Tag Archives: indian cricketer

Tilak Varma: ఐపీఎల్ లో వచ్చిన డబ్బులతో తిలక్ వర్మ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?

Tilak Varma: ఐపీఎల్ 2022 ముంబై ఇండియన్స్ ప్రదర్శించిన ఆట తీరు అందరికీ తెలిసిందే. ఈ ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆటతీరుతో ఎంతోమంది క్రికెట్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు. ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కేవలం 4 విజయాలు అందుకోగా 10 ఓటమి చవిచూసింది. ఆట తీరులో ముంబై ఇండియన్స్ విఫలమైన ఇందులో ఒకరిద్దరు ఆటతీరు ప్రేక్షకులకు కాస్త ఉత్సాహ పరిచిందని చెప్పాలి. అలాంటి వారిలో తిలక్ విక్రమ్ ఒకరు.

Tilak Varma: ఐపీఎల్ లో వచ్చిన డబ్బులతో తిలక్ వర్మ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?

తిలక్ విక్రమ్ 2022 ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వేలంలో ఇతనిని ఏకంగా రూ.1.70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.ముంబై ఇండియన్ టీం లో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నప్పటికీ వారి కన్నా ఎంతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. తిలక్ ఏకంగా 14 మ్యాచ్లలో 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.

Tilak Varma: ఐపీఎల్ లో వచ్చిన డబ్బులతో తిలక్ వర్మ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?

ఈ విధంగా కష్టాల్లో ఉన్న జట్టును ముందుండి నడిపించిన తిలక్ వర్మ ఐపీఎల్ లో భాగంగా వచ్చిన డబ్బులతో అతను చేసిన పని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.తాను ఐపీఎల్లో గెలుచుకున్న డబ్బులు మొత్తం తన తండ్రికి ఇచ్చానని ఈ సందర్భంగా తిలక్ వెల్లడించారు. అండర్ 16 క్రికెట్ఆడుతున్న సమయంలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని ఉదయం 6 గంటలకు గ్రౌండ్లోకి వెళితే సాయంత్రం ఎప్పుడు ఇంటికి వెళ్ళేవారని తెలిపారు.

క్రికెట్ కోసం తన జీవితంలో ఎన్నో ముఖ్యమైన వాటిని కూడా వదులుకున్నానని, క్రికెట్ ప్రాణంగా భావించి ప్రతి రోజూ గ్రౌండ్ కు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాణ్ణి తెలిపారు. ఈ కష్టమే నేడు అతనికి మంచి ప్రతిఫలాన్ని అందించింది. ఇకపోతే ప్రతి ఒక్క మనిషి డబ్బుకు దాసోహం అవ్వడం సర్వసాధారణం.అలాంటి డబ్బుకు తాను దాసోహం కాకూడదని ఐపీఎల్లో గెలుచుకున్న డబ్బులు మొత్తం తన తండ్రి చేతిలో పెట్టి ఆ డబ్బును తనకు దూరంగా ఉంచమని చెప్పారట.

కష్టం విలువ తెలిసిన వ్యక్తి …

ఇలా ఒక ఎలక్ట్రీషియన్ కొడుకుగా తిలక్ క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టి తన కష్టంతో కృషితో ఇంత మంచి క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా చిన్నప్పటినుంచి డబ్బు విలువ తెలిసిన వ్యక్తిగా పెరగడంతో డబ్బును వృధాగా ఖర్చు చేయకుండా పొదుపుగా వాడుకుంటున్నారు.ఇక ఐపీఎల్ లో వచ్చిన డబ్బులు మొత్తం తన తండ్రి చేతిలో పెట్టారని తెలియడంతో ప్రస్తుత కాలంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. కష్టం విలువ తెలిసిన వాడు తిలక్ వర్మ అంటూ పెద్దఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral Kohli : అలా చేయొద్దంటూ రిక్వస్ట్ చేస్తున్న కోహ్లీ… కారణం అదేనా ?

