Tag Archives: mahasamudram movie

Sharwanand: సిద్ధార్థ్ అదితీ రావు హైదరి రిలేషన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన శర్వానంద్.. ఏమన్నారంటే?

Sharwanand: గత కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరో సిద్ధార్థ అతిథి రావు హైదరి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇలా ఈ జంట గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు వీరిద్దరూ కలిసే పలుసార్లు మీడియా కంటపడటమే కాకుండా అదితి పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక యువరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సిద్ధార్థ్ పోస్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు పుట్టుకొచ్చాయి.

ఇకపోతే సిద్ధార్థ్ అతిధి ఇద్దరు కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి శర్వానంద్ వీరిద్దరి రిలేషన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బాలయ్య శర్వానంద్ ప్రశ్నిస్తూ మీ సినిమాలో హీరోయిన్లను ఎలా ఎంపిక చేసుకుంటారని ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు శర్వానంద్ సమాధానం చెబుతూ హీరోయిన్ల విషయంలో నా ప్రమేయం ఏమాత్రం ఉండదని డైరెక్టర్లు ఎలా చెబితే అలా చేయడమేనంటూ సమాధానం ఇచ్చారు. మరి అదితీ సంగతి ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శర్వానంద్ సమాధానం చెబుతూ మహాసముద్రం సినిమాలో తను నటించింది అయితే తాను సిద్ధార్థ్ కి జంటగా నటించిందని తెలిపారు. శర్వానంద్ ఇలా చెప్పగానే రియల్ లైఫ్ లో కూడా ఆమె సిద్ధార్థకి జంటగా మారిందా అని ప్రశ్నించడంతో శర్వానంద్ నాకు తెలియదు అంటూ సమాధానం చెప్పారు.

Sharwanand: నిజజీవితంలోనూ సిద్ధార్థకు జంటగా అదితీ..

వీరి రిలేషన్ గురించి తనకు తెలియదని చెప్పినప్పటికీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం తను హృదయపూర్వక యువరాణి అని పోస్ట్ చేసినప్పుడు నాకు కూడా వారు రిలేషన్ లో ఉన్నారేమో అనిపించింది అంటూ ఈయన వారిద్దరి రిలేషన్ గురించి సమాధానం చెప్పారు. అంటే పలికిందంటావా అంటూ బాలయ్య అడగ్గా.. అందుకు శర్వా ఏమో పలికిందేమో అటు శర్వానంద్ సమాధానం చెప్పారు.

ప్రముఖ ఓటీటీకి ‘మహాసముద్రం’.. డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఆ ఓటీటీ సంస్థ..!

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ దసరా కానుకగా ఈనెల 14న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దీనిని ‘ఆర్‌ఎక్స్‌ 100’ విజయం తర్వాత అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్నా.

జగపతిబాబు, రావురమేశ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సిద్ధార్థ్ మళ్లీ టాలీవుడ్‏లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. భారీ బడ్జెట్‏తో ఏకే ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.

అందులో ఉన్న డైలాగ్స్ ప్రతీ ఒక్కరికీ నచ్చేశాయి. దీంతో సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ మాట్లాడుతూ.. దీనికి కథే హీరో అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. అయితే ఈ చిత్రం థియేట్రికల్ విడుదల అనంతరం ప్రముఖ ఓటిటి దిగ్గజం ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.

డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ మంచి డీల్ కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన తర్వాత దీనిని నెట్ ఫ్లిక్స్‏ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ‘మహాసముద్రం’ చిత్రానికి పోటీగా దసరా బరిలో మరో రెండు సినిమాలు దిగుతున్నాయి. అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మరియు నాగశౌర్య ‘వరుడు కావలెను’ చిత్రాలు అక్టోబర్ 15న థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు చిత్రాల్లో ఏవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.