Krishna Vamsi: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణవంశీ ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను సందడి చేశాయి.ఇకపోతే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రి రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే కృష్ణవంశీ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సింధూరం. అయితే ఈ సినిమాని రిలీజ్ చేయమంటూ ఓ అభిమాని కృష్ణవంశీకే ట్వీట్ చేశారు.సింధూరం అంటే అద్భుతమైన సినిమాని మరోసారి థియేటర్లో చూడటం కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం.ఈ సినిమాని కనుక థియేటర్లో విడుదల చేస్తే నాలుగు షోలు చూడటానికి మాలాంటి వాళ్ళు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారని దయచేసి మరొకసారి ఈ సినిమాని రీ రిలీజ్ చేయమని వేడుకుంటూ కృష్ణవంశీకి టాగ్ చేశారు.
ఇక ఈ ట్వీట్ కి కృష్ణవంశీ రిప్లై ఇస్తూ… వామ్మో సింధూరం సినిమా అప్పులు కట్టడానికి ఐదు సంవత్సరాలు కష్టపడ్డానయ్యా… వామ్మో అంటూ ఏకంగా దండం పెట్టేసారు. ఈ సినిమాలో వచ్చిన నష్టాలు అన్నింటిని తన భుజాలపై వేసుకొని సుమారు 5 సంవత్సరాల పాటు కష్టపడుతూ ఈ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చానని ఈ సందర్భంగా కృష్ణవంశీ తెలియజేశారు.
ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు అందుకుంది అదేవిధంగా ద్వితీయ నంది అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కోసం పని చేసిన చిత్ర బృందానికి సైతం అవార్డులు వరించాయి. ఇలా ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకున్నప్పటికీ కమర్షియల్ గా దారుణమైన కలెక్షన్లను రాబట్టడంతో భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
హరిహరసుతుడు అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా కేరళలోని శబరిమల ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రత్యేక ఉత్సాహంతో మారుమ్రోగుతోంది. సంవత్సరంలో కొన్ని…
మన రోజువారీ జీవితంలో చాలామందికి తేన్పులు రావడం సహజమే. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా రావడం వల్ల అసౌకర్యంగా మారుతుంది.…
ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న ఈ రోజుల్లో, ఆహారంలో చిన్న మార్పులే పెద్ద ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన…
ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం గణనీయంగా పెరిగింది. సాయంత్రం అయ్యాక సమోసా, పానీపూరీ, బర్గర్,…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ఉద్యోగ సమయాలు కూడా పెద్దగా మారిపోయాయి. ఐటీ, హెల్త్కేర్, సర్వీస్ రంగాల్లో పని చేసే చాలా…
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…