ఆ హిందూ దేవాలయంలో దేవుడి దర్శణం కోసం వచ్చే భక్తులకు ఏదైనా వాహనం ఉంటే.. వాటిని ఆలయ సమీపంలో పార్కింగ్ చేయడానికి వీలు లేదని ఆ దేవాలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిబంధన కేవలం హిందువులు కానీ వారికి మాత్రమే అంటూ సంచలన ప్రకటన చేసింది. అది ఎక్కడ.. విషయాలు ఏంటో తెలుసుకుందాం..
కర్ణాటకలోని మంగళూరులో ఉన్న పుత్తూరు మహాలింగేశ్వర దేవాలయ కమిటీ తాజా నిర్ణయం వార్తల్లోకి ఎక్కింది. ఆలయ సమీపంలో ఓ నోటీస్ బోర్డును పెట్టారు. ఈ బోర్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో పాటు వివాదానికి కూడా దారి తీసింది. హిందువులు కానీవారు ఆలయ ఆవరణలో పార్కింగ్ చేయరాదని పుత్తూరు దేవస్థాన కమిటీ నిర్ణయించింది.
ఈ నిర్ణయం కాదని ఎవరైనా పార్కింగ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ హెచ్చరించింది. దీంతో దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. కమిటీ సభ్యులు వివరణ ఇచ్చారు. ఆలయానికి సంబంధించి పార్కింగ్ స్థలం అనేది చాలా తక్కువగా ఉంది. ఆలయానికి ప్రహరీ గోడ లేదు. ఆలయానికి వచ్చే భక్తులు కాకుండా ఇతరులు కూడా ఇక్కడే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణలో అవాంఛనీయ సంఘటనలు జరకుండా ఉండాలనే ఉద్దశ్యంతో ఇలా చేశామన్నారు.
ఒకవేళ ఎవరైనా హిందూహేతరులు పార్కింగ్ అభ్యర్థనతో వచ్చి ఫిర్యాదు చేస్తే కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆలయ సమీపంలో ఎక్కువగా పార్కింగ్ స్థలం లేకపోవడంతో.. ఇతర ప్రదేశాలకు, బ్యాంకులకు వెళ్లే వారు ఆలయ పరిసరాల్లోనే పార్కింగ్ చేస్తున్నారు. అంతేకానీ మతాల మధ్యఅంతరాలు చూపాలనుకోవడం లేదని ఆలయ కమిటీ వివరణ ఇచ్చింది.అయితే ఈ విషయాన్ని పలువురు సామాజిక రాజకీయ నేతలు తప్పుబడుతూ.. కమిటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే శకుంతల శెట్టి కోరారు.
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…