Tag Archives: loss

Lokesh: మరోసారి మంగళగిరిలో లోకేష్ కి ఓటమి తప్పదా?

Lokesh: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఎన్నికలలో మొదటిసారి పోటీ చేశారు. అయితే ఈయన గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైపు పోటీ చేసినటువంటి ఈయన ఆయన చేతిలో సుమారు 5000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు.

ఇలగతే ఎన్నికలలోకేష్ ఓడిపోవడంతో ఈసారి ఎలాగైనా కూడా మంగళగిరిలో గెలవాలి అన్న ఉద్దేశంతో ఈయన ఈ ఐదు సంవత్సరాలపాటు మంగళగిరిలో తరచూ పర్యటిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలలో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా లోకేష్ మంగళగిరి నుంచి పోటీకి సిద్ధం కాగా ఎలాగైనా తనని ఓడించే దిశగా వైసిపి వ్యూహం రచిస్తోంది..

ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫున మురుగుడు లావణ్యను రంగంలోకి దించారు .ఈమె బిసి మహిళా కావటం విశేషం మంగళగిరిలో పెద్ద ఎత్తున బిసి ఓట్లు ఉండటంతో తనకి సీటు కేటాయించారు అంతేకాకుండా ఈమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడంతో స్థానికంగా ఆమెకు మరింత మద్దతు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బీసీ ఓట్లే లక్ష్యంగా..
మొదటినుంచి కూడా మంగళగిరిలో వైకాపాకు మంచి మద్దతు లభిస్తుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి లోకేష్ కి కూడా కాస్త మద్దతు ఉందని చెప్పాలి. ఇలా ఈయనకు మద్దతు పెరిగిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక బీసీ మహిళ అయినటువంటి లావణ్యను జగన్ రంగంలోకి దించారు. దీంతో ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్ కి ఓటమి తప్పదని అక్కడ వైసిపి జెండా ఎగురుతుందంటూ వైసిపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికలలో లావణ్య లోకేష్ కి ఎలాంటి పోటీ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Work From Home: వర్క్ ఫ్రం హోంతో ఇన్ని అనర్థాలా..? వీటికి పరిష్కారం ఇదే..!

Work From Home: కరోనా కారణంగా ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రం హోమ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ, సేవల రంగాలకు చెందిన ఉద్యోగులు గత రెండేళ్ల నుంచి ఇంటి నుంచే తమ ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు. అయితే డిసెంబర్ లో మళ్లీ ఆఫీసులకు రావాలంటూ ఉద్యోగులకు పిలుపు వచ్చింది.

ork From Home: కరోనా కారణంగా ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రం హోమ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ, సేవల రంగాలకు చెందిన ఉద్యోగులు గత రెండేళ్ల నుంచి ఇంటి నుంచే తమ

అయితే థర్డ్ వేవ్, ఓమిక్రాన్ భయాల వల్ల మళ్లీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. 
ఇదిలా ఉంటే దీర్ఘకాలం వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజులో ఒకే ప్రదేశంలో కూర్చుని పనిచేస్తుంటారు ఉద్యోగులు. ఇలా చేస్తూనే ఏదో ఒకటి తింటూ ఉంటారు.

ork From Home: కరోనా కారణంగా ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రం హోమ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ, సేవల రంగాలకు చెందిన ఉద్యోగులు గత రెండేళ్ల నుంచి ఇంటి నుంచే తమ

దీని వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. గంటల తరబడి కంప్యూటర్ ముందు కోర్చోవడమే కాదు… శరీరానికి కాస్త వ్యాయామం అవసరమంటున్నారు.ఇలాగే పనిచేస్తే 20 ఏళ్లలో విపరీతంగా బరువు పెరిగిపోవడంతో పాటు ఉబకాయం, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వంటి జబ్బులు వస్తాయి.

గంట – 2 గంటలకు ఓసారైనా ..

దీంతో పాటు రిపీటెట్ టైపింగ్ స్ట్రెస్, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. వెన్నెముక నొప్పితో పాటు మెడ నొప్పులు వస్తాయి. దీంతో పాటు చర్మం పొడిబారిపోతుంది.వీటన్నింటికి చెక్ పెట్టాలంటే వ్యాయామమే సరైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారు గంట – 2 గంటలకు ఓసారైనా పనిని పక్కన పెట్టి నడవాలంటున్నారు. దీంతో పాటు ఉదయం వ్యాయామం చేయాలని చెబుతున్నారు. రోజుకు కంప్యూటర్ పై 6-8 గంటల పనిని మాత్రమే చేయాలంటున్నారు. 7-9 గంటలు చక్కని నిద్ర అవసరమని చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో గడపటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Tirupati MP: తిరుపతి ఎంపీకి టోకరా..! దాదాపు రూ.5 కోట్ల వరకు..!

Tirupati MP: నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు, దోపిడీలు చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా మనకు తెలియకుండానే మన డబ్బులను టెక్నాలజీ సహాయంతో దొంగిలిస్తున్నారు.

Tirupati MP: తిరుపతి ఎంపీకి టోకరా..! దాదాపు రూ.5 కోట్ల వరకు..!

ఓటీపీ ఫ్రాడ్స్, లాటరీ వచ్చిందని ప్రజల్ని మోసాలు చేయడం ఇటువంటి కేసులు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఏదో చదువుకోని వారు మోసపోతున్నారంటే.. ఏమో అనుకోవచ్చు, కానీ చదువుకుంటూ… ఉన్నత ఉద్యోగాలు చేసే వారు కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. 

ఎంపీ అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా..

తాజాగా రాజకీయ నాయకులు కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా తిరుపతి ఎంపీ గురుమూర్తికి సైబర్ చీటర్ ఫోన్ కాల్ చేశాడు. సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తూ… తనను అభిషేక్ అనే వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. ఖాదీ పరిశ్రమ సబ్సిడీ రుణాల కింద రూ. 5 కోట్లు మంజూరైనట్లు నమ్మబలికాడు. 


ఎంపీ అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా..

ఇదిలా ఉంటే మంజూరైన రుణాలు కావాలంటే తన అకౌంట్ డబ్బులు వేయాలన్న అభిషేక్.. 25 దరఖాస్తులకు ఒక్కొక్క దానికి రూ. 1.5 లక్షలు వేయాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన తిరుపతి ఎంపీ గురుమూర్తి… వెంటనే సీఎంఓ కార్యాలయానికి ఫోన్ చేసి విషయంపై ఆరా తీశారు. ఆ పేరుతో ఎవరూ లేరని నిర్థారించుకున్న తరువాత.. ఎంపీ అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. మెయిల్ ద్వాారా వివరాలను ఎంపీ, ఎస్పీకి పంపించాడు. ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సైబర్ చీటర్ ను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ఓటమికి కారణం.. నాగబాబేనా?

అక్టోబర్ 10వ తేదీ జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి గత కొద్ది రోజులుగా పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఒకరిపై మరొకరు పరస్పరం మాటల యుద్ధం చేసుకుంటూ ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరి ప్యానల్ సభ్యుల గురించి మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇక అక్టోబర్ 10వ తేదీ జరిగిన ఎన్నికలలో ప్రకాష్ రాజ్ పానల్ ఘోరంగా ఓటమి చవిచూసింది.

ప్రకాష్ రాజ్ ఇంత ఘోరంగా ఓడి పోవడానికి గల కారణం నాగబాబే అంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మద్దతు తెలుపుతూ ప్రెస్ మీట్ పెట్టి నోటిదురుసు కారణంగానే మంచు విష్ణు అధిక మెజార్టీతో గెలిచాడని చెప్పవచ్చు.సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు అయిన కోటా శ్రీనివాస్ రావు పట్ల నాగబాబు మాట్లాడిన తీరుపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక సీనియర్ నటుడుని పట్టుకొని మనిషి కాదు.. జంతువు రేపు మాపో పోయే నీకెందుకు ఇలాంటి మాటలు అన్నీ అంటూ కోట శ్రీనివాస్ రావు గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలను పలువురు తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. కోట శ్రీనివాస్ రావు గురించి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు క్షమించరాని అంటూ ఎంతో మంది ప్రకాష్ రాజ్ ప్యానల్ కి కాకుండా విష్ణుకి ఓట్లు వేయడం గమనార్హం.

ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకాష్ రాజ్ ఘోరంగా ఓటమిని చవి చూడటంతో నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ ఓటమికి 100% నాగబాబే కారణమంటూ పలువురు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా నాగబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేకపోతే విష్ణు నుంచి మరి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.