Tag Archives: London restaurant

Sobhitha Dhulipala: ఆ వార్తలను పెద్దగా పట్టించుకోను… కాబోయే వాడు అలాగే ఉండాలి: శోభిత ధూళిపాళ్ల

Sobhitha Dhulipala: శోభిత ధూళిపాళ్ల గత కొన్ని రోజులుగా నాగచైతన్యతో డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున డేటింగ్ రూమర్స్ ఎదుర్కొంటూ వార్తలలో నిలుస్తున్నారు. ఇలా నాగచైతన్యతో డేటింగ్ రూమర్స్ ద్వారా ఈమె తరచూ వార్తలో నిలవడమే కాకుండా ఎప్పటికప్పుడు ఈ వార్తలపై స్పందించినప్పటికీ తరచూ ఈ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈమె గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు.

వీరిద్దరూ కలిసి లండన్ లోని ఒక రెస్టారెంట్లో కలిసి ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను శోభిత ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఇకపోతే తాజాగా ఈమె ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శోభిత తనకు కాబోయే వాడి గురించి తనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాల గురించి తెలియజేశారు.

తనని పెళ్లి చేసుకునేవాడు చాలా సింపుల్ గా ఉండాలని ఆకాంక్షించారు.ఇతరుల పట్ల దయ జాలి కలిగి ఉండాలని తెలిపారు.మన జీవితం చాలా చిన్నది జీవితంలో ప్రతిక్షణాన్ని సంతోషంగా ఆస్వాదించాలి అని తెలిసిన వ్యక్తి అయితే చాలని ఈమె తెలియజేశారు. ఇక నన్ను పెళ్లి చేసుకునేవాడు ప్రకృతిని కూడా ప్రేమించాలని తెలిపారు. ఈ విధంగా తనకు కాబోయే వాడి గురించి శోభిత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Sobhitha Dhulipala: నా సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుంది..


ఈ క్రమంలోనే నాగచైతన్యతో వస్తున్నటువంటి డైటింగ్ రూమర్ల గురించి ప్రశ్న తలెత్తగా ఈమె ఈ వార్తలపై స్పందిస్తూ తాను అలాంటి వార్తలను ఏమాత్రం పట్టించుకోనని తెలిపారు. నేను ఎన్నో ఆడిషన్స్ చేస్తేనే హీరోయిన్ గా అవకాశాలు అందుకున్నానని,ప్రతిక్షణం నా పనిలో కష్టపడుతూ ఉన్నానని తెలిపారు. ఇక ఎవరైనా తన గురించి మాట్లాడాల్సి వస్తే తన సినిమాల గురించి తన పని గురించి మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా శోభిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రియుడితో డేట్ కు వెళ్లిన యువతి.. హోటల్ లో జరిగిన ఘటనతో ఆమె ఏం చేసిందో తెలుసా..?

అక్కడ ఒక్క చికెన్ ముక్కకు రూ.3 వేలు వసూలు చేశారు. అవును మీరు విన్నది నిజమే.. సరదాగా తన ప్రేమికుడితో డేట్ కు వెళ్లిన ఓ యువతి.. ఆ హోటల్ లోనే విందు చేయడానికి కూర్చున్నారు. అక్కడ వాళ్లు ఆర్డర్ చేసిన ఐటెంకు రూ.3 వేల బిల్లు వేసి ఆశ్చర్యానికి గురి చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. లండన్ కు చెందిన రవీన్ అనే యువతి.. తన ప్రియుడితో కలిసి ది షార్డ్‌లోని రెస్టారెంట్‌లో డేటింగ్‌కు వెళ్ళింది. సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దామని ఆమె ఒక డిష్ ఆర్డర్ చేసింది. దానికి రూ.3 వేలు ఖర్చు అయింది.

అయితే దానిని తీసుకొని వచ్చిన తర్వాత ఆమె షాక్ కు గురైంది. అందులో కేవలం ఒక చికెన్ ముక్క, సాస్, ఓ బంగాళదుంప మాత్రమే ఉన్నాయి. ఇంగ్లాండ్ కరెన్సీలో 30 పౌండ్లు అంటే రూ.3 వేలు. అంత ఖర్చు పెట్టి ఆర్డర్ చేస్తే.. కనీసం చిన్న పిల్లలకు కూడా కడుపు నిండని ఐటెం తెస్తారా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఆర్డర్ పెట్టిన ఐటెంను ఫొటో తీసి.. ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

“గాయ్స్, నా 30 పౌండ్ల భోజనాన్ని చూడండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఎంతో మధురంగా.. ఎన్నో సంవత్సరాల వరకు గుర్తుండిపోయేలా కాలక్షేపం చేయడానికి వస్తే.. ఇలా రెస్టారెండ్ నిర్వాహకులు తీవ్ర అసంతృప్తిని కలిగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.