Viral Kohli : టీమిండియా ఆటగాడు విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క దంపతులకు వామికా అనే పాప ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ పాప ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. విరుష్క జంట ఇప్పటి వరకు తమ చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేయలేదు. వామికాను ప్రపంచానికి కనిపించకుండా అత్యంత జాగ్రత్త తీసుకుంటున్నారు కోహ్లీ.

virat koli requesting media and public about vamika images

కాగా దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడో వన్డే సందర్భంగా విరాట్‌ కోహ్లి గారాల పట్టి వామికా కెమెరా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే. కోహ్లి సతీమణి అనుష్క శర్మ చేతుల్లో కేరింతలు కొడుతున్న చిన్నారి స్క్రీన్‌పై కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఎట్టకేలకు వామిక పాపను చూశామంటూ కొందరు సంబరపడిపోగా…. బ్రాడ్‌కా​స్టర్‌ ఇలా చేయడమేమిటని మరికొందరు మండిపడ్డారు.

virat koli requesting media and public about vamika images

విరుష్క కోరినట్లుగా వామిక విషయంలో గోప్యతకు భంగం కలిగించకుండా ఉండాల్సిందని ఇలా చేయడం సరికాదని ట్రోల్‌ చేశారు. ఈ క్రమంలో చాలా మంది ఫొటోలను డిలీట్‌ చేయగా… కొన్ని వార్తా సంస్థలు సైతం తమ ఆర్టికల్స్‌లో వామిక ఫొటో కనబడకుండా జాగ్రత్తపడ్డాయి. ఇక ఈ విషయంపై విరాట్‌ కోహ్లి తాజాగా స్పందించాడు. వామిక ఫొటోలు బయటకు వచ్చిన విషయం తమకు తెలియదని… ఏదేమైనా వాటిని షేర్‌ చేయవద్దని విజ్ఞప్తి చేశాడు.

అలా చేయకపోతే మిమ్మల్ని అభినందిస్తున్నాం అంటూ…

ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ‘‘నిన్న మైదానంలో మా కుమార్తె ఫొటోలు తీసిన విషయం తెలిసింది. నిజానికి కెమెరా ఫోకస్ మా మీద ఉందని తెలియదు. ఒకవేళ వామిక ఫొటోలు షేర్‌ చేయనట్లయితే మీ అందరికీ కృతజ్ఞతలు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం’’ అని అనుష్కతో కలిసి కోహ్లి ప్రకటన విడుదల చేశాడు. కాగా మూడో వన్డేలో కోహ్లి అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా… ఆఖరి వరకు పోరాడిన టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.

విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ – ఆయేషా ముఖర్జీ.. వైరల్ అవుతున్న న్యూస్..

టీం ఇండియా క్రికెటర్.. డాషింగ్ ఒపెనర్ శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడాకులు తీసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకు ఎందుకు ఇలా తెరపైకి వచ్చిందంటూ.. ఆయేషా ముఖర్జీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. ఆ పోస్టులో ఎంతో ఎమోషనల్ తో చేసినట్లు కనిపిస్తోంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే అప్పటికే వివాహం అయిన ఆయేషా ముఖర్జిని 2012 సంవత్సరంలో శిఖర్ ధావన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం అయిన పిల్లలతో ఉన్న ముఖర్జిని పెళ్లి చేసుకున్న ధావన్ .. పెళ్లి సమయంలో కూడా ఆమె కూతుళ్లను బాగా చూసుకుంటానని మాట ఇచ్చి.. ఇంట్లో పెద్ద ఒప్పుకోకపోయిన ఆమెపై ఇష్టంతో ఈ పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2014 సంవత్సరంలో అతడికి ఒక కొడుకు పుట్టాడు. ఇంత బాగా అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితంలో ఒక్క సారిగా విడాకులు టాపిక్ రావడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

రెండోసారి విడాకులు తీసుకునేంతవరకు విడాకులంటే అదేదో చెడ్డ పదంలా భావించేదాన్ని. ఫన్నీ… విడాకులు, వివాహం వంటి పదాలకు ఎంత శక్తివంతమైన అర్థాలు,అనుబంధాలు ఉంటాయో. మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు చాలా భయపడ్డాను. జీవితంలో నేనేదో విఫలమైనట్లు… చేయకూడని తప్పు చేసినట్లు బాధపడ్డాను. నా స్వార్థం కోసం తల్లిదండ్రులు, పిల్లలను ఇబ్బంది పెడుతున్నానని అనుకున్నాను.

అలాంటిది ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాను. ఇది ఊహించుకుంటే భయానకంగా ఉంది. ఇప్పుడు మళ్లీ నన్ను నేను నిరూపించుకోవాలని అయేషా ముఖర్జీ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం డాషింగ్ ఓపెనర్ ‘గబ్బర్’(శిఖర్ ధావన్) ఐపీఎల్ సెకండ్ హాఫ్‌లో ఆడేందుకు యూఏఈ వెళ్లాడు. ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్‌ టీమ్‌తో యూఏఈలో ఉన్నాడు. ప్రస్తుతం తన భార్య ఆయేషా ముఖర్జి పోస్టు చేసిన దీనికి శిఖర్ ధావన్ స్పందించలేదు. కానీ ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.