Tag Archives: Krishnavamsi

NTR: ఎన్టీఆర్ ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా… అవకాశం వస్తే ఆ సినిమాని రీమేక్ చేస్తా: ఎన్టీఆర్

NTR:గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ మీకు మల్టీ స్టార్ సినిమాలో చేసే అవకాశం వస్తే ఏ హీరోతో చేస్తారని ప్రశ్నించగా ఈయన మాత్రం మహేష్ బాబుతో చేస్తాను అంటూ సమాధానం చెప్పారు ఇక తన తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో ఏదైనా సినిమాను రీమేక్ చేయాలి అనుకుంటే ఏ సినిమా చేస్తారని ప్రశ్నించగా తాను దానవీరశూరకర్ణ సినిమా చేస్తానని ఎన్టీఆర్ సమాధానం చెప్పారు.

నాకు ఇష్టమైనటువంటి హీరోలలో ఎన్టీఆర్ గారు ఒకరిని అలాగే శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం అంటూ తారక్ కామెంట్ చేశారు. ఇక రాజమౌళి వివి వినాయక్ కృష్ణవంశీ ఈ ముగ్గురు దర్శకులలో బెస్ట్ డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్న కూడా ఈయనకు ఎదురయింది. ఇక ఈ ప్రశ్న వేయడంతో ఇదొక చండాలమైన ప్రశ్న అంటూ తారక్ సమాధానం చెప్పడం సంచలనంగా మారింది.

NTR: ముగ్గురు చాలా ప్రత్యేకం…


ఈ ముగ్గురు చాలా టాలెంటెడ్ డైరెక్టర్లని ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ అని అడగడం పిచ్చి ప్రశ్న అంటూ సమాధానం చెప్పారు. నా దృష్టిలో ఈ ముగ్గురు డైరెక్టర్లు ఒకటేనని ఈ ముగ్గురు తన కెరీర్ లోఎంతో ముఖ్యమైన వారని తనకు ఎంతో మంచి సక్సెస్ సినిమాలను అందించారు అంటూ ఈ సందర్భంగా తారక్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Krishnavamsi: నేనొక బ్యాడ్ సన్.. డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్ వైరల్!

Krishnavamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎన్నో ఫ్యామిలీ కథ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన కృష్ణవంశీ చాలా కాలం తర్వాత రంగమార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మరాఠీ సూపర్ హిట్ చిత్రం నట సామ్రాట్ చిత్రానికి రీమేక్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రమ్యకృష్ణ బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ వంటి తదితరులు కీలకపాత్రలో నటించారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విజయం పై కృష్ణవంశీ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

రంగ మార్తాండ సినిమా ఇంత మంచి విజయాన్ని అందుకుంటుందని తాను ఊహించలేదని తెలిపారు తాను ఇప్పటివరకు తీసిన సినిమాల కన్నా రంగమార్తాండ సినిమాకు మంచి ప్రశంసలు అందాయని ఈయన సంతోషం వ్యక్తం చేశారు.ఈ సినిమా విడుదలకు పెద్దగా ప్రమోషన్ చేయలేదని కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు చేసిందని తెలిపారు.

ఇక ఈ సినిమా టైటిల్ కు ఇది అమ్మానాన్నల కథ అని క్యాప్షన్ ఇవ్వడంతో మరికొంతమందిని ఆకట్టుకుందని తెలిపారు. అయితే ఈ సినిమాకు నాకు నిజ జీవితానికి చాలా తేడా ఉందని తెలిపారు. చిన్నప్పుడే తన తండ్రి చనిపోయారని ప్రస్తుతం తన తల్లి మాత్రమే తన వద్ద ఉన్నారని కృష్ణ వంశీ తెలిపారు. ఇక చిన్నప్పటినుంచి నేను తన పేరెంట్స్ పెద్దగా కనెక్ట్ కాలేదని తెలిపారు.

Krishnavamsi: పేరెంట్స్ కు తాను కనెక్ట్ కాలేదు…


ఇక తాను డైరెక్టర్ గా మారి ఫ్యామిలీ సినిమాలు చేసినప్పటికీ తను ఒక బ్యాడ్ సన్ అని కృష్ణవంశీ తెలిపారు.ఇక ఇంట్లో వారితో కూడా తాను పెద్దగా క్లోజ్ గా ఉండనంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ramyakrishna: కళ్ళతోనే నటించమన్నాడు… నేను అలాగే చేశా.. రంగమార్తాండ సినిమా పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Ramyakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ భాషలలో అలనాటి స్టార్ హీరోలు సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రమ్యకృష్ణ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలకపాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా రంగమార్తండా సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది.

ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఉగాది సందర్భంగా మార్చి 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రమ్యకృష్ణ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ…” ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందు ఈ కాలంలో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు? అని కృష్ణవంశీని అడిగాను. కానీ ఆయన నా మాట వినకుండా చాలా మొండిగా సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర కోసం ఎంతోమంది హీరోయిన్లను సంప్రదించారు. కానీ ఎవరు సెలెక్ట్ కాకపోవటంతో ఈ పాత్రలో నేను నటిస్తానని చెప్పి ముందుకు వచ్చాను.

Ramyakrishna:కృష్ణవంశీ కెరియర్ లోనే బెస్ట్ సినిమా…

ఈ సినిమాలో నా పాత్రలో నటించాలి అంటే కళ్ళతోనే నటించాలని ఆయన చెప్పారు నేను కూడా అలాగే నటించా. అసలు ఈ సినిమాలో నా పాత్ర నివిడి ఇంత ఉంటుందని ఊహించలేదు అంటూ రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది..ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. సాధారణంగా నాకు ఎమోషనల్ సినిమాలు నచ్చవు. కానీ ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే చాలా ఎమోషనల్ అయ్యాను. ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమా కృష్ణ వంశీ కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుంది” అంటూ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమా మీద ఆసక్తిని పెంచాయి. ఉగాది కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Krishna Vamsi: సింధూరం సినిమాని రీ-రిలీజ్ చేయమన్న నేటిజన్.. దండం పెట్టేసిన కృష్ణవంశీ!

Krishna Vamsi: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణవంశీ ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను సందడి చేశాయి.ఇకపోతే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రి రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే కృష్ణవంశీ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సింధూరం. అయితే ఈ సినిమాని రిలీజ్ చేయమంటూ ఓ అభిమాని కృష్ణవంశీకే ట్వీట్ చేశారు.సింధూరం అంటే అద్భుతమైన సినిమాని మరోసారి థియేటర్లో చూడటం కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం.ఈ సినిమాని కనుక థియేటర్లో విడుదల చేస్తే నాలుగు షోలు చూడటానికి మాలాంటి వాళ్ళు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారని దయచేసి మరొకసారి ఈ సినిమాని రీ రిలీజ్ చేయమని వేడుకుంటూ కృష్ణవంశీకి టాగ్ చేశారు.

ఇక ఈ ట్వీట్ కి కృష్ణవంశీ రిప్లై ఇస్తూ… వామ్మో సింధూరం సినిమా అప్పులు కట్టడానికి ఐదు సంవత్సరాలు కష్టపడ్డానయ్యా… వామ్మో అంటూ ఏకంగా దండం పెట్టేసారు. ఈ సినిమాలో వచ్చిన నష్టాలు అన్నింటిని తన భుజాలపై వేసుకొని సుమారు 5 సంవత్సరాల పాటు కష్టపడుతూ ఈ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చానని ఈ సందర్భంగా కృష్ణవంశీ తెలియజేశారు.

Krishna Vamsi: ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సింధూరం….

ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు అందుకుంది అదేవిధంగా ద్వితీయ నంది అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కోసం పని చేసిన చిత్ర బృందానికి సైతం అవార్డులు వరించాయి. ఇలా ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకున్నప్పటికీ కమర్షియల్ గా దారుణమైన కలెక్షన్లను రాబట్టడంతో భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.