Tag Archives: krishna raju

Prabhas: హీరోగా 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రభాస్.. ఊహించలేదంటూ కృష్ణంరాజు కామెంట్స్..!

Prabhas: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి నేటికి రెండు దశాబ్దాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా కృష్ణం రాజు ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగాయి.

Prabhas: హీరోగా 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రభాస్.. ఊహించలేదంటూ కృష్ణంరాజు కామెంట్స్..!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మొదటి చిత్రం. 2002 జులై 28 వ తేదీన రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ‘ఈశ్వర్’ అనే సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమా మొదలై ఇప్పటికీ 20 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమా దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

Prabhas: హీరోగా 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రభాస్.. ఊహించలేదంటూ కృష్ణంరాజు కామెంట్స్..!

ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ. .. “ప్రభాస్ హీరోగా పరిచయం అయ్యి 20 ఏళ్ళు గడిచాయి అంటే నమ్మలేకపోతున్నాను. నిజానికి ప్రభాస్ ని మా గోపి కృష్ణ బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం చేద్దామని అనుకున్నాం. కానీ ఒక రోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు.

పాన్ ఇండియా హీరో అవుతాడని ఊహించలేదు…

ఈక్రమంలో ‘ఈశ్వర్’ సినిమా కథ విన్నప్పుడు ఈ సినిమా తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందని అనిపించింది. ఆ నమ్మకంతో సినిమా చేయటానికి ఒప్పుకున్నాను. జయంత్, అశోక్ ఇద్దరు కలిసి బాధ్యతగా తీసిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీలో ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా ద్వార ప్రభాస్ ఇండస్ట్రీలో మంచి హీరో అవుతాడు అనుకున్నా కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో నటిస్తున్నాడు.

రాధేశ్యామ్ నుంచి కృష్ణంరాజు ఫస్ట్ లుక్ విడుదల.. పరమహంస పాత్రలో..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రాబోతోంది. బాహుబలి తర్వాత ‘సాహో’ సినిమాతో ప్రభాస్ కాస్త నిరాశకు గురయ్యాడు. ఆ నిరాశను సినిమాతో పూడ్చుకోవాలని రాధేశ్యామ్ ప్లాన్ చేశాడు ప్రభాస్. ఈ మేరకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమాలో భాగమై ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు.

ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటుడు కృష్ణంరాజు తన లుక్‌ని రివీల్ చేసి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు వచ్చేలా చేశాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మహాజ్ఞాని పరమహంస పాత్రలో రాధేశ్యామ్ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ పోస్టర్‌లో కృష్ణంరాజు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు.

ఈ పాత్ర కోసం ఏడాది పాటు గడ్డం పెంచాడు కృష్ణంరాజు. పాత్రకు సరిగ్గా సరిపోతుందని అనిపించిన అతని లుక్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెబల్ స్టార్ అభిమానులు ఈ పోస్టర్ చూసి సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్పణలో ప్యాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున విడుదలైంది.

ఇప్పటికే విడుదలైన ప్రభాస్ లుక్స్, పాటలు సినిమాపై హైప్ పెంచాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. వంశీ, ప్రమోద్, ప్రసిద నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. కృష్ణంరాజు గతంలో ప్రభాస్‌తో ‘బిల్లా’, ‘రెబల్‌’ చిత్రాల్లో నటించారు. గణపతిగా అతడు చివరిసారిగా 2015లో వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమాలో కనిపించాడు. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనుండడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.