పంచతంత్ర కథలు చిత్రంలోని సాంగ్ వీడియో రిలీజ్.. మామూలుగా లేదుగా..?
గంగనమోని శేఖర్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న తాజా చిత్రం పంచతంత్ర కథలు. ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ప్రముఖ నిర్మాత మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడు గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఐదు వేర్వేరు కథల ఆంథాలజీ కావడంతో ఈ సినిమాకు పంచతంత్ర కథలు అనే టైటిల్ ను పెట్టారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి మోతెవరి అనే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. లిరికల్ వీడియో సాంగ్ ను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఇక ఈ పాటకు కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించగా సంగీతదర్శకుడు కమ్రాన్ క్యాచీ ట్యూన్ తో స్వరపరిచాడు. కాకపోతే లేటెస్ట్ సెన్సేషన్ రామ్ మిరియాల ఈ పాటను తనదైన శైలిలో ఆలపించారు. తాజాగా విడుదల ఈ పాటకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తుంది.
ఇక ఈ పాటను విడుదల చేసిన తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. పంచతంత్ర కథలు సినిమా లోని నేనేమో మోతెవరి అనేక సాంగ్ రిలీజ్ చేయడం తనకు చాలా సంతోషంగా ఉంది అని తరుణ్ భాస్కర్. అది తనకు ఫేవరెట్ సాంగ్ అని, పంచతంత్ర కథలు సినిమా రఫ్ కట్ చూసినప్పుడే ఆ సాంగ్ విన్నాడట తరుణ్ భాస్కర్. అయితే ఈ సాంగ్ తప్పకుండా వైరల్ అవుతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను అని తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…