Tag Archives: jail

Allu Aravind: జీవిత రాజశేఖర్ ను జైలుకు పంపటానికి 12 ఏళ్లు పోరాటం చేశాను… అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!

Allu Aravind: అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా వేడుకలో భాగంగా అల్లు అరవింద్ చిరంజీవి పై తనకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ చిరంజీవి సినిమాలను చూస్తూ మీరు పెరిగితే ఆయన సినిమాలను చేస్తూ నేను తనకు అభిమానిగా మారిపోయానని తెలిపారు.చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానం ఉందో అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అల్లు అరవింద్ తెలిపారు.

చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆయన చూడని సక్సెస్ అంటూ ఏదీ లేదు ఇలా సినిమాలలో నటిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈయన చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాల గురించి కొందరు నీచంగా మాట్లాడారు. ఇలా మాట్లాడిన వారికి శిక్ష పడాలని 12 సంవత్సరాలు పోరాటం చేశానని తెలిపారు.

Allu Aravind: శిక్ష పడే వరకు పోరాటం చేశాను…


ఈ విధంగా చిరంజీవి గారి గురించి నీచంగా మాట్లాడిన వారికి శిక్ష పడాలన్న ఉద్దేశంతో తాను 12 సంవత్సరాలు పోరాటం చేసి వారిని జైలుకు పంపించాను అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈయన చేసిన కామెంట్స్ బట్టి చూస్తే ఈయన జీవిత రాజశేఖర్ గురించి మాట్లాడారని స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా చిరంజీవి సినిమా వేడుకలో భాగంగా అల్లు అరవింద్ తనపై ఉన్న అభిమానాన్ని బయటపెడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

దారుణం: భర్తను చంపి జైలుకెళ్లి లొంగిపోయిన భార్య.. ఎక్కడంటే?

ప్రస్తుత కాలంలో భార్య భర్తల మధ్య ఏ చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా అవి ఎన్నో సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే తొందరపాటు నిర్ణయం వల్ల ఎందరో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుని చివరికి బిడ్డను ఒంటరి పాలు చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా గత కొంత కాలం నుంచి మురళీధర్ రెడ్డి, మౌనిక అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి 11 సంవత్సరాల క్రితం వివాహం జరగగా తొమ్మిది సంవత్సరాల బాబు ఉన్నాడు. గత 11 సంవత్సరాల నుంచి వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు.

అయితే గత కొద్దిరోజుల నుంచి భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయంలోనూ మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఇలా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఆవేశంలో మౌనిక వంటగదిలో కూరగాయలు కట్ చేసే కత్తితో తన భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది.

ఈ క్రమంలోని తన భర్త పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించిన మౌనిక తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం చెప్పి ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని తనని అరెస్ట్ చేశారు.

మళ్లీ జైలుకు వెళ్లిన ఫన్ బకెట్ భార్గవ్..ఎందుకో తెలుసా?

ఫన్ బకెట్ భార్గవ్ టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే టిక్ టాక్ లో వీడియోలు చూస్తూ సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఇతను ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే,అంతేకాకుండా ఆ బాలిక నాలుగు నెలల గర్భవతి కావడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో ఫన్ బకెట్ భార్గవ్ విషయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఎటు చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోయింది.

అలాగే ఈ విషయంపై భార్గవ్ తో సంబంధం ఉన్న కొందరు అతనికి సంబంధించిన కొన్ని విషయాలను మీడియాకు వెల్లడించారు.అయితే ఈ సోషల్ మీడియా ద్వారా అయితే మంచి పాపులారిటీ సంపాదించు కున్నాడో, అదే సోషల్ మీడియా లో అతన్ని ఎంతగానో అభిమానించే తన ఫాలోవర్స్ కూడా అతను చేసిన పనికి దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ, అతనినే ఎన్ని విధాలుగా తిట్టవచ్చో అన్ని విధాలుగా తిట్టారు.

ఫన్ బకెట్ భార్గవ్ ను విశాఖ సిటీ దిశా ఏసీపి ప్రేమ్ కాజల్ ఆదేశాలతో పోలీసులు విచారణ జరిపారు. దిశ,ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి భార్గవ్ హైదరాబాదులో అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. 94 రోజులు డిమాండ్ ఖైదీ గా ఉన్న భార్గవ్ ఇటీవలే బెయిల్ పై వచ్చిన విషయం తెలిసిందే.బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత పలు వీడియోలు చేస్తూ తాను నిర్దోషి అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అంతే కాకుండా ముందులాగే సపోర్ట్ చేయమని చెబుతూ వీడియోలు కూడా చేశాడు.

ఈ నేపథ్యంలోనే నెటిజన్లు అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ఇలా ఉంటే బెయిల్ పై వచ్చిన తర్వాత షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను భార్గవ్ ఉల్లంఘించాడు. దీనితో మరొకసారి భార్గవ్ పై దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ చేశారు. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా భార్గవ్ ప్రకటనలు చేసినట్లు మెమోలో పొందుపరిచారు పోలీసులు. దీనితో ఫోక్సో కోర్టు బెయిల్ రద్దు చేసి ఈ నెల 11 వరకు రిమాండ్ విధించడంతో మరొకసారి జైలు పాలయ్యాడు భార్గవ్.

జర్నలిస్ట్ ను కత్తితో బెదిరించి షారుఖ్ ఖాన్ జైలుకు వెళ్ళాడని మీకు తెలుసా?

ప్రస్తుతం డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ నాలుగు వారాల పాటు జైలులో గడిపి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ మాదిరిగానే గతంలో షారుఖ్ ఖాన్ కూడా జైలుకి వెళ్లి వచ్చారని చాలామందికి తెలియదు.అయితే షారుక్ జైలుకు వెళ్ళడానికి గల కారణం కేవలం ఒక జర్నలిస్టు కత్తితో బెదిరించడం వల్ల జైలుకు వెళ్లానని స్వయంగా షారుక్ ఒక సందర్భంలో వెల్లడించారు.

తెహల్కా డాట్ కామ్ ఆర్గనైజ్ చేసిన ‘థింక్ 2012’ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న షారుక్ ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు.అయితే ఆ జర్నలిస్టు కత్తితో బెదిరించడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… గతంలో షారుక్ ఖాన్ కి ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉందని ఆ జర్నలిస్ట్ రాయడంతో అందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన అతని పై కత్తితో దాడి చేశారని తెలిపారు.

అయితే తనకు గౌరీ ఖాన్ తో పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకు ఆ జర్నలిస్టు ఈ విధంగా రాయడమే కాకుండా తన వ్యక్తిత్వం మంచిది కాదంటూ రాయడంతో షారుక్ ఖాన్ పెళ్లి సమయంలో తన మామ ఇచ్చిన కత్తిని తీసుకొని ఆ కత్తితో జర్నలిస్టును బెదిరించినట్లు తెలిపారు. ఇలా అతనిని బెదిరించినందుకుగాను షారుఖ్ జైలుకు వెళ్లారని తెలిపారు.

అయితే జైలులో ఉన్నప్పుడు తనకు ఎవరికైనా ఫోన్ చేసుకునే అవకాశం లభిస్తే తాను కుటుంబ సభ్యులకు ఫోన్ చేయకుండా ఆ జర్నలిస్టుకి ఫోన్ చేసి బెదిరించారని, బయటకు వచ్చిన తర్వాత నీ అంతు చూస్తా, నిన్ను నరుకుతా అంటూ షారుక్ ఆ జర్నలిస్ట్ ను బెదిరించినట్లు తెలిపారు. ఇలా షారుక్ ఖాన్ గతంలో జైలుకు వెళ్లి వచ్చినట్లు ఆయన తెలిపారు.

సార్.. బయట బతకలేను.. నన్ను జైలుకు తీసుకెళ్లండి.. అంటూ ఓ వ్యక్తి..

ఒక్కో సమయంలో సమాజంలో బతకడం కంటే జైలు జీవితం గడపడం బెటర్ అంటూ కొందరు అంటుంటారు. వాళ్లు ఆ మాట అన్నారంటనే అర్థం అవుతుంది.. ఎంత కష్టం వస్తే వాళ్లు ఆ స్టేజికి వచ్చి అంటారో. ఇలా ఓ వ్యక్తికి కొన్ని సంవత్సరాల క్రితం జైలు శిక్ష పడింది. అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వెళ్లాడు. దాదాపు 30 ఏళ్లు బతికాడు.

తర్వాత ప్రస్తుత పరిస్థితులను భరించలేక మళ్లీ ఆ శిక్షను అమలు చేయాలని వెళ్లి మళ్లీ లొంగిపోయాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని డార్కో డౌగీ డెసిక్ అనే వ్యక్తి గంజాయి పెంచాడన్ననెపంతో పోలీసులు అరెస్టు చేసి.. మూడున్నర ఏళ్ల పాటు ఆయనకు జైలు శిక్ష విధించారు. 1992లో న్యూసౌత్ వేల్స్ లో ఉన్న జైలులో జైలు శిక్ష అనుభవించాడు. అలా 13 నెలలు జైలులో బాగానే గడిపాడు. తర్వాత అతడికి విసుగు పుట్టి ఎలాగైనా అక్కడ నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా.. జైలు గదిలోనే సొరంగం తవ్వుకొని బయటపడ్డాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలించని ప్రదేశం లేదు.

ఎంత వెతికినా అతడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు ఆశలు వదులుకున్నారు. తర్వాత అతడు ఆ రోజు నుంచి.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. కానీ అతడు గత కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులకు గురయ్యాడు. బయట జీవితం కంటే జైలు జీవితమే బెటర్ అని వెళ్లి పోలీసులకు చెప్పాడు. ఇది విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంత విరక్తి పుట్టడానికి గల కారణం ఏంటో తెలుసా.. కరోనా మహమ్మారి.

దీని వల్ల ఉన్న ఉపాధి పోయి.. ఉండటానికి ఇల్లు లేక.. తినడానికి తిండి లేక దుర్భర జీవితాన్ని గడిపినట్లు చెప్పాడు. దీంతో అతడి విజ్ఞప్తిని స్వీకరించిన పోలీసులు జైలు నుంచి పారిపోయినందుకు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు అంతకు ముందు మిగిలిన మరో సంవత్సరం జైలు శిక్షతో కలిపి మొత్తం 8 ఏళ్లు ఉండాల్సి వచ్చింది. డార్కో మంచి వాడని..తమతో మంచిగా కలిసిమెలిసి ఉండేవాడని.. మంచి వర్కర్ అంటూ కొంతమంది స్థానికులు వచ్చి పోలీసులను విన్నవించారు. అతడిని విడిపించండి.. మేము అతడిని పోషిస్తాం అంటూ చెప్పడం విశేషం.

జైలుశిక్ష అనుభవిస్తూ 31 డిగ్రీలు పూర్తి చేసిన ఖైదీ.. చివరకు…?

సాధారణంగా ఏదో ఒక కేసులో అరెస్ట్ అయిన ఖైదీలు ఏం చేస్తారనే ప్రశ్న ఎదురైతే వాళ్లు నిరాశానిస్పృహలతో జీవనం సాగిస్తూ ఉంటారని.. వీలైనంత తక్కువ సమయంలో శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటారని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ఆ ఖైదీ మాత్రం భిన్నం. 8 ఏళ్ల జైలు శిక్షాకాలంలో ఆ ఖైదీ ఏకంగా పదుల సంఖ్యలో డిగ్రీలను సాధించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఖైదీ గురించి తెగ వైరల్ అవుతోంది. జైలు నుంచి విడుదలైన తరువాత ఉద్యోగంలో చేరి మరిన్ని డిగ్రీలను పూర్తి చేసి గుజరాత్ కు చెందిన ఆ ఖైదీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్ని డిగ్రీలు సాధించిన ఆ ఖైదీ పేరు భానూభాయీ పటేల్. ఏకంగా 32 డిగ్రీలు సాధించిన ఈ ఖైదీ వరల్డ్ రికార్డ్ ఇండియా, యూనివర్సల్ రికార్డ్ ఫోరం, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లలో తన పేరు నమోదు చేసుకున్నాడు.

ఒక డిగ్రీ పూర్తి చేయడానికే చాలామంది నానా తంటాలు పడుతున్న ఈరోజుల్లో ఏకంగా 32 డిగ్రీలు పూర్తి చేసిన ఆ వ్యక్తి గురించి తెలిసి అవాక్కవ్వడం నెటిజన్ల వంతవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే భావ్ నగర్ లోని మహువాకు చెందిన భానూభాయీ పటేల్ ఎంబీబీఎస్ చదివి అమెరికాకు వెళ్లాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు స్టూడెంట్ వీసాతో ఉద్యోగం చేస్తూ భానూభాయ్ అకౌంట్ కు నగదును పంపాడు.

దీంతో ఫారిన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో అతనికి జైలుశిక్ష విధించారు. అతని డిగ్రీలను చూసి అంబేద్కర్ యూనివర్సిటీ జాబ్ ఇచ్చింది. ఉద్యోగంలో చేరాక కూడా భానూ డిగ్రీలు సాధించేందుకు ప్రయత్నం ఆపలేదు. భానూభాయ్ హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ భాషల్లో పుస్తకాలు కూడా రాశారు.