Tag Archives: kcr

కేసీఆర్ హుజూరాబాద్ పర్యటన.. ఏర్పాట్లు పూర్తి!

తెలంగాణలో రాజకీయలు హిట్ ఎక్కాయి. టీఆర్‌ఎస్ అధిష్టానం హుజూరాబాద్ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికి నియోజకవర్గాన్ని మంత్రులు చూట్టేస్తుండగా.. ఈనెల 16న నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారో అన్నదానిపై అందరీలో ఆసక్తి నెలకొంది. ఉప ఎన్నిక ప్రచారం అనంతరం కేసీఆర్ వరుసగా జిల్లాల పర్యటన చేయనున్నారు. ఆ తర్వాత నిజామాబాద్, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పర్యటన వెళ్ళనున్నారు. ఈనెల 16 హుజూరాబాద్ బహిరంగ సభ అనంతరం జిల్లాల విసృత్తంగా జిల్లాలా పర్యటన కొనసాగించనున్నారు.

సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌‌తో కలిసి నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే ఉంటూ పలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రైతుబంధు తరహా చేనేతబంధు.. వారికి ఎంత మెుత్తం ఇస్తారో!

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేనేతకు ప్రభుత్వం అందిస్తున్న పోత్సాహాల గురించి వివరించారు. చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం, నేతన్న చేయూత, చేనేత మిత్ర లాంటి పథకాలతో పాటు చేనేత సొసైటీలకు ప్రభుత్వం కొంత మెుత్తాన్ని అందించడం, కార్మికులకు ముడి సరుకులను సబ్సిడీలు అందించడం, మగ్గాల ఆధునీకరణ వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని సీఎం తెలిపారు.

రైతు బందు,దళిత బంధు తరహాలో తెలంగాణలోని నేత కార్మికులకు చేనేతబంధు పథకాన్ని తీసుకొస్తామని గతంలో సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు. పథకం అమలుకు కసరత్తకు ప్రణాళికలు రూపోదిస్తున్నారు అధికారులు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టిన నేతన్నలకు చేయూతకు ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. చేనేత బంధును కూడా త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతుంది.

నేడు వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌

వరుస జిల్లా పర్యటనలతో సీఎం కేసీఆర్ బీజిగా మారిపోయారు. జిల్లా కలక్టరెట్‌ల ప్రారంభోత్సవాల సందర్భంగా సిద్దిపేట,కామరెడ్డి,సిరిసిల్ల పర్యటనలు చేసిన కేసీఆర్ తాజాగా నాగర్జునసాగర్ హాలియాలో పర్యటించారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పర్యటించనున్నారు. జూన్‌ 22న ఈ గ్రామాన్ని సందర్శించిన కేసీఆర్‌ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పలు అభివృద్ది పనుల కోసం అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఈ పర్యటనలో భాగంగా దళితవాడలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన రైతువేదికలో 130 మందితో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని గ్రామసర్పంచి ఆంజనేయులుకు ఫోన్‌ చేసి కేసీఆర్ చెప్పారు. అలాగే గత పర్యటనలో తానిచ్చిన హామీల అమలు తీరును కూడా ఆయన పరిశీలించనున్నారు.

నా కన్నా గొప్ప నటుడు కేసీఆర్.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..?

ప్రముఖ నటి విజయశాంతి రెండు రోజుల క్రితం బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చిన విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 1998 సంవత్సరం నుంచే తెలంగాణ కోసం పోరాడానని.. బీజేపీలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేస్తే అప్పట్లో తెలుగుదేశం పార్టీ తనను వ్యతిరేకించిందని అమె అన్నారు.

ఆ తరువాత తెలంగాణ కోసం తాను బీజేపీని వీడి తల్లి తెలంగాణ అనే పార్టీని పెట్టానని కేసీఆర్ కు ఆ సమయంలో మంత్రి పదవి దక్కకపోవడంతో తెలంగాణ ఉద్యమంలోకి ఆయన వచ్చారని తెలిపారు. కేసీఆర్ తనను పార్టీలో కలుపుకోవాలని అప్పట్లో చాలా ప్రయత్నాలు చేశాడని.. పార్టీ కోసం తాను బాగా కష్టపడుతున్నానని కేసీఆర్ చెబితే తనకు నవ్వొచ్చిందని ఆమె అన్నారు. తాను ఎంపీగా విజయం సాధించినప్పటి నుంచి కేసీఆర్ తనను లేకుండా చేయాలని చూశాడని చెప్పారు.

తాను బీజేపీ పార్టీలో ఉన్న సమయంలో సోనియా గాంధీ మీద పోటీ చేయాలని తనకు కేసీఆర్ సూచించాడని.. కేసీఆర్ గురించి గతంలో వైఎస్సార్ ను కలిసి తాను వివరించానని అన్నారు. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి వెళితే తన మనుషులతో కేసీఆర్ బూతులు తిట్టించాడని.. కేసీఆర్ కావాలనే తనను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. తాను ఒక్కడే ఎదగాలనే స్వార్థంతో కేసీఆర్ అలా చేశాడని చెప్పారు.

తనకంటే కేసీఆర్ గొప్ప నటుడని ఆయన మాటలు నమ్మి తల్లి తెలంగాణ పార్టీని ఆయన పార్టీలో కలిపేశానని ఆమె చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తన దగ్గరకు వస్తానని చెప్పి లక్ష రూపాయలు లేవనే కారణంతో రాలేదని.. ఇప్పుడు మాత్రం కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించాడని కామెంట్లు చేశారు.

జగన్ పిల్లోడే కానీ నెంబర్ వన్ సీఎం.. బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు..?

ప్రముఖ కమెడియన్, బీజేపీ నాయకుడు బాబు మోహన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సీఎం జగన్ నంబర్ 1 సీఎం అని అన్నారు. ఒకవైపు జగన్ ను ప్రశంసలతో ముంచెత్తిన బాబు మోహన్ మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాత్రం విమర్శలు చేశారు. సీఎం జగన్ మొదటి స్థానంలో ఉంటే కేసీఆర్ చివరి స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. జగన్ ఏపీ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నాడంటూ బాబు మోహన్ కొనియాడారు.

గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి పెన్షన్ పంపిణీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ జరిగేలా చేశారని అన్నారు. కరోనా సమయంలో ప్రత్యేక వాహనాల సహాయంతో ప్రతి ఊరిలో ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకునేలా చేశారని.. రాజకీయ అనుభవం లేని జగన్ అద్భుతంగా పాలన సాగించాడని అన్నారు.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం కరోనా సమయంలో అస్సలు పట్టించుకోలేదని వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం జగన్ ను మెచ్చుకున్నారని.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే జగన్ అద్భుతంగా పని చేయడంతో ఆయనకు నంబర్ 1 ర్యాంక్ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ ప్రధానిని మారుస్తానని చెబుతూ ఉంటారని.. రేపటి ఎన్నికల్లో ఎవరు ఎవరిని మారుస్తారో తెలుస్తుందని అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్లని చెప్పారని కేసీఆర్ కు మాత్రం ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్లు మాత్రమే దేవుళ్లు అని అన్నారు. దళితులంటే కేసీఆర్ లెక్క ఉండదని.. పేదోళ్లంటే కేసీఆర్ కు అడ్రస్ ఉండదంటూ బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ సంచలన నిర్ణయం.. అపార్ట్‌మెంట్ వాసులకు శుభవార్త..?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజలు పనితీరును బేరీజు వేసుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేయాలని సూచనలు చేశారు. ప్రభుత్వం, నేతలు అభివృద్ధి చేస్తున్న తీరును బట్టి నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. చాలా చైతన్యం, చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్ అని కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రజలకు మంచి చేసే నాయకుడికి ఓటు వేస్తే సేవ చేసే మంచి నాయకులు పుట్టుకొస్తారని.. 2001 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం మొదలుపెట్టిన సమయంలో ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారని పేర్కొన్నారు. తాను రాష్ట్రాన్ని నడపలేనని ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరు వెంకటేశ్వరరావు అన్నారని కానీ ఆరు సంవత్సరాలలో వారి అంచనాలు తలక్రిందులు అయ్యేలా పాలన సాగించానని కేసీఆర్ తెలిపారు.

గతంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండేవని ప్రజలు ఇన్వర్టర్లు, జనరేటర్లపై ప్రజలు ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదని.. తెలంగాణ వచ్చిన తరువాత 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నో అనుమానాలు, అపోహల మధ్య టీఆర్ ఎస్ పార్టీని ప్రజలు నమ్మి దీవించారని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణకే తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని తెలిపారు.

నగరంలో 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీరు ఇచ్చామని.. అపార్టుమెంట్ల విషయంలో కూడా 20 వేల లీటర్ల పథకం వర్తిస్తుందని అపార్టుమెంట్ వాసులకు మంచి శుభవార్త చెప్పారు. ఈ నిర్ణయం శాశ్వతంగా అమలులో ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు.

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పట్టాభిషేకానికి లైన్ క్లియర్ అయిపొయింది. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం నేపథ్యంలో ఈ దిశగా కెసిఆర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సీఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఎలా ఉండబోతోంది అని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కలిపే బాధ్యతతో మరోసారి కీలక భూమిక దిశగా అడుగులు వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయంపైనా ప్రత్యేకంగా కేటీఆర్ పేరు ప్రస్తావించి ఆశీస్సులు అందజేశారు.

అదేసమయంలో మంత్రులు కొంతకాలంగా కేటీఆర్ ను ఉద్దేశించి చేస్తున్న ప్రకటనలపైన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖలతో స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. సమయం, సందర్భం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నట్టు తేలిపోయింది. ఇదే సమయంలో మున్సిపల్ ఫలితాల తరువాత అటు పార్టీలో, ఇటు ప్రగతి భవనంలో కేటీఆర్ పేరు మారు మ్రోగిపోతోంది. కేసీఆర్ తిరిగి జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తనయుడు కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 31 జిల్లా పరిషత్తులు గెలుచుకోవడంతో, మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో కేటీఆర్ సమర్ధత ఏంటో పార్టీ నేతలకు, ప్రజలకు తెలియజేయటంలో కేసీఆర్ విజయం సాధించారు. ఇక కొంత కాలంగా మంత్రులు పోటీపడి మరీ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలు, కాంగ్రెస్, బీజేపీయేతర నేతలను ఏకం చేయడంకోసం ఇతర పార్టీల ముఖ్యమంత్రుల సమావేశానికి కేసీఆర్ లీడ్ తీసుకున్నారట. దీని ద్వారా తెలంగాణలో ప్రభుత్వ, పార్టీ భాద్యతలను తనయుడు కేటీఆర్ కు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చారన్నది అయన మాటల్లోనే వ్యక్తమైనట్టు భావించాల్సి ఉంది. కొంతకాలంగా కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం గురించి పార్టీలో పెద్దఎత్తున చర్చ సాగుతుంది. ఆ సమయంలో కెసిఆర్ జాతీయ రాజకీయాల పైన ఫోకస్ చేస్తూనే పార్టీ అధ్యక్షుడిగా, ప్రభుత్వాన్ని సలహాలిచ్చే చట్టబద్ధ సంఘానికి చైర్మన్ గా ఉంటారంటూ పార్టీలోని సీనియర్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖానించారు.

తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత క్యాబినెట్ మంత్రుల ప్రకటనలో విష్ ఫుల్ థింకింగ్ గా వాళ్ళు, వీళ్ళు అంటున్నారని కాదని సమయం సందర్భం చూసుకుని నిర్ణయం ఉంటుందని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ, కలిసి వచ్చే పార్టీల సీఎంలతో కలిసి పోరాడతానని, దేశంకోసం జాతీయ రాజకీయాలలోకి వెళ్తానని ప్రకటించారు. దీని ద్వారా కేటీఆర్ కు పట్టాభిషేకం ఖాయమని కేసీఆర్ వ్యాఖల సారాంశం అంటూ పార్టీ నేతలు అంచనాకి వస్తున్నారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు వెనక కేటీఆర్ ప్రస్తావన స్వయంగా కేసీఆర్ తీసుకురావడంతో పాటుగా ప్రత్యేకంగా ఆశీస్సులు అందజేశారు. 2024 లో ఫెడరల్ ఫ్రెంట్ దే అధికారం అనే ధీమాలో కేసీఆర్ ఉన్నారు. దీనితో కుమారుడికి పీఠం అప్పగింత నిర్ణయం తీసుకోడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టదని అభిప్రాయ పడుతున్నారు.

అయితే నెలరోజుల్లో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం అవుతానని వెల్లడించడంతో అతి స్వల్ప వ్యవధిలోనే కేటీఆర్ సీఎంగా కొలువుదీరవచ్చని అంటున్నారు. తాజాపరిణామాలతో కేటీఆర్ కు తెలంగాణ భవన్ లో అభినందనలు వెల్లువెత్తాయి. దీనితో కేటీఆర్ కు పగ్గాలు అప్పగించేందుకు దాదాపు నిర్ణయం అయినట్టేనని, సమయానుకూలంగా ముహూర్తం మాత్రమే ఖరారు చేయాల్సి ఉందని పార్టీనేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరిలో కేసీఆర్ కుటుంబం ఒక యాగం తలపెట్టింది. ఆ తరువాత కేటీఆర్ కు పట్టాభిషేకం ఉంటుందని వార్తలు వస్తున్నాయి.