Tilak Varma: ఐపీఎల్ లో వచ్చిన డబ్బులతో తిలక్ వర్మ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?
Tilak Varma: ఐపీఎల్ 2022 ముంబై ఇండియన్స్ ప్రదర్శించిన ఆట తీరు అందరికీ తెలిసిందే. ఈ ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆటతీరుతో ఎంతోమంది క్రికెట్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు. ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కేవలం 4 విజయాలు అందుకోగా 10 ఓటమి చవిచూసింది. ఆట తీరులో ముంబై ఇండియన్స్ విఫలమైన ఇందులో ఒకరిద్దరు ఆటతీరు ప్రేక్షకులకు కాస్త ఉత్సాహ పరిచిందని చెప్పాలి. అలాంటి వారిలో తిలక్ విక్రమ్ ఒకరు.
తిలక్ విక్రమ్ 2022 ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వేలంలో ఇతనిని ఏకంగా రూ.1.70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.ముంబై ఇండియన్ టీం లో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నప్పటికీ వారి కన్నా ఎంతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. తిలక్ ఏకంగా 14 మ్యాచ్లలో 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఈ విధంగా కష్టాల్లో ఉన్న జట్టును ముందుండి నడిపించిన తిలక్ వర్మ ఐపీఎల్ లో భాగంగా వచ్చిన డబ్బులతో అతను చేసిన పని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.తాను ఐపీఎల్లో గెలుచుకున్న డబ్బులు మొత్తం తన తండ్రికి ఇచ్చానని ఈ సందర్భంగా తిలక్ వెల్లడించారు. అండర్ 16 క్రికెట్ఆడుతున్న సమయంలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని ఉదయం 6 గంటలకు గ్రౌండ్లోకి వెళితే సాయంత్రం ఎప్పుడు ఇంటికి వెళ్ళేవారని తెలిపారు.
క్రికెట్ కోసం తన జీవితంలో ఎన్నో ముఖ్యమైన వాటిని కూడా వదులుకున్నానని, క్రికెట్ ప్రాణంగా భావించి ప్రతి రోజూ గ్రౌండ్ కు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాణ్ణి తెలిపారు. ఈ కష్టమే నేడు అతనికి మంచి ప్రతిఫలాన్ని అందించింది. ఇకపోతే ప్రతి ఒక్క మనిషి డబ్బుకు దాసోహం అవ్వడం సర్వసాధారణం.అలాంటి డబ్బుకు తాను దాసోహం కాకూడదని ఐపీఎల్లో గెలుచుకున్న డబ్బులు మొత్తం తన తండ్రి చేతిలో పెట్టి ఆ డబ్బును తనకు దూరంగా ఉంచమని చెప్పారట.
ఇలా ఒక ఎలక్ట్రీషియన్ కొడుకుగా తిలక్ క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టి తన కష్టంతో కృషితో ఇంత మంచి క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా చిన్నప్పటినుంచి డబ్బు విలువ తెలిసిన వ్యక్తిగా పెరగడంతో డబ్బును వృధాగా ఖర్చు చేయకుండా పొదుపుగా వాడుకుంటున్నారు.ఇక ఐపీఎల్ లో వచ్చిన డబ్బులు మొత్తం తన తండ్రి చేతిలో పెట్టారని తెలియడంతో ప్రస్తుత కాలంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. కష్టం విలువ తెలిసిన వాడు తిలక్ వర్మ అంటూ పెద్దఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…