Tag Archives: krishnaveni

Actress Krishnaveni: ఆ హీరోయిన్ నా భర్తను కరెంటు వైర్లతో కాల్చి హత్య చేయించింది… నటి కృష్ణవేణి షాకింగ్ కామెంట్స్!

Actress Krishnaveni: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి కృష్ణవేణి గురించి అందరికీ తెలిసిందే. 1979లో నగ్నసత్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృష్ణవేణి ఎన్నో సినిమాలలో నటిగా సహాయనటిగా అద్భుతమైన పాత్రలో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Actress Krishnaveni: ఆ హీరోయిన్ నా భర్తను కరెంటు వైర్లతో కాల్చి హత్య చేయించింది… నటి కృష్ణవేణి షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా ఇండస్ట్రీలో సుమారు 200కు పైగా సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందిన కృష్ణవేణి ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ లో బామ్మ పాత్రలలో నటిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతున్న కృష్ణవేణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Actress Krishnaveni: ఆ హీరోయిన్ నా భర్తను కరెంటు వైర్లతో కాల్చి హత్య చేయించింది… నటి కృష్ణవేణి షాకింగ్ కామెంట్స్!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంలో ‘వారాలబ్బాయి’ డైరెక్టర్‌ రాజచంద్రను పెళ్లి చేసుకున్నానని వెల్లడించారు.అయితే అప్పటికే ఆయనకు పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారని,ఇంటి అద్దె కూడా చెల్లించుకోలేని పరిస్థితులలో ఉన్న ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో సినిమాకి సుమారు 4 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదగారని అయితే అదే సమయంలోనే ఆయన చనిపోయారని తెలియజేశారు.

అతని విజయాన్ని ఓర్వలేకే ఈ హత్య…

ఇక ఆయనను పెళ్లి చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలు మేము కలిసి ఉన్నామని అయితే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు 100 రోజులు ఆడటం వల్ల ఇండస్ట్రీ తనని చూసి ఓర్వ లేక పోయిందని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ తనని కరెంటు వైర్ లతో కాల్చి హత్య చేయించిందని కృష్ణవేణి ఈ సందర్భంగా తన భర్త హత్యకు గల కారణాలు తెలియజేశారు.ఇక తన భర్త హత్య గురించి పోలీసులు మాట్లాడుతూ ఈ హత్య ఎవరు చేశారో మాకు తెలుసు అయినా తనని మేము ఏమీ చేయలేక పోతున్నాను అంటూ తెలియజేశారని వెల్లడించారు..ఈ విధంగా తన భర్తను చంపడమే కాకుండా మా కుటుంబానికి కూడా బెదిరింపులు వచ్చాయని అందుకే మా కుటుంబానికి పోలీసులు సుమారు రెండు సంవత్సరాల పాటు రక్షణ కల్పించారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కృష్ణవేణి తెలిపారు. తన భర్తను ఒక హీరోయిన్ హత్య చేయించింనే విషయం చెప్పినప్పటికీ ఆమె ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.

Krishnaveni: రంగుల ప్రపంచంలో ఎన్నో కష్టాలు.. చివరికి పని మనిషిగా కూడా మారాను.. నటి కన్నీటి కష్టాలు!

Krishnaveni: సినిమా ప్రపంచం అంటేనే ఎన్నో ఒడిదొడుకలతో కూడుకొని ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో విజయవంతంగా తమ కెరీర్ ను గడిపిన వాళ్లు ఉన్నారు.. మరికొంత మంది డబ్బులు లేక సినిమా ఆఫర్లు లేక పస్తులు ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. భయట అనుకునేంత అందంగా సినీ యాక్టర్ల జీవితాలు ఉండవని… కేవలం తెరపై మాత్రమే రంగులు పూసుకొని కనపడినా తమ జీవితాలు.. తెర వెనుకు ఎన్నో ఆటుపోటులు ఉన్నాయని చెప్పుకొచ్చింది సీనియర్ నటి కృష్ణవేణి.

90ల్లో ఎన్నో సినిమాల్లో కామెడీ ఆర్టిస్టుగా పని చేసిన ఈమె తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా రానించారు. తర్వాత కొన్నాళ్లు ఆఫర్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డట్లు తెలిపారు.

తినడానికి కనీసం తిండి లేక అలమటించానని.. అమెరికాలో ఓ 90 సంవత్సరాల పెద్ద మనిషి ఇంట్లో పని మనిషిగా చేరినట్లు తెలిపారు. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ లో అనుభవించిన కష్టాల గురించి చెబుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు.

అంతే కాదు మరో నటి రజిత ..

ఆఫర్లు వచ్చిన సమయంలోనే సంపాదించుకోవాలని.. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిదయదని అన్నారు. అయితే ప్రస్తుతం తాను ఆనందంగానే ఉన్నానని.. కష్టాల నుంచి వచ్చిన ఎఫెక్ట్ ఇప్పుడు అనుభవిస్తున్నాని చెప్పింది. మరో విషయం ఏంటంటే.. ఆమె బంధువులు కూడా చాలా మంది సినీ పరిశ్రమలోనే ఉన్నారని తెలిపారు. అమృతం సీరియల్‌లో గుండు హనుమంతురావు భార్యగా నటించిన రాగిణి స్వయానా తనకు చెల్లి అవుతుందని చెప్పారు. అంతే కాదు మరో నటి రజిత కూడా ఇండస్ట్రీలో ఉన్నట్లు తెలిపారు. ఈమె స్వయానా అక్క కూతురు అవుతుందని చెప్పారు. కొన్ని వందల సినిమాల్లో నటించిన తర్వాత కూడా.. పూట గడవడం కష్టంగా మారి పని మనిషిగా మారడం అనేది దారుణం అని.. ఆమె గురించి తెలుసుకున్న సగటు సినీ ప్రేక్షకుడు ఆవేదన చెందుతున్నారు.

వివాహేతర సంబంధం.. మూడు ప్రాణాలను బలి తీసుకుంది.. ఏమైందంటే..!

వివాహేతన సంబంధాలు ఎంత దూరమైనా దారితీస్తాయి. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున కూడా పడ్డాయి. ఇలా రోజు ఏదో ఒక వార్తలు మనం వింటూనే ఉన్నాం. తాజాగా జరిగిన ఘటనలో కూడా వివాహేతర సంబంధం కాస్త.. ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన బాలయ్య, కృష్ణవేణి దంపతులు. అదే గ్రామానికి చెందిన 30 ఏళ్ల ధర్మయ్య వారు ఉండే కాలనీలోనే ఉంటున్నాడు. దీంతో అతడితో పరిచయం ఏర్పరుచుకున్న సందరు మహిళ.. తరచూ మాట్లాడుతుండేది. ఇది రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఓ రోజు కృష్ణవేణి, ధర్మయ్య ఇంటి నుంచి పారిపోయారు.

దీంతో బాలయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. నిండు నూరేళ్లు కలిసి ఉంటానని చెప్పిన భార్య ఇలాంటి పని చేయడంతో ఎంతో క్రుంగిపోయాడు. తెల్లారి అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అది చూసిన చుట్టు పక్కల వారు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా.. చికిత్స పొందుతూ అతడు మరణించాడు.

ఇంటి నుంచి పారిపోయిన సదరు మహిళ, ధర్మయ్యలు ఆ ఊర్లోనే ఓ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటి యజమాని.. కొన్ని రోజుల క్రితం వాళ్ల బిడ్డ ఇంటికి వెళ్లి.. తిరిగి వచ్చింది. తలుపులు తీయగా ఆ రెండు శవాలు వాసన వచ్చాయి. దీంతో ఆమె స్థానికులకు చెప్పగా.. వాళ్లిద్దరు ధర్మయ్య, కృష్ణవేణి గా గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.