరుకొనున్నారని తెలుస్తుంది. వెకేషన్ పూర్తి అయిన తర్వాతనే మహేష్ బాబు తిరిగి గుంటూరు కారం సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇలా మహేష్ తరచూ వెకేషన్ కి వెళ్తే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లేనని పలువురు భావిస్తున్నారు.

MaheshBabu: పుట్టినరోజు సందర్భంగా వెకేషన్ కి మహేష్ బాబు


మహేష్ బాబు ఆగస్టు 9వ తేదీ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తున్నారని తెలుస్తోంది. అయితే ఈయన లేకపోయినా గుంటూరు సినిమా షూటింగ్ ఏ మాత్రం ఆగిపోదని ఈయనతో సంబంధం లేనటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా ఈ సమయంలో చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది.అయితే మహేష్ బాబు ఈ వెకేషన్ కి వెళ్తే ఈ పుట్టినరోజుకు ఆయన అభిమానులకు అందుబాటులో ఉండరని సమాచారం.

Pooja Hedge: మహేష్ బాబు సినిమా నుంచి పూజా తప్పుకోవడానికి అదే కారణమా… లక్కీ ఛాన్స్ కొట్టేసిన నటి?

Pooja Hedge: మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో దాదాపు 11 సంవత్సరాలు తర్వాత మరో సినిమా రానున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. దీంతో సినిమా మరో లెవెల్ లో ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ సినిమా షూటింగ్ మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. ఈ సినిమా షూటింగ్ తరచూ వాయిదా పడుతూ ఉండటం వల్ల ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించిన ఇలా వరుస వాయిదాలతో ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

ఇకపోతే ఈ సినిమా నుంచి నటి పూజా హెగ్డే తప్పకున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈ విషయం పై పూజా హెగ్డే టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా షూటింగ్ తరచూ వాయిదా పడటం వల్ల పూజా హెగ్డే కమిట్ అయిన ఇతర సినిమాలకు డేట్స్ ఏ మాత్రం అడ్జస్ట్ కావడంలేదని అందుకే తాను ఈ సినిమా షూటింగ్ నుంచి తప్పుకుంటున్నారని ప్రకటించారు.

Pooja Hedge: మెయిన్ హీరోయిన్ గా శ్రీ లీల…


ఈ విధంగా గుంటూరు కారం సినిమా నుంచి మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నటువంటి పూజా హెగ్డే తప్పుకోవడంతో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నటువంటి శ్రీలీలా లక్కీ ఛాన్స్ కొట్టేసారని ఈమెను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్ వీడియో విడుదల చేయగా ఈ వీడియో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేసింది.