అక్కడ ఒక్క చికెన్ ముక్కకు రూ.3 వేలు వసూలు చేశారు. అవును మీరు విన్నది నిజమే.. సరదాగా తన ప్రేమికుడితో డేట్ కు వెళ్లిన ఓ యువతి.. ఆ హోటల్ లోనే విందు చేయడానికి కూర్చున్నారు. అక్కడ వాళ్లు ఆర్డర్ చేసిన ఐటెంకు రూ.3 వేల బిల్లు వేసి ఆశ్చర్యానికి గురి చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. లండన్ కు చెందిన రవీన్ అనే యువతి.. తన ప్రియుడితో కలిసి ది షార్డ్లోని రెస్టారెంట్లో డేటింగ్కు వెళ్ళింది. సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దామని ఆమె ఒక డిష్ ఆర్డర్ చేసింది. దానికి రూ.3 వేలు ఖర్చు అయింది.
అయితే దానిని తీసుకొని వచ్చిన తర్వాత ఆమె షాక్ కు గురైంది. అందులో కేవలం ఒక చికెన్ ముక్క, సాస్, ఓ బంగాళదుంప మాత్రమే ఉన్నాయి. ఇంగ్లాండ్ కరెన్సీలో 30 పౌండ్లు అంటే రూ.3 వేలు. అంత ఖర్చు పెట్టి ఆర్డర్ చేస్తే.. కనీసం చిన్న పిల్లలకు కూడా కడుపు నిండని ఐటెం తెస్తారా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఆర్డర్ పెట్టిన ఐటెంను ఫొటో తీసి.. ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
“గాయ్స్, నా 30 పౌండ్ల భోజనాన్ని చూడండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఎంతో మధురంగా.. ఎన్నో సంవత్సరాల వరకు గుర్తుండిపోయేలా కాలక్షేపం చేయడానికి వస్తే.. ఇలా రెస్టారెండ్ నిర్వాహకులు తీవ్ర అసంతృప్తిని కలిగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…