Tag Archives: liger

సినిమాల్లోకి రాకముందు …. విజయ్ దేవరకొండ ఏం చేసేవాడో తెలుసా?

నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన విజయ్ దేవరకొండ… పెళ్లి చూపులు చిత్రం హీరోగా మంచి బ్రేక్‌ని ఇచ్చింది. ఈ మూవీలో ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు . తర్వాత వచ్చిన అర్జున్‌ రెడ్డి తెలుగు ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్‌ని సృష్టించింది. అతన్ని ఓవర్ నైట్ స్టార్‌ని చేసింది.

తదనంతరం వచ్చిన టాక్సీవాలా, గీత గోవిందంతో చక్కని విజయాన్ని అందుకొని… తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విజయ్… ఒక సెన్సేషన్ &యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకున్నా తన టాలెంట్‌తో సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ.

పాన్ ఇండియా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగిన విజయ్.. సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవారనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అందరిలాగే ఆయన కూడా కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్లేవాడట. సినిమా టికెట్స్ కోసం గంటల తరబడి థియేటర్స్ ముందు నిల్చునేవారట. హీరో కాకముందు ఓ సాధారణ ప్రేక్షకుడిగా తాను పొందిన అనుభవాలు.. ఇప్పటికీ తన ఆడియన్స్‌ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయని ఆయన అంటుంటారు. ఆడియన్స్ పట్ల విజయ్ దేవరకొండ దృష్టి భిన్నంగా ఉంటుందట. నటుడు, ఆడియన్స్ అనే భేదభావం విజయ్ దేవరకొండకు ఉండదట. తన సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులను తన ఫ్రెండ్స్ వలె భావిస్తారట.

ఓ చిన్న నటుడిగా కెరీర్ బిగిన్ చేసి, సపోర్టింగ్ హీరోగా ఎదిగి, స్టార్ హోదా దక్కించుకున్న విజయ్ దేవరకొండ.. పూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా ఇదిలా ఉండగా తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో మూవీని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

దానిపై కాలేసుకుని పడుకున్న ఛార్మి.. వైరల్ అవుతున్న ఫోటో !

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఛార్మి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అయితే ప్రస్తుతం సినిమాలకు స్వస్తి చెప్పిన ఈమె నిర్మాతగా మారారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న” లైగర్” సినిమాకు నిర్మాతగా మారిన ఛార్మి గత కొంతకాలం నుంచి పూరి ముంబైలోనే నివసిస్తున్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగాయని భావించి విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా తరహాలో లైగర్ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న లైగర్ సినిమా పై కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో ఈ సినిమా షూటింగును ఆపివేశారు. ఈ క్రమంలోనే ఛార్మి ముంబైలోనే నివసిస్తున్నారు. మరి పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ముంబై వెళ్ళినప్పుడు చార్మి, పూరిను కలిశారు. ఆ క్రమంలో చార్మి షేర్ చేసిన ఓ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

సింహం అంటూ తన పెట్, ప్రభాస్ ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఫోటోలో ఛార్మి పెట్ డాగ్ ను చూసి నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలస్కన్ మలమూటే అంటూ తన తొమ్మిది నెలల కొడుకు అంటూ అందరికీ పరిచయం చేసేశారు. అంత ఎత్తున కుక్కను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఛార్మి తనకెంతో ఇష్టమైన తన పెంపుడు జంతువుతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా ఛార్మీ ఓ పోస్ట్ చేసింది. సైలెంట్‌గా ఉండండి.. మీ కుక్కను హగ్ చేసుకోండి.. అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. తన పెట్ డాగ్ పై కాలేసుకుని సోఫా మీద పడుకున్న ఫోటోను షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఛార్మి పెళ్లి చేసుకోబోతోందని, వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఈ విధంగా తన పై వచ్చిన వార్తలకు స్పందించిన ఛార్మి పెళ్లి చేసుకుని జీవితంలో పెద్ద తప్పు చేయనని తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.