Tag Archives: harassment

Aishwarya Bhaskaran: ఫోన్ నెంబర్ ఇస్తే ప్రైవేట్ పార్ట్ ఫోటోలు పెట్టి విసిగిస్తున్నారు… ఆవేదన చెందిన నటి!

Aishwarya Bhaskaran: ఈ సమాజంలో ఆడవారిపై పెద్ద ఎత్తున వేధింపులు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఆడవారి సంరక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చిన మహిళల పట్ల పురుషుల వేధింపులు ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది. ఇందుకు సెలబ్రెటీలు కూడా అతీతులు కాదు.ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఎంతోమంది నటీమణులు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఇదివరకే ఎంతోమంది తెలియచేశారు.

తాజాగా నటి ఐశ్వర్య భాస్కరన్ సైతం తాను పెద్ద ఎత్తున లైంగిక వేధింపులకు గురయ్యానని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నటి లక్ష్మి కుమార్తెగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య భాస్కరన్ అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, నాని, కళ్యాణ వైభోగం, ఓ బేబీ వంటి చిత్రాల్లో నటించితెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో ఈమె లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తనకు సినిమా అవకాశాలు రాకపోవడంతో తాను సోప్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టానని తెలిపారు. అయితే ఆర్డర్ల కోసం తాను తన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వడంతో ఎంతోమంది ఇదే అదునుగా భావించి తనకు అసభ్యకరమైన మెసేజ్ లు చేస్తున్నారని తెలిపారు.

Aishwarya Bhaskaran: మానసికంగా ఒత్తిడికి గురిచేసాయి…

ఇక కొందరైతే పురుషుల ప్రవేట్ పార్ట్ ఫోటోలు తనకు పంపిస్తున్నారని,ఇవన్నీ తనని మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. అయితే ప్రస్తుతం తాను ఈ విషయం గురించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదు, ఇకపై ఈ వేధింపులు కనుక మానుకోకపోతే తప్పనిసరిగా తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె షేర్ చేస్తున్నటువంటి వీడియో వైరల్ అవుతుంది.

Produce Harassment: నిర్మాత అని పెళ్లి చేసుకున్నా.. తీరా చూస్తే వ్యభిచారం చేయమంటున్నాడు. నిర్మాతపై నటి వ్యాఖ్యలు

Produce Harassment: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు మాయమాటలకు మోసపోయి జీవితాలను నాశనం చేసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామంది క్యాస్టింగ్ కౌచ్ లకు గురికాగా మరికొంతమంది అవకాశాల కోసం నిర్మాతలతో కమిట్మెంట్ లకు ఒప్పుకుంటారు.

Produce Harassment: నిర్మాత అని అతనిని పెళ్లి చేసుకున్న నటి… చివరికి తనతోనే అలాంటి పనులు చేయిస్తున్న నిర్మాత?

సినీ ఇండస్ట్రీలో నిర్మాత అని నటిని పరిచయం చేసుకుని తనని పెళ్లి చేసుకొని చివరికి తనతోనే వ్యభిచారం చేయమంటూ తనని బలవంతం చేస్తున్నారని సహాయ నటి పరమేశ్వరి అలియాస్‌ భైరవి శుక్రవారం చెన్నైలో డీజీపీకి ఆఫీస్ లో ఫిర్యాదు చేసింది.

Produce Harassment: నిర్మాత అని అతనిని పెళ్లి చేసుకున్న నటి… చివరికి తనతోనే అలాంటి పనులు చేయిస్తున్న నిర్మాత?

భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా బతుకుతున్న తనకు వేలూరుకు చెందిన రాజా దేసింగ్‌ అలియాస్‌ సుబ్రమణి నిర్మాతగా పరిచయం చేసుకుని, తనని కూడా నిర్మాతలు చేస్తానంటూ కల్లబొల్లి మాటలు చెప్పి తనను పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత తనని వ్యభిచారి గా మార్చే ప్రయత్నం చేశారని, తనపై ఇలాంటి ఒత్తిడి అధికంగా తీసుకువస్తున్నారని ఈమె ఫిర్యాదులో పేర్కొంది.

కఠినంగా శిక్షించాలి..

తాను చెప్పే విధంగా నడుచుకోకపోతే తనని చంపేస్తానని బెదిరిస్తున్నట్లు నటి పరమేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇక తన పిల్లల చేత కూడా బలవంతంగా ఇలాంటి వ్యభిచారం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఈమె తన బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజా దేసింగ్ పలువురు అమ్మాయిలను మోసం చేయడమే కాకుండా ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడి పోక్సో చట్టం కింద అరెస్టు కూడా అయ్యాడనీ ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని తనకు అతని నుంచి రక్షణ కల్పించాలని నటి పరమేశ్వరి ఈ ఫిర్యాదులో పేర్కొంది.

వీడెవడండి బాబూ.. భార్య ముక్కు కొరికి పారిపోయాడు.. ఎందుకో తెలుసా.

దేశంలో ఎటు చూసినా హత్యలు, అత్యాచారాలే కనపడున్నాయి. అన్యోన్యంగా ఉండాల్సిన దంపతులు మధ్య కూడా వివాహేతర సంబంధాల వల్ల వాళ్లను నమ్ముకున్న వారు రోడ్డున పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా ఓ ఘటన వింటే.. వేడెవడండి బాబు అంటూ ముక్కున వేలేసుకుంటారు. భార్య కాపురానికి రావడం లేదని కోపంతో భార్య ముక్కు కొరికాడు.

ఈ మధ్య మరో ఘటనలో భార్య స్నానం చేయలేదని విడాకులు అడిగాడట. ఇటువంటి చిన్న చిన్న కారణాలతో నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రత్లాం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ రత్లాం జిల్లాలో ఓ గ్రామంలో దినేశ్, టీనాలకు 2008లో వివాహం అయింది.

అప్పటి నుంచి వారు ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఉన్నారు. వాళ్లకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని రోజుల నుంచి అతడు మద్యానికి అలవాటు పడ్డాడు. అప్పటి నుంచి అతడు భార్యను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. ఇలా వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక ఆమె తన పుట్టింటికి వెల్లిపోయింది. అక్కడ వంట పని చేసుకుంటూ ఉండగా.. 2019లో ఆమె తన భర్త నుంచి మెయింటెన్స్ కోరుతూ కోర్టులో కేసు దాఖలు చేసిది.

దినేశ్ ఇటీవల భార్య తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి భార్యాబిడ్డల నిర్వహణ విషయంపై చర్చించగా, భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో, దినేశ్ తన కుమార్తెల ముందే.. టీనాపై దాడి చేసి ఆమె ముక్కును కొరికేసి అక్కడ నుంచి పారిపోయాడు. టీనాకు తీవ్ర రక్త స్రావం కావడంతో ఇరుగుపొరుగు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

చెల్లెలి పై ఉన్న ప్రేమతో.. ఆమెకి తాళిని దూరం చేసిన అన్న?

ఆపదలు చెల్లెకు అండగా ఉంటానని మాట ఇచ్చిన అన్న చెల్లెలు క్షేమం కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన చెల్లెలు క్షేమంగా ఉండాలని ఏకంగా ఆమెకు తన పసుపు కుంకుమలను దూరం చేశాడు. చెల్లెళ్లను తన భర్త హింసిస్తున్నాడు అని తెలుసుకొన్న అన్న ఆవేశంతో ఏకంగా తన భావను హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

నెల్లూరులోని నవాబుపేట ఏరియాకి చెందిన సునీల్‌కి శైలజతో సుమారు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు వీరి కాపురం సజావుగా సాగిన తరువాత సునీల్ తరచూ మద్యం తాగి వచ్చి తన భార్యతో తరచు గొడవ పడేవాడు. కొన్నిసార్లు సునీల్ మితి మీరి ప్రవర్తించి శైలజ పై దాడి చేసే వాడు. ఈ క్రమంలోని శైలజ అన్న ఎలాగైనా తన బావకు బుద్ధి చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలోనే పోలీసులు సునీల్ ను పిలిపించి అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.తర్వాత కొద్ది రోజులు మంచిగా ఉన్న సునీల్ ఆ తర్వాత యధావిధిగా తాగి వచ్చి తన భార్యను చితకబాది వాడు.ఈ విధంగా తన చెల్లెళ్లను రోజు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండడంతో శైలజా అన్న రాజు ఇక తన బావ నుంచి తన చెల్లెలుకు విముక్తి కల్పించాలని భావించాడు. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి తన భావ సునీల్ ను అతి కిరాతకంగా చంపివేశాడు. అయితే ఈ హత్య కేసులో నిందితుడు సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.