కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొన్ని రోజుల క్రితం రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. మార్చి నెల నుంచి ఆగస్టు నెల వరకు రుణాలకు వడ్డీ మీద వడ్డీని వసూలు చేయడం లేదని.. వడ్డీ మాఫీ డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్రం వారం రోజుల క్రితమే వడ్డీ మాఫీ డబ్బులను బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. అయితే కొందరు మాత్రం ఆ డబ్బులు ఇంకా ఖాతాలలో జమ కాలేదని చెబుతున్నారు.
కేంద్రం 2 కోట్ల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వాళ్లందరికీ ప్రయోజనం కలిగే విధంగా వడ్డీ మీద వడ్డీ మాఫీ నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ లతో పాటు మరికొన్ని లోన్లు తీసుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే కొందరు మాత్రం తమ ఖాతాలలో లోన్ మారటోరియం డబ్బులు ఇప్పటికీ జమ కాలేదని చెబుతున్నారు. ఇలా డబ్బులు జమ కాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
కేంద్రం కొన్ని నిబంధనల ప్రకారం లోన్ మారటోయానికి అర్హులను ఎంపిక చేస్తోంది. 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల 29 నాటికి లోన్ అకౌంట్ మొండి బకాయిగా మారకపోతే మాత్రమే కేంద్రం ఈ ప్రయోజనాన్ని అందిస్తోంది. వీళ్లు మాత్రమే లోన్ మారటోరియం వడ్డీ మాఫీని పొందడానికి అర్హులవుతారు. లేకపోతే వీళ్లు కేంద్రం అందిస్తున్న వడ్డీ మీద వడ్డీ మాఫీ ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉండవు.
వడ్డీ మాఫీ స్కీమ్ ప్రకారం ఎవరైతే లోన్ మారటోరియం ఎంచుకుంటారో వాళ్లు సాధారణ వడ్డీనే చెల్లించాల్సి ఉంటుంది. లోన్ మారటోరియం ఆప్షన్ ను ఎంచుకున్న వాళ్లకు కేంద్రం వడ్డీ మీద వడ్డీ వేయదు. ఆ ఆప్షన్ ఎంచుకోని పక్షంలో మాత్రమే క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…