కొన్ని ఘటనలు మనం ఊహించకుండానే జరిగిపోతాయి. మనం అలర్ట్ అయిపోయేసరికి జరిగే నష్టం కాస్త జరిగిపోతుంది. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఛత్తర్పూర్ లోని సతాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వ గ్రామానికి చెందిన మహిళకు తన అత్తకు మొబైల్ విషయంలో గొడవ జరిగింది.
దీంతో ఆమె తీవ్ర మనస్థాపం చెందింది. ఇంట్లో పని లేని సమయంలో మొబైల్ చూడటం కూడా తప్పా.. అంటూ తనలో ఆమె మదనపడింది. ఆవేశంలో కఠిన నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలాగా పశువులను తోలుకొని పొలానికి వెళ్లింది సదరు మహిళ. తనతో పాటు ఇద్దరు పిల్లలను కూడా తీసుకెళ్లింది. వెళ్తున్న దారి వెంట బావులను చూస్తూ ఉంది.
ఆమెతో పాటు పదేళ్ల కూతురుతో పాటు.. నాలుగేళ్ల చిన్నారి ఉంది. దగ్గర్లోనే ఆమెకు బావి కనిపించింది. ఇద్దరు పిల్లలను అందులో తోసేసి.. ఆమె కూడా అక్కడే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఘటనా స్థలంలోనే పెద్ద కూతురు, తల్లి అక్కడిక్కడే మరణించగా.. నాలుగేళ్ల చిన్నారి మాత్రం బావి ఇటుకల మధ్య చిక్కి.. ప్రాణాలతో బయటపడింది. అటుగా వెళ్తున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు.
అత్తతో మొబైల్ విషయంలో గొడవ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఛతర్పూర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ శశాంక్ జైన్ వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇలా కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…