అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున తెలుగులో విజయవంతమైన చిత్రాలు తీస్తూ.. బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు. అయితే ఈ హీరోల బాలివుడ్ ప్రయాణం 1990 సంవత్సరంలో ప్రారంభమైంది. తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంకుశం చిత్రం ఘనవిజయం సాధించింది. ఇదే చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తూ గీతాఆర్ట్స్ నిర్మాణం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘ప్రతిబంద్’ చిత్రం 1990 సెప్టెంబర్ లో విడుదల అయింది. హిందీలో చిరంజీవి తన మొదటి చిత్రంతో ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ఆ తర్వాత 1989, అన్నపూర్ణ బ్యానర్, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో శివ చిత్రం విడుదలైంది. తెలుగులో అఖండ విజయం సాధించిన ఈ చిత్రాన్ని.. దాదాపుగా అదే నటినటులు, టెక్నీషియన్స్ తో హిందీలో శివ అనే పేరుతో 1990 డిసెంబర్ లో విడుదల చేశారు. అక్కడ ఈ చిత్రం ఘన విజయం సాధించింది.
ఆ తర్వాత 1992, కె.ఎస్.రామారావు నిర్మాణం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చంటి చిత్రంలో వెంకటేష్ మీనా హీరో, హీరోయిన్లుగా నటించారు. తెలుగులో ఈ సినిమా ఘన విజయం సాధించడంతో, హిందీలో 1993 సురేష్ ప్రొడక్షన్స్, మురళీ మనోహర్ రావు దర్శకత్వంలో ‘అనారి’ చిత్రం విడుదల అయ్యింది. సినిమాలో వెంకటేష్ కరిష్మకపూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం పొందింది.
ఇదే సమయంలో ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం, బాలకృష్ణతో హిందీలో ఒక చిత్రాన్ని నిర్మించాలని, తేజాబ్ చిత్ర దర్శకుడైన ఎన్.చంద్రాను కలవడం జరిగింది. బాలకృష్ణతో సినిమా తీయడానికి దర్శకుడు ఎన్.చంద్ర అంగీకరించారు. ఇకపోతే తేజాబ్ చిత్రంలో ఎంతో పేరుపొందిన హీరోయిన్ మాధురి దీక్షిత్ ను ఈ సినిమాలో బాలకృష్ణతో జోడిగా తీసుకోవాలనుకున్నారు. తెలుగు చిత్రాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ మాధురి దీక్షిత్ వాటిని తిరస్కరించింది. ఆ క్రమంలో ఏఎం. రత్నం, ఎన్ చంద్ర ఆమెను కలిసి చివరికి ఒప్పించారు. అలా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లడంలో కొంత ఆలస్యం అయ్యింది. అయితే దర్శకుడు చంద్ర డేట్స్ రెండు సంవత్సరాల వరకు ఖాళీ లేకపోవడంతో సినిమా కాస్త వాయిదా పడింది. తర్వాత దర్శకుడు ఎన్.చంద్ర డేట్స్ దొరికినప్పటికీ మళ్లీ బాలకృష్ణ తెలుగు సినిమాలతో బిజీ అయ్యారు. అలా బాలయ్య బాలీవుడ్ సినిమాకు మధ్య లోనే బ్రేక్ పడింది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…