Tag Archives: Interest waiver

లోన్ మారటోరియం డబ్బులు ఖాతాలో పడలేదా.. అసలు కారణమిదే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొన్ని రోజుల క్రితం రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. మార్చి నెల నుంచి ఆగస్టు నెల వరకు రుణాలకు వడ్డీ మీద వడ్డీని వసూలు చేయడం లేదని.. వడ్డీ మాఫీ డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్రం వారం రోజుల క్రితమే వడ్డీ మాఫీ డబ్బులను బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. అయితే కొందరు మాత్రం ఆ డబ్బులు ఇంకా ఖాతాలలో జమ కాలేదని చెబుతున్నారు.

కేంద్రం 2 కోట్ల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వాళ్లందరికీ ప్రయోజనం కలిగే విధంగా వడ్డీ మీద వడ్డీ మాఫీ నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ లతో పాటు మరికొన్ని లోన్లు తీసుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే కొందరు మాత్రం తమ ఖాతాలలో లోన్ మారటోరియం డబ్బులు ఇప్పటికీ జమ కాలేదని చెబుతున్నారు. ఇలా డబ్బులు జమ కాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

కేంద్రం కొన్ని నిబంధనల ప్రకారం లోన్ మారటోయానికి అర్హులను ఎంపిక చేస్తోంది. 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల 29 నాటికి లోన్ అకౌంట్ మొండి బకాయిగా మారకపోతే మాత్రమే కేంద్రం ఈ ప్రయోజనాన్ని అందిస్తోంది. వీళ్లు మాత్రమే లోన్ మారటోరియం వడ్డీ మాఫీని పొందడానికి అర్హులవుతారు. లేకపోతే వీళ్లు కేంద్రం అందిస్తున్న వడ్డీ మీద వడ్డీ మాఫీ ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉండవు.

వడ్డీ మాఫీ స్కీమ్ ప్రకారం ఎవరైతే లోన్ మారటోరియం ఎంచుకుంటారో వాళ్లు సాధారణ వడ్డీనే చెల్లించాల్సి ఉంటుంది. లోన్ మారటోరియం ఆప్షన్ ను ఎంచుకున్న వాళ్లకు కేంద్రం వడ్డీ మీద వడ్డీ వేయదు. ఆ ఆప్షన్ ఎంచుకోని పక్షంలో మాత్రమే క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది.

అన్నదాతలకు కేంద్రం షాక్… ఆ బెనిఫిట్ కు అర్హులు కాదంట..!

కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్న కేంద్రం రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. కరోనా విజృంభణ , లాక్ డౌన్ వల్ల దేశంలో రైతులు సైతం భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం రుణ గ్రహీతలకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో మార్చి నెల నుంచి ఆగష్టు నెల వరకు వడ్డీపై వడ్డీ మాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా రుణాలు తీసుకున్న వాళ్లందరికీ ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే..? కేంద్రం కొన్ని రుణాలకు మాత్రమే వడ్డీపై వడ్డీ మాఫీని అమలు చేస్తోంది. పర్సనల్ లోన్, ప్రొఫెషనల్స్ అండ్ కన్షప్షన్ లోన్, హౌసింగ్ లోన్, కన్సూమర్ డ్యూరబుల్ లోన్, ఎంఎస్ఎంఈ రుణాలు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్లకు మాత్రమే కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది.

కొన్ని రకాల రుణాలు తీసుకున్న వాళ్లకు మాత్రం కేంద్రం వడ్డీపై వడ్డీ మాఫీ ప్రయోజనాలను అందించడం లేదు. క్రాప్ లోన్, ట్రాక్టర్ లోన్స్ తో పాటు వ్యవసాయ, వ్యవసాయ సంబంధిత రుణాలకు కేంద్రం వడ్డీపై వడ్డీ మాఫీని అమలు చేయడం లేదు. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా చేసిన కేంద్రం రైతులను మాత్రం విస్మరించడం గమనార్హం.

కేంద్రం వ్యవసాయ రుణాలకు వడ్డీపై వడ్డీ మాఫీ చేయకపోవడం గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2కోట్ల రూపాయల లోపు రుణం తీసుకున్న వారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ఎక్స్‌గ్రేషియా స్కీమ్ డబ్బులు అర్హులకు నేరుగా బ్య్ంక్ ఖాతాలలో జమవుతాయి